Political News

యాంటీ ప్ర‌చారం 4 ర‌కాలు: చంద్ర‌బాబు ప‌రిష్కారాలు

యాంటీ ప్ర‌చారం.. అధికారంలో ఉన్న పార్టీల‌కు అస్స‌లు న‌చ్చ‌నిది. గిట్టనిది కూడా. తాము ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు న‌మ్ముకున్న ఈ ప్ర‌చారమే.. అధికారంలోకి వ‌చ్చాక‌.. ఇబ్బంది పెడుతుంది. ఏపీలోనూ ఇప్పుడు అదే జ‌రుగుతోంది. కూట‌మి ప్ర‌భుత్వంపై యాంటీ ప్ర‌చారం జ‌రుగుతోంది. ఒక‌రూపంలో కాదు.. నాలుగు విధాలుగా ఈ ప్రచారం ఊపందుకుంది. ఈ విష‌యం ఎవ‌రో కాదు.. సాక్షాత్తూ సీఎం చంద్ర‌బాబు చెప్పుకొచ్చారు. తాజాగా ఆదివారం ఆయ‌న పార్టీ నాయ‌కుల‌తో జూమ్ మీటింగ్ నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో కూట‌మి స‌ర్కారుపై జ‌రుగుతున్న యాంటీ ప్ర‌చారాన్ని ఆయ‌న ప్ర‌ధానంగా ప్ర‌స్తావించారు. ఒక విధంగా కాదు.. నాలుగు విధాలుగా ఈ యాంటీ ప్ర‌చారం జ‌రుగుతోంద‌ని.. మీరు ఏం చేస్తున్నార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. వ్య‌క్తిగ‌తంగా నాయ‌కుల‌పై జ‌రుగుతున్న ప్ర‌చారంలో నిజం లేక‌పోతే.. వెంట‌నే బ‌య‌ట‌కు వ‌చ్చి.. వివ‌ర‌ణ ఎందుకు ఇవ్వ‌డం లేద‌ని వ్యాఖ్యానించారు. ఒక వేళ నిజ‌మే అయితే.. పద్ధ‌తి మార్చుకోవాల‌ని సునిశితంగా నాయ‌కుల‌ను సీఎం చంద్ర‌బాబు హెచ్చ‌రించారు.

ఇక‌, చంద్ర‌బాబు చెప్పిన నాలుగు విధాలు చూస్తే..

1) ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌పై ప్ర‌చారం చేస్తున్నారు: వాస్త‌వానికి ఈ వ్య‌తిరేక ప్ర‌చారం వైసీపీ చేస్తోంద‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ, చంద్ర‌బాబు సేక‌రించిన స‌మాచారం మేర‌కు.. సోష‌ల్ మీడియాలోనే ఎక్కువ‌గా ఈ ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనిని నిలువ‌రించేందుకు నాయ‌కులు అంతే యాక్టివ్ కావాల‌ని ఆయ‌న చెప్ప‌కొచ్చారు. అంతేకాదు.. ప్ర‌తి ఎమ్మెల్యే సోషల్ మీడియా లో అకౌంట్లు పెట్టుకోవాల‌ని కూడా సూచించారు.

2) వ్య‌క్తిగ‌త ప్ర‌చారం: ఎమ్మెల్యేలు, మంత్రుల‌పై కూడా.. వ్య‌క్తిగ‌తంగా వ్య‌తిరేక ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనిని నిలువ‌రించేందుకు వారే స్వ‌యంగా రంగంలోకి దిగాల‌ని.. ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండాల‌ని.. సూచించారు.

3) కూట‌మిపై వ్య‌తిరేక ప్ర‌చారం: ఈ విష‌యాన్ని కూడా సీరియ‌స్‌గా తీసుకోవాల‌ని చంద్ర‌బాబు సూచించారు. కూట‌మిలో అనైక్య‌త ఉంద‌ని.. ఈ ప్ర‌భుత్వం వ‌చ్చే నాలుగేళ్లు ఉండ‌క‌పోవ‌చ్చ‌ని కూడా ప్ర‌చారం జ‌రుగుతుండ‌డాన్ని ఆయ‌న ప్ర‌స్తావించారు. క‌ల‌సి క‌ట్టుగా అంద‌రితోనూ క‌లివిడిగా ఉండ‌డంతోనే ఈ ప్ర‌చారానికి చెక్ పెట్టాల‌న్నారు.

4) కేంద్ర స‌హ‌కారం: కేంద్రంలోని బీజేపీ కి మ‌ద్దుతుగా ఉన్నా.. రాష్ట్రానికి ఎలాంటి ప్ర‌యోజ‌నం లేద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనిని కూడా తిప్పికొట్టాల‌ని బాబు సూచించారు. అమ‌రావ‌తి, పోల‌వ‌రానికి కేంద్రం ఇచ్చిన నిధులు, సెమీకండెక్ట‌ర్ ప్రాజెక్టు, ఇత‌రత్రా స‌హ‌కారంపై చ‌ర్చించాల‌ని కూడా ఆయ‌న సూచించారు. మ‌రి త‌మ్ముళ్లు క‌దులుతారో లేదో చూడాలి.

Satya

Recent Posts

సీఎం ఇంటిముందే చెత్త పోసి నిరసన

నేటి యువత ప్రభుత్వాలపై తమ ఆగ్రహాన్ని పలు రకాలుగా వ్యక్తం చేస్తున్నారు. "మాకు కార్పొరేటర్ అయినా ఒకటే, సీఎం అయినా…

2 hours ago

లేటైతే… హైప్ హుళక్కే

ఈ రోజుల్లో చెప్పిన డేటుకు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ అరుదైపోయారు. ఒకప్పుడు ఎంత భారీ చిత్రాలనైనా మూడు…

6 hours ago

జ‌ల‌సంధి తెరిచారు.. ధ‌ర‌లు త‌గ్గాయి.. అయినా క‌ష్టాలే!

గ‌త రెండు మాసాల‌కు పైగా ఇంధ‌న, గ్యాస్ స‌మ‌స్య‌ల‌తో ప్ర‌పంచ దేశాలు ఉక్కిరి బిక్కిరికి గుర‌వుతున్నాయి. చ‌మురు ధ‌ర‌లు పెరిగిపోవ‌డ‌మే…

7 hours ago

‘బ‌లిదానాల‌తో ఏర్ప‌డిన తెలంగాణ‌లో నాయ‌కులు గ‌ద్దెనెక్కారు’

తెలంగాణ‌పై మ‌రోసారి ఏపీ డిప్యూటీ సీఎం జ‌న‌సేన పార్టీ అధినేత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో సోమ‌వారం చేప‌ట్టిన జాతీయ…

9 hours ago

ఆప‌రేష‌న్ టైగ‌ర్‌… బీజేపీ దూకుడు!

దేశ‌వ్యాప్తంగా ప‌లు రాష్ట్రాల్లో బీజేపీని మ‌రింత బ‌లోపేతం చేసుకునేందుకు ఆ పార్టీ అగ్ర నేత‌లు ప్రయత్నం చేస్తున్నారా? ప్రాంతీయ పార్టీల…

9 hours ago

అమరావతిపై ఆరా తీసిన సింగపూర్ ప్రధాని

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పురోగతిపై సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌ ఆసక్తి కనబరిచారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి…

11 hours ago