Political News

అమరావతి పనుల్లో ఊహించని వేగం: చంద్రబాబు

ఏపీ రాజధాని అమరావతి పనుల్లో ఊహించని వేగం కనిపిస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. తాజాగా అమరావతి పనులపై ఆయన సమీక్షించారు. మంత్రి నారాయణ, రాజధాని ప్రాంత సాధికార అథారిటీ (సీఆర్‌డీఏ) అధికారులు, అదేవిధంగా రాజధానిలో పనులు చేస్తున్న వివిధ కాంట్రాక్టర్లు కూడా సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు పనుల పురోగతిపై సంతోషం వ్యక్తం చేశారు. రికార్డు స్థాయిలో పనులు చేపట్టారని, అయితే నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడవద్దని సూచించారు. కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తర్వాత ఇప్పటి వరకు 81,317 కోట్ల రూపాయల పనులను సీఆర్‌డీఏ ప్రతిపాదించిందని సీఎం చెప్పారు.

వీటన్నింటికీ ప్రభుత్వం ఆమోదం తెలిపిందని చంద్రబాబు చెప్పారు. ప్రస్తుతం 50 వేల కోట్ల రూపాయలకు పైగా పనులకు టెండర్లు పిలిచామని, ఇప్పటి వరకు 74 కీలక ప్రాజెక్టులకు సంబంధించిన పనులు జోరుగా సాగుతున్నాయని పేర్కొన్నారు. వీటిలో న్యాయ, విద్య, ఉద్యోగుల క్వార్టర్లు సహా నవనగరాలకు సంబంధించిన ఇతర నగరాలు ఉన్నాయని చెప్పారు. అదేవిధంగా వరద నీరు పోయేలా డెక్టులు, రహదారుల నిర్మాణం, డ్రైనేజీ పనులు కూడా ఈ ప్రాజెక్టుల్లో ఉన్నాయని తెలిపారు. రికార్డు సమయంలో పనులు చేస్తున్నారని కాంట్రాక్టర్లను, పనులు చేసేలా ప్రోత్సహిస్తున్నారని మంత్రి నారాయణను చంద్రబాబు అభినందించారు.

2029 టార్గెట్

రాజధాని అమరావతి పనులను 2029 నాటికి 70 శాతం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రి నారాయణకు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. నిధులకు సంబంధించి కేంద్రం నుంచి మంచి సహకారం లభిస్తోందని అన్నారు. అదేవిధంగా రుణ సంస్థలు (ప్రపంచ బ్యాంకు, ఏడీబీ) కూడా మన సంకల్పాన్ని అర్థం చేసుకున్నాయని, త్వరితగతిన రుణాలు ఇస్తున్నాయని చెప్పారు. ఈ నిధులను ప్రతిపాదిత పనులకు కేటాయించాలని, పనులు ఆగకుండా చూడాలని సూచించారు. ప్రస్తుతం వర్షాకాలం కొనసాగుతున్న నేపథ్యంలో కూడా పనులు ఆగకుండా చూడాలని సూచించారు. ఏ అవసరం వచ్చినా తనను సంప్రదించవచ్చని సీఆర్‌డీఏ అధికారులకు చంద్రబాబు సూచించారు.

This post was last modified on August 12, 2025 8:28 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

32 minutes ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

3 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

4 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

6 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

8 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

8 hours ago