Political News

‘స్త్రీ శక్తి’ సంబరం అంబరాన్నంటింది!

భారత 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. ఎక్కడికక్కడ జనం జాతీయ జెండాలను ఎగురవేసి… ఆయా ప్రాంతాల్లో జరిగిన అధికార వేడుకలకు హాజరై తమ ఉత్సాహాన్ని చాటుకున్నారు. సరిగ్గా… భారత స్వాతంత్య్ర దినోత్సవం రోజే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందిస్తానని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ప్రకటించిన సంగతి తెలిసిందే. అనుకున్నట్లుగానే శుక్రవారం మధ్యాహ్నం స్త్రీ శక్తి పేరిట రూపొందించిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించారు.

మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని ఉండవల్లిలో జరిగిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, స్థానిక ఎమ్మెల్యేగా కొనసాగుతున్న మంత్రి నారా లోకేశ్ లు పాలుపంచుకున్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరు కావడంతో సంబరం అంబరాన్నంటింది.

2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, జనసేనలతో కూటమి కట్టి బరిలోకి దిగిన టీడీపీ… తాము అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పేరిట ఆయా వర్గాలకు లబ్ధి చేకూర్చే పథకాలను అమలు చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. సూపర్ సిక్స్ ప్రచారం కూటమికి ఓ రేంజిలో మైలేజీని తీసుకొచ్చింది. అప్పటిదాకా 151 సీట్లతో బలీయంగా ఉన్న వైసీపీని ఈ ప్రచారమే 11 సీట్లకు పరిమితం చేసింది. కూటమికి ఏకంగా 164 సీట్లను కట్టబెట్టింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉన్నా… కాస్తంత గ్యాప్ తీసుకున్న సీఎం చంద్రబాబు సూపర్ సిక్స్ లోని ఒక్కో పథకాన్ని అమలులోకి తీసుకుని వచ్చారు. తాజాగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం రూపొందించిన స్త్రీ శక్తి పథకాన్ని కూడా ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ఏపీ మహిళలు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగానే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయవచ్చు.

ఆధార్ కార్డుల ఆధారంగా మహిళలకు ఆర్టీసీ అధికారులు బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తారు. ప్రయాణం ఉచితమే అయినా మహిళలకు ఆర్డీసీ కండక్టర్లు టికెట్లు జారీ చేస్తారు. ఈ టికెట్లపై స్త్రీ శక్తి అనే పేరు ముద్రించి ఉంటుంది. ఇక స్త్రీ శక్తి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో, ఎక్స్ ప్రెస్ లలో మాత్రమే ఉచిత ప్రయాణం అమలు అవుతుంది. ఇతరత్రా బస్సుల్లో ఈ పథకం అమలు కాదు. ఇదిలా ఉంటే… స్త్రీ శక్తి పథకం ప్రారంభోత్సవం సందర్భంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్… ఉండవల్లి నుంచి విజయవాడ వరకు మహిళలతో కలిసి ప్రయాణించారు. ఈ సందర్భంగా మహిళలతో వారి సమస్యలపై చంద్రబాబు ఆరా తీశారు. మరోవైపు ఆయా జిల్లాల్లో మంత్రులు ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

This post was last modified on August 15, 2025 4:44 pm

Share

Recent Posts

యష్ చేసిన పొరపాట్లే తప్పులుగా మారాయా

థియేటర్ల దగ్గర టాక్సిక్ కథ ముగిసిపోయింది కానీ దాని కథలు మాత్రం ఆగడం లేదు. తాజాగా సర్దార్ దర్శకుడు మిత్రన్…

2 hours ago

వైసీపీకి బిగ్ షాక్… బొత్స మేనల్లుడు రాజీనామా

2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన తర్వాత ఆ పార్టీ నుంచి చాలామంది నేతలు వాకౌట్ చేసిన సంగతి…

2 hours ago

ఈ ట్రంపు మాకొద్దు… బాబోయ్‌!

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మ‌ధ్యంతర ఎన్నిక‌ల సెగ భారీగా త‌గిలేలా క‌నిపిస్తోంది. మ‌ధ్యంతర ఎన్నిక‌లు వ‌చ్చే అక్టోబ‌రు-న‌వంబ‌రు మాసాల…

3 hours ago

బుచ్చిబాబు ప్రయత్నాలు ఎక్కడిదాకా వచ్చాయంటే

పెద్ది తర్వాత దర్శకుడు బుచ్చిబాబు బయట ఎక్కువ కనిపించడం లేదు. ఇరుముడి లాంటి ఒకటి రెండు ఈవెంట్స్ లో స్టేజి…

4 hours ago

సిద్దు సుమంత్ ఇద్దరికీ పనవ్వాలి

ఈ శుక్రవారం విడుదల కాబోతున్న సినిమాల్లో మహేంద్రగిరి వారాహి మీద క్రమంగా అటెన్షన్ వస్తోంది. పోటీ విపరీతంగా ఉన్నప్పటికీ కంటెంట్…

5 hours ago

H-1B ఉద్యోగి కోసం అదనపు ఫీజా… అమెరికా ప్లాన్ ఏంటి?

అమెరికాలో H-1B వీసాపై విదేశీ ఉద్యోగిని తీసుకోవాలంటే కంపెనీలు భారీగా అదనపు ఫీజు చెల్లించాల్సిన పరిస్థితి రావచ్చు. ప్రతి H-1B…

5 hours ago