Political News

అమరావతి పనుల్లో ఊహించని వేగం: చంద్రబాబు

ఏపీ రాజధాని అమరావతి పనుల్లో ఊహించని వేగం కనిపిస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. తాజాగా అమరావతి పనులపై ఆయన సమీక్షించారు. మంత్రి నారాయణ, రాజధాని ప్రాంత సాధికార అథారిటీ (సీఆర్‌డీఏ) అధికారులు, అదేవిధంగా రాజధానిలో పనులు చేస్తున్న వివిధ కాంట్రాక్టర్లు కూడా సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు పనుల పురోగతిపై సంతోషం వ్యక్తం చేశారు. రికార్డు స్థాయిలో పనులు చేపట్టారని, అయితే నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడవద్దని సూచించారు. కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తర్వాత ఇప్పటి వరకు 81,317 కోట్ల రూపాయల పనులను సీఆర్‌డీఏ ప్రతిపాదించిందని సీఎం చెప్పారు.

వీటన్నింటికీ ప్రభుత్వం ఆమోదం తెలిపిందని చంద్రబాబు చెప్పారు. ప్రస్తుతం 50 వేల కోట్ల రూపాయలకు పైగా పనులకు టెండర్లు పిలిచామని, ఇప్పటి వరకు 74 కీలక ప్రాజెక్టులకు సంబంధించిన పనులు జోరుగా సాగుతున్నాయని పేర్కొన్నారు. వీటిలో న్యాయ, విద్య, ఉద్యోగుల క్వార్టర్లు సహా నవనగరాలకు సంబంధించిన ఇతర నగరాలు ఉన్నాయని చెప్పారు. అదేవిధంగా వరద నీరు పోయేలా డెక్టులు, రహదారుల నిర్మాణం, డ్రైనేజీ పనులు కూడా ఈ ప్రాజెక్టుల్లో ఉన్నాయని తెలిపారు. రికార్డు సమయంలో పనులు చేస్తున్నారని కాంట్రాక్టర్లను, పనులు చేసేలా ప్రోత్సహిస్తున్నారని మంత్రి నారాయణను చంద్రబాబు అభినందించారు.

2029 టార్గెట్

రాజధాని అమరావతి పనులను 2029 నాటికి 70 శాతం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రి నారాయణకు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. నిధులకు సంబంధించి కేంద్రం నుంచి మంచి సహకారం లభిస్తోందని అన్నారు. అదేవిధంగా రుణ సంస్థలు (ప్రపంచ బ్యాంకు, ఏడీబీ) కూడా మన సంకల్పాన్ని అర్థం చేసుకున్నాయని, త్వరితగతిన రుణాలు ఇస్తున్నాయని చెప్పారు. ఈ నిధులను ప్రతిపాదిత పనులకు కేటాయించాలని, పనులు ఆగకుండా చూడాలని సూచించారు. ప్రస్తుతం వర్షాకాలం కొనసాగుతున్న నేపథ్యంలో కూడా పనులు ఆగకుండా చూడాలని సూచించారు. ఏ అవసరం వచ్చినా తనను సంప్రదించవచ్చని సీఆర్‌డీఏ అధికారులకు చంద్రబాబు సూచించారు.

This post was last modified on August 12, 2025 8:28 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

2 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

6 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

7 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

7 hours ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

8 hours ago

రచయితగా కొత్త రూటులో టాలీవుడ్ హీరో?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…

10 hours ago