Political News

‘అది వైసీపీ ‘ల‌క్కీ’ నెంబ‌రు క‌దా’

ఏపీ ప్ర‌తిప‌క్షం వైసీపీపై ఎప్పుడూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసే చంద్ర‌బాబు తాజాగా జోకులు పేల్చారు. అమ‌రావ‌తిపై స‌మీక్ష చేస్తున్న స‌మ‌యంలో మంత్రి నారాయ‌ణ‌కు ఓ మెసేజ్ వ‌చ్చింది. ‘పులివెందుల‌లో ఎన్నిక‌ల పోలింగ్ ముగిసింది. మొత్తం 11 మంది పోటీలో ఉన్నారు. అంతా ప్ర‌శాంతంగా జ‌రిగిపోయింది. ప్ర‌జాస్వామ్య యుతంగా ఎన్నిక‌లు నిర్వంహించాం.’ అని టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ప‌ల్లా శ్రీనివాస‌రావు ఫోన్ నుంచి మంత్రి నారాయ‌ణ‌కు మెసేజ్ వ‌చ్చింది. దీనిని ఆయ‌న సీఎం చంద్ర‌బాబుకు చూపించారు. సాధార‌ణంగా సీఎం స‌మ‌క్షంలో మెసేజ్ రావ‌డంతో ఆయ‌న ఎలానూ అడుగుతారు కాబ‌ట్టి.. మంత్రి ఆయ‌న అడ‌గ‌క ముందే చూపించారు.

ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. “11 మంది నామినేష‌న్లు వేశారా? అంద‌రూ పోటీలో ఉన్నారా? ఎవ‌రైనా ఉప‌సంహ‌రించుకున్నారా? ” అని ప్ర‌శ్నించారు. వైసీపీ ఎవ‌రిపైనైనా ఒత్తిడి చేసి పోటీ నుంచి త‌ప్పుకొనేలా చేసిందా? అని కూడా అడిగారు. దీనికి మంత్రి నారాయ‌ణ స‌మాధానం ఇస్తూ.. అంద‌రూ పోటీలో ఉన్నార‌ని.. ఎవ‌రిపైనా ఒత్తిళ్లు తీసుకు రాలేదని, ఈ విష‌యంలో రాష్ట్ర ఎన్నిక‌ల అధికారులు బాగా ప‌నిచేశార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. “అయితే.. వైసీపీ ల‌క్కీ నెంబ‌ర్‌తోనే ఎన్నిక‌లు జ‌రిగాయ‌న్న‌మాట‌.” అని చంద్ర‌బాబు చిరున‌వ్వులు చిందించారు. అంటే.. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీకి 11 అసెంబ్లీ స్థానా ల్లోనే విజ‌యం ద‌క్కింది.

ఇప్పుడు జ‌రిగిన పులివెందుల‌, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక‌లోనూ.. రెండు చోట్లా 11 మంది చొప్పున మాత్ర‌మే పోటీలో ఉన్నారు. వీరిలో ఎవ‌రూ నామినేష‌న్ ఉప‌సంహ‌రించుకోకుండా చివ‌రి వ‌ర‌కు పోరాడారు. ఇక‌, సీపీఐ, సీపీఎంలు స‌హా స్వ‌తంత్ర అభ్య‌ర్థులు కూడా బ‌రిలో ఉన్నారు. దీంతో అలు పులివెందుల‌, ఇటు ఒంటిమిట్ట‌ల్లోనూ 11 చొప్పున అభ్య‌ర్థులు పోటీ ప‌డ్డారు. ఈ ఎన్నిక‌లు ప్ర‌శాంతంగా ముగిశాయి. ఈ విష‌యాన్ని ప్ర‌స్తావించిన సీఎం చంద్ర‌బాబు.. “ల‌క్కీ నెంబ‌రు” అంటూ.. వైసీపీపై జోకులు పేల్చారు. దీనికి నారాయ‌ణ స‌హా.. స‌మావేశంలో ఉన్న సీఆర్‌డీఏ అధికారులు కూడా ముసిముసి న‌వ్వులు చిందించారు.

This post was last modified on August 13, 2025 9:57 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

2 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

6 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

7 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

7 hours ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

8 hours ago

రచయితగా కొత్త రూటులో టాలీవుడ్ హీరో?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…

10 hours ago