మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి.. ఉరఫ్ బీటెక్ రవి. టీడీపీలో ఇప్పుడు ఈ పేరు హాట్ హాట్. ఏ బాధ్యత అప్పగించినా.. ఆయన నెగ్గుకు రావడమే ప్రస్తుతం ఈ పేరును చర్చకు వచ్చేలా చేసింది. 2017-18 మధ్య, తర్వాత .. ఇప్పుడు కూడా.. బీటెక్ రవికి పార్టీ అధినేత చంద్రబాబు అప్పగించిన బాధ్యతను సంపూర్ణంగా విజయం దక్కించుకునేలా ఆయన వ్యవహరించారు. అప్పట్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి వివేకానందరెడ్డిని ఓడించే విషయంలో బీటెక్ రవి వ్యూహాత్మకంగా వ్యవహరించారు.
అప్పట్లో ఈ గెలుపు టీడీపీని నెక్ట్స్ లెవిల్కు తీసుకు వెళ్లింది. ఆ తర్వాత.. మరోసారి ఇప్పుడు జరిగిన జడ్పీటీసీ ఉప పోరులో తన సతీమణికి అవకాశం దక్కేలా చేసుకోవడంతోపాటు.. పార్టీని విజయం వైపు నడిపించడంలోనూ బీటెక్ రవి వ్యవహరించిన తీరుకు సీఎం చంద్రబాబు నుంచి ప్రశంసలు దక్కాయి. ప్రధానంగా మూడు వ్యూహాలతో నాడు-నేడు.. బీటెక్ రవి ముందుకు సాగారు. అవే ఆయనకు విజయాలు దక్కేలా చేశాయని పార్టీ నాయకులు అంటారు. ఫలితంగా ఆయా ఎన్నికల్లో తిరుగులేని విధంగా టీడీపీ ముందుకు సాగింది.
1) అందరినీ కలుపుకొని పోవడం: కడప అంటేనే.. వైఎస్ ఫ్యామిలీకి కంచుకోట. ఇక, పులివెందుల అంటే .. చెప్పాల్సిన అవసరం లేదు. అలంటి చోట టీడీపీని విజయ తీరం వైపు నడిపించడం అంటే.. కత్తిమీద సాము చేయడమే. అందుకే.. రవి అందరినీ కలుపుకొని పోవడంతోపాటు.. నాయకులకు సరైన దిశానిర్దేశం చేయడంతోపాటు తనదైన రాజకీయ చతురతను ప్రదర్శించారు. ఫ్యాక్షన్ జిల్లాలో చుక్క రక్త నేల రాలకుండా.. రాజకీయ విజయం దక్కడం వెనుక సమష్టి కృషికి పెద్ద పీట వేశారు.
2) పార్టీ లైన్: పార్టీ లైన్ ప్రకారం నడుచుకుని.. ప్రజలను సమీకరించడం కూడా.. బీటెక్ రవి వ్యూహాల్లో కీలకం. ఆయన ఏదైనా అనుకున్నా.. పార్టీలైన్ ప్రకారమే అడుగులు వేశారు. అదేసమయంలో ప్రజలకు వివరించి చెప్పడంలోనూ ఆయన సక్సెస్ అయ్యారు.
3) విస్తృత పర్యటనలు: ఎన్నికలు వస్తేనే కాదు.. రాకపోయినా.. ప్రజల మధ్య ఉంటున్న నాయకుడిగా రవికి పేరుంది. ఇది ఆయనకు మరింతగా కలిసి వస్తోంది. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ.. ఇప్పుడు జడ్పీ ఎన్నికల్లోనూ ఇది కలిసి వచ్చింది. ఫలితంగా .. రవి విజయం వెనుక.. స్వీయ కృషి, వ్యూహం, పార్టీలైన్ వంటివి స్పష్టంగా కనిపిస్తుంటాయని పరిశీలకులు కూడా అంగీకరిస్తారు.
This post was last modified on August 15, 2025 10:53 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…