ఏపీ ప్రతిపక్షం వైసీపీపై ఎప్పుడూ ఆగ్రహం వ్యక్తం చేసే చంద్రబాబు తాజాగా జోకులు పేల్చారు. అమరావతిపై సమీక్ష చేస్తున్న సమయంలో మంత్రి నారాయణకు ఓ మెసేజ్ వచ్చింది. ‘పులివెందులలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 11 మంది పోటీలో ఉన్నారు. అంతా ప్రశాంతంగా జరిగిపోయింది. ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికలు నిర్వంహించాం.’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఫోన్ నుంచి మంత్రి నారాయణకు మెసేజ్ వచ్చింది. దీనిని ఆయన సీఎం చంద్రబాబుకు చూపించారు. సాధారణంగా సీఎం సమక్షంలో మెసేజ్ రావడంతో ఆయన ఎలానూ అడుగుతారు కాబట్టి.. మంత్రి ఆయన అడగక ముందే చూపించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “11 మంది నామినేషన్లు వేశారా? అందరూ పోటీలో ఉన్నారా? ఎవరైనా ఉపసంహరించుకున్నారా? ” అని ప్రశ్నించారు. వైసీపీ ఎవరిపైనైనా ఒత్తిడి చేసి పోటీ నుంచి తప్పుకొనేలా చేసిందా? అని కూడా అడిగారు. దీనికి మంత్రి నారాయణ సమాధానం ఇస్తూ.. అందరూ పోటీలో ఉన్నారని.. ఎవరిపైనా ఒత్తిళ్లు తీసుకు రాలేదని, ఈ విషయంలో రాష్ట్ర ఎన్నికల అధికారులు బాగా పనిచేశారని ఆయన వ్యాఖ్యానించారు. “అయితే.. వైసీపీ లక్కీ నెంబర్తోనే ఎన్నికలు జరిగాయన్నమాట.” అని చంద్రబాబు చిరునవ్వులు చిందించారు. అంటే.. గత ఎన్నికల్లో వైసీపీకి 11 అసెంబ్లీ స్థానా ల్లోనే విజయం దక్కింది.
ఇప్పుడు జరిగిన పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలోనూ.. రెండు చోట్లా 11 మంది చొప్పున మాత్రమే పోటీలో ఉన్నారు. వీరిలో ఎవరూ నామినేషన్ ఉపసంహరించుకోకుండా చివరి వరకు పోరాడారు. ఇక, సీపీఐ, సీపీఎంలు సహా స్వతంత్ర అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు. దీంతో అలు పులివెందుల, ఇటు ఒంటిమిట్టల్లోనూ 11 చొప్పున అభ్యర్థులు పోటీ పడ్డారు. ఈ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ విషయాన్ని ప్రస్తావించిన సీఎం చంద్రబాబు.. “లక్కీ నెంబరు” అంటూ.. వైసీపీపై జోకులు పేల్చారు. దీనికి నారాయణ సహా.. సమావేశంలో ఉన్న సీఆర్డీఏ అధికారులు కూడా ముసిముసి నవ్వులు చిందించారు.
This post was last modified on August 13, 2025 9:57 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…