లోక్సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త బిల్లు రాజకీయ వర్గాల్లోనే కాక దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైంది. కనీసం ఐదేళ్ల శిక్షకు గురయ్యే నేరారోపణలపై అరెస్టయి వరుసగా 30 రోజులు కస్టడీలో ఉంటే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రులు తమ పదవిని ఆటోమేటిక్గా కోల్పోవాలని ఇందులో ప్రతిపాదించారు.
31వ రోజు నుంచే ఆ నిబంధన అమల్లోకి వస్తుందని హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. రాజీనామా చేయకపోయినా ఈ చట్టం ప్రకారం వారి పదవి రద్దయిపోతుందని బిల్లులో పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనతో లోక్సభలో గట్టి వాదోపవాదాలు జరిగాయి. విపక్షాలు బిల్లుకు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశాయి.
నిరపరాధి అని నిరూపించుకునే వరకు ఎవరైనా నిర్దోషి అన్నది భారత చట్ట వ్యవస్థలో ప్రాథమిక సూత్రమని కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ గుర్తుచేశారు. కానీ ఈ బిల్లు ఆ సూత్రాన్నే మార్చేసేలా ఉందని ఆయన విమర్శించారు. అసదుద్దీన్ ఒవైసీ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ, “ఇది అధికారాల విభజన సూత్రానికి విరుద్ధంగా ఉంది. కార్యనిర్వాహక వ్యవస్థలు న్యాయమూర్తిలా, జ్యూరీలా, శిక్ష అమలు చేసేవారిలా మారిపోతాయి. ఈ నిబంధనను ప్రభుత్వాలను అస్థిరం చేయడానికి సులభంగా వాడుకోవచ్చు” అని హెచ్చరించారు.
సభలో గందరగోళం పెరిగే స్థాయికి వెళ్లింది. విపక్ష సభ్యులు నినాదాలు చేస్తూ వెల్లోకి దిగారు. కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ గుజరాత్ హోంమంత్రిగా ఉన్నప్పుడు అమిత్ షా స్వయంగా అరెస్టయిన విషయాన్ని గుర్తు చేశారు. దీనిపై స్పందించిన అమిత్ షా, “అప్పుడు నేను నైతిక బాధ్యత తీసుకొని రాజీనామా చేశాను. కోర్టు నన్ను నిర్దోషిగా తేల్చాకే తిరిగి ప్రభుత్వంలో చేరాను” అని చెప్పారు.
అమిత్ షా బిల్లులను హడావుడిగా తీసుకురాలేదని, సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపిస్తామని హామీ ఇచ్చారు. అయినప్పటికీ, విపక్షాలు ఈ బిల్లును పార్లమెంట్లోకి తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా, ఇది రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలకు విరుద్ధమని, ఎన్నికైన ప్రభుత్వాల స్థిరత్వానికి ముప్పు అని వాదిస్తున్నాయి.
మొత్తం మీద, ఈ కొత్త నిబంధన అమల్లోకి వస్తే రాజకీయ రంగంలో పెద్ద ఎత్తున ప్రభావం చూపే అవకాశం ఉంది. ఒకవైపు అవినీతిని, నేరారోపణలను అడ్డుకునే పాజిటివ్ అంచనా ఉన్నా, మరోవైపు నిర్దోషులైన నేతలు రాజకీయంగా నష్టపోయే అవకాశం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ బిల్లుపై తుది నిర్ణయం ఇంకా రావాల్సి ఉంది కానీ, ఇది రాబోయే రోజులలో దేశ రాజకీయ దిశను ప్రభావితం చేసే అంశంగా మారింది.
ఈ ఏడాది వేసవికి సరైన గమ్యస్థానంగా శ్రీనగర్ నిలిచింది. పెద్దగా ప్రచారం జరగనప్పటికి.. ఈసారి వేసవిలో చల్లదనాన్ని అస్వాదించేందుకు శ్రీనగర్…
నేటి యువత ప్రభుత్వాలపై తమ ఆగ్రహాన్ని పలు రకాలుగా వ్యక్తం చేస్తున్నారు. "మాకు కార్పొరేటర్ అయినా ఒకటే, సీఎం అయినా…
ఈ రోజుల్లో చెప్పిన డేటుకు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ అరుదైపోయారు. ఒకప్పుడు ఎంత భారీ చిత్రాలనైనా మూడు…
గత రెండు మాసాలకు పైగా ఇంధన, గ్యాస్ సమస్యలతో ప్రపంచ దేశాలు ఉక్కిరి బిక్కిరికి గురవుతున్నాయి. చమురు ధరలు పెరిగిపోవడమే…
తెలంగాణపై మరోసారి ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో సోమవారం చేపట్టిన జాతీయ…
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బీజేపీని మరింత బలోపేతం చేసుకునేందుకు ఆ పార్టీ అగ్ర నేతలు ప్రయత్నం చేస్తున్నారా? ప్రాంతీయ పార్టీల…