పోలీసులపై వైసీపీ నాయకులు మరోసారి నోరు వేసుకున్నారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్న చందంగా వైసీపీ అధినేత జగన్ పోలీసులను తరచుగా హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ నాయకులు కూడా అదే బాటలో నడుస్తున్నారు. తాజాగా పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తమను పోలీసులు ఇబ్బందులకు గురి చేశారని, ఎంపీ అయిన అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకుని రోడ్ల వెంబడి తిప్పారని పేర్కొంటూ ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీసులను ఉద్దేశించి రాచమల్లు మాట్లాడుతూ.. “మేం అధికారంలోకి వస్తాం. వచ్చిన తర్వాత మీ ఉద్యోగాలు ఉండవు. ఊడ పెరుకుతాం” అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు అధికార పార్టీకి పోలీసులు గుమస్తాలుగా పనిచేస్తున్నారని అన్నారూ. ఇప్పుడు తప్పులు చేస్తున్న పోలీసుల పేర్లను తాము నమోదు చేసుకుంటున్నామని, నాలుగేళ్లలో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వారి అంతు చూస్తామని వ్యాఖ్యానించారు. పులివెందుల ఏమైనా టీడీపీ అడ్డానా? వారికి ఎందుకు సహకరించారు? ఎందుకు చెంచాగిరీ చేశారు? అని ప్రశ్నించారు. ఇలాంటివారిని వదిలిపెట్టేది లేదన్నారు.
ముగిసిన పోలింగ్
పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు మంగళవారం ఉదయం ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. అయితే ఐదు గంటల వరకు లైన్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించినట్టు అధికారులు తెలిపారు. ఇక పులివెందులలో 15 బూత్లలోను, ఒంటిమిట్టలో 30 పోలింగ్ కేంద్రాల్లోనూ ఓటర్లు తమ హక్కును వినియోగించుకున్నారు. ఇదిలావుంటే పులివెందులలో మాత్రం ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. పులివెందుల నేతలను (టీడీపీ, వైసీపీకి చెందిన) పోలీసులు ముందుగానే అదుపులోకి తీసుకున్నారు. అయితే ఒంటిమిట్టలో మాత్రం పెద్దగా అల్లర్లు జరగకుండా ప్రశాంతంగానే సాగిపోయింది.
This post was last modified on August 12, 2025 7:40 pm
జన నాయకుడు పైరసీని పూర్తి స్థాయిలో కాకపోయినా గరిష్ట స్థాయిలో కట్టడి చేయడంలో నిర్మాణ సంస్థ సక్సెస్ అయ్యింది. వీడియో…
అదేంటో కానీ.. ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి పలు కీలక విషయాలు సాధారణ రోజుల్లో ఎక్కడా గుర్తుకు ఉండవు... రావు. ఎన్నికల…
సీతారామం, హాయ్ నాన్న లాంటి పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ పాత్రలు దక్కించుకున్న మృణాల్ ఠాగూర్ టాలీవుడ్ తొలి అడుగులు చాలా గొప్పగా…
జనాలను నవ్వించడం కోసం సెలబ్రెటీల వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లిపోతే పరిణామాలు ఎలా ఉంటాయో మరోసారి రుజువైంది. పవన్ కళ్యాణ్, రామ్…
తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించి... తొలి పదేళ్ల పాటు ఆ రాష్ట్రాన్ని పాలించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) తన…
హీరోయిన్ కృతి శెట్టిని చూస్తుంటే పాపం అనిపించక మానదు. ఉప్పెనతో డెబ్యూ చేసినప్పుడు తనో సెన్సేషన్ అవుతుందని అందరూ భావించారు.…