Political News

‘అది వైసీపీ ‘ల‌క్కీ’ నెంబ‌రు క‌దా’

ఏపీ ప్ర‌తిప‌క్షం వైసీపీపై ఎప్పుడూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసే చంద్ర‌బాబు తాజాగా జోకులు పేల్చారు. అమ‌రావ‌తిపై స‌మీక్ష చేస్తున్న స‌మ‌యంలో మంత్రి నారాయ‌ణ‌కు ఓ మెసేజ్ వ‌చ్చింది. ‘పులివెందుల‌లో ఎన్నిక‌ల పోలింగ్ ముగిసింది. మొత్తం 11 మంది పోటీలో ఉన్నారు. అంతా ప్ర‌శాంతంగా జ‌రిగిపోయింది. ప్ర‌జాస్వామ్య యుతంగా ఎన్నిక‌లు నిర్వంహించాం.’ అని టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ప‌ల్లా శ్రీనివాస‌రావు ఫోన్ నుంచి మంత్రి నారాయ‌ణ‌కు మెసేజ్ వ‌చ్చింది. దీనిని ఆయ‌న సీఎం చంద్ర‌బాబుకు చూపించారు. సాధార‌ణంగా సీఎం స‌మ‌క్షంలో మెసేజ్ రావ‌డంతో ఆయ‌న ఎలానూ అడుగుతారు కాబ‌ట్టి.. మంత్రి ఆయ‌న అడ‌గ‌క ముందే చూపించారు.

ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. “11 మంది నామినేష‌న్లు వేశారా? అంద‌రూ పోటీలో ఉన్నారా? ఎవ‌రైనా ఉప‌సంహ‌రించుకున్నారా? ” అని ప్ర‌శ్నించారు. వైసీపీ ఎవ‌రిపైనైనా ఒత్తిడి చేసి పోటీ నుంచి త‌ప్పుకొనేలా చేసిందా? అని కూడా అడిగారు. దీనికి మంత్రి నారాయ‌ణ స‌మాధానం ఇస్తూ.. అంద‌రూ పోటీలో ఉన్నార‌ని.. ఎవ‌రిపైనా ఒత్తిళ్లు తీసుకు రాలేదని, ఈ విష‌యంలో రాష్ట్ర ఎన్నిక‌ల అధికారులు బాగా ప‌నిచేశార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. “అయితే.. వైసీపీ ల‌క్కీ నెంబ‌ర్‌తోనే ఎన్నిక‌లు జ‌రిగాయ‌న్న‌మాట‌.” అని చంద్ర‌బాబు చిరున‌వ్వులు చిందించారు. అంటే.. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీకి 11 అసెంబ్లీ స్థానా ల్లోనే విజ‌యం ద‌క్కింది.

ఇప్పుడు జ‌రిగిన పులివెందుల‌, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక‌లోనూ.. రెండు చోట్లా 11 మంది చొప్పున మాత్ర‌మే పోటీలో ఉన్నారు. వీరిలో ఎవ‌రూ నామినేష‌న్ ఉప‌సంహ‌రించుకోకుండా చివ‌రి వ‌ర‌కు పోరాడారు. ఇక‌, సీపీఐ, సీపీఎంలు స‌హా స్వ‌తంత్ర అభ్య‌ర్థులు కూడా బ‌రిలో ఉన్నారు. దీంతో అలు పులివెందుల‌, ఇటు ఒంటిమిట్ట‌ల్లోనూ 11 చొప్పున అభ్య‌ర్థులు పోటీ ప‌డ్డారు. ఈ ఎన్నిక‌లు ప్ర‌శాంతంగా ముగిశాయి. ఈ విష‌యాన్ని ప్ర‌స్తావించిన సీఎం చంద్ర‌బాబు.. “ల‌క్కీ నెంబ‌రు” అంటూ.. వైసీపీపై జోకులు పేల్చారు. దీనికి నారాయ‌ణ స‌హా.. స‌మావేశంలో ఉన్న సీఆర్‌డీఏ అధికారులు కూడా ముసిముసి న‌వ్వులు చిందించారు.

This post was last modified on August 13, 2025 9:57 pm

Share

Recent Posts

మాజీ ముఖ్యమంత్రి తనయుడు అరెస్టు… అక్కడ పొలిటికల్ హీట్!

తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నటి త్రిష,…

18 minutes ago

ఆ వైరస్ యమ డేంజర్… ఇప్పటికే 22 మంది పిల్లలు మృతి

గుజరాత్‌లో చాందిపుర వైరస్‌ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్‌ కారణంగా ఇప్పటికే 22 మంది చిన్నారులు మృతిచెందినట్లు రాష్ట్ర…

34 minutes ago

సినిమా చూడాలంటే మ‌నోళ్ల త‌ర్వాతే ఎవ‌రైనా…

సినీ అభిమానులందు తెలుగు అభిమానులు వేరు అని ఎవ్వ‌రైనా ఒప్పుకోవాల్సిందే. త‌మ సినిమాల‌ను ప్ర‌మోట్ చేయ‌డం కోసం తెలుగు రాష్ట్రాల‌కు…

49 minutes ago

సూపర్ స్టార్ కూతురు ఎలా చేసింది

మలయాళం సూపర్ స్టార్ గా పేరొందిన మోహన్ లాల్ కూతురు విస్మయ ఈ శుక్రవారం విడుదల కాబోతున్న తుదక్కంతో తెరంగేట్రం…

2 hours ago

పీకే విక్టరీ బీజేపీకి డేంజర్ బెల్స్ మోగించినట్టేనా?

బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…

6 hours ago

40 నిముషాల్లోనే శ్రీవారి దర్శనం… కేవలం వారికే!

నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…

10 hours ago