Political News

నా సహనం పరీక్షిస్తున్నారా!

గత నాలుగు రోజులుగా స్వరం పెంచి వ్యాఖ్యలు చేస్తున్న మునుగోడు ఎమ్మెల్యే, తెలంగాణ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉరఫ్ రాజా మరింత దూకుడు పెంచారు. తనకు మంత్రి పదవి దక్కకపోవడంపై ఆయన తీవ్ర అసహనంతో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గత నాలుగు రోజులుగా ఆయన స్పందిస్తూనే ఉన్నారు. మంత్రి పదవి ఇస్తామన్నారా లేదా అని నిలదీశారు. దీనికి ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ “ఔను ఇస్తామని మాటిచ్చాం” అంటూ సమర్థించారు.

ఈ పరిణామాల తర్వాత మరింతగా రాజా రెచ్చిపోతున్నారు. తాజాగా కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. “నా సహనం పరీక్షిస్తున్నారా?” అంటూ ప్రశ్నించారు. అంతేకాదు ఆయన ఈ సందర్భంగా నల్లగొండ జిల్లా నుంచి 11 మంది ఎమ్మెల్యేలు గెలిచారని, వారికి మూడు మంత్రి పదవులు ఇస్తే తప్పేంటని అధిష్ఠానాన్ని ప్రశ్నించారు. అలాగే ఖమ్మం నుంచి 9 మంది ఎమ్మెల్యేలు గెలిచారని, అక్కడ ముగ్గురికి మంత్రి పదవులు ఇచ్చారని అన్నారు. కాబట్టి తమకు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

అంతేకాదు “ఒకే కుటుంబంలో ఇద్దరికీ మంత్రి పదవులా?” అని కొందరు అంటున్నారు. మరికొందరు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. కానీ ఎమ్మెల్యేలుగా టికెట్లు ఇచ్చినప్పుడు తెలియదా మేము అన్నదమ్ములమని? పార్లమెంటు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినప్పుడు మేము అన్నదమ్ములమనే విషయాన్ని మరిచిపోయారా? మీ గెలుపు కోసం ఆ నాడు హామీలు గుప్పించి ఇప్పుడు ప్లేటు ఫిరాయిస్తారా?” అని సూటిగా ప్రశ్నించారు.

ఇదే సమయంలో తాను సహనంతో ఉన్నానని, తన సహనాన్ని పరీక్షించవద్దని పార్టీ నాయకులకు ఆయన సూచించారు. అంతేకాదు తనకు పదవి రాకుండా ఎవరు అడ్డుపడుతున్నారో తెలుసునని, సమయం వచ్చినప్పుడు బయట పెడతానని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించడం గమనార్హం. మరి దీనిపై పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి. మరోవైపు క్రమశిక్షణ సంఘం చీఫ్, ఎంపీ మల్లురవి రాజగోపాల్ రెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యలు తమ పరిశీలనలో లేవని వెల్లడించారు.

This post was last modified on August 12, 2025 1:40 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

5 minutes ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

3 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

6 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

6 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

9 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

11 hours ago