కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని పులివెందుల జెడ్పిటిసి ఉప ఎన్నిక వ్యవహారం తీవ్ర ఉత్కంఠగా మారిపోయింది. రెండు ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ మధ్య పోరు నువ్వా-నేనా అన్నట్టుగా సాగుతోంది. ఈ క్రమంలో ఎవరికివారు ఈ ఎన్నికలో విజయం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు దాడులు జరిగే అవకాశముందని సూచనలతో పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. వీరిలో వైసీపీ కీలక నాయకుడు, ఎంపీ అవినాష్ రెడ్డి సహా ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు ఉన్నారు.
మంగళవారం తెల్లవారుజామునే అలెర్టయిన పులివెందుల పోలీసులు డీఎస్పీ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ ఇంటికి చేరుకుని ఆయన్ని మంచంపై నుంచే బయటకు తీసుకువచ్చారు. అయితే తాను ఫ్రెష్ అయి వస్తానని చెప్పినా పోలీసులు వినిపించుకోలేదని వైసీపీ నాయకులు ఆరోపించారు. ఈ సందర్భంలో ఎంపీ అవినాష్ రెడ్డి, పోలీసుల మధ్య వాగ్వాదం, పెనుగులాట కూడా చోటుచేసుకుంది. అనంతరం ఎంపీ అవినాష్ రెడ్డిని బలవంతంగా పోలీసులు జీపులో ఎక్కించారు.
మరోవైపు పులివెందుల సహా ఒంటిమిట్ట జెడ్పిటిసి ఉప ఎన్నికల సందర్భంగా పోలీసులు చాలా మందిని గృహనిర్బంధం చేశారు. వీరిలో వైసీపీతో పాటు టీడీపీ నాయకులు కూడా ఉన్నారు. వేంపల్లిలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సతీశ్ రెడ్డిని, పులివెందులలో టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఇదే సమయంలో మరికొందరిని బైండోవర్ చేశారు.
అయితే ఈ వ్యవహారంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. శాంతి భద్రతల పరిరక్షణ, ఎన్నికలు సజావుగా సాగాలన్న ఉద్దేశంతోనే తాము అరెస్టులు చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. కానీ నాయకులు మాత్రం ఉద్దేశపూర్వకంగా తమను అరెస్టు చేస్తున్నారని, ఎన్నికల ప్రక్రియను దారి మళ్లిస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. ఏదేమైనా ఉమ్మడి కడప జిల్లాలో ప్రస్తుతం రాజకీయాలు గరంగరంగా మారిపోయాయి.
This post was last modified on August 12, 2025 11:37 am
ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…
పెంపుడు జంతువుల పట్ల యజమానులు, కుటుంబ సభ్యులు ఎంత ప్రేమను పెంచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయా జంతువులు…
ఒకప్పుడు పాత సినిమాల పాటలను యథేచ్ఛగా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవరికీ ఏ అభ్యంతరాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…
ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా దశాబ్దానికి పైగా ఒక వెలుగు వెలిగిన కథానాయిక సమంత. కానీ కొన్నేళ్లుగా…