Political News

పులివెందుల టెన్షన్: అవినాష్ రెడ్డి అరెస్టు

కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని పులివెందుల జెడ్పిటిసి ఉప ఎన్నిక వ్యవహారం తీవ్ర ఉత్కంఠగా మారిపోయింది. రెండు ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ మధ్య పోరు నువ్వా-నేనా అన్నట్టుగా సాగుతోంది. ఈ క్రమంలో ఎవరికివారు ఈ ఎన్నికలో విజయం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు దాడులు జరిగే అవకాశముందని సూచనలతో పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. వీరిలో వైసీపీ కీలక నాయకుడు, ఎంపీ అవినాష్ రెడ్డి సహా ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు ఉన్నారు.

మంగళవారం తెల్లవారుజామునే అలెర్టయిన పులివెందుల పోలీసులు డీఎస్పీ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ ఇంటికి చేరుకుని ఆయన్ని మంచంపై నుంచే బయటకు తీసుకువచ్చారు. అయితే తాను ఫ్రెష్ అయి వస్తానని చెప్పినా పోలీసులు వినిపించుకోలేదని వైసీపీ నాయకులు ఆరోపించారు. ఈ సందర్భంలో ఎంపీ అవినాష్ రెడ్డి, పోలీసుల మధ్య వాగ్వాదం, పెనుగులాట కూడా చోటుచేసుకుంది. అనంతరం ఎంపీ అవినాష్ రెడ్డిని బలవంతంగా పోలీసులు జీపులో ఎక్కించారు.

మరోవైపు పులివెందుల సహా ఒంటిమిట్ట జెడ్పిటిసి ఉప ఎన్నికల సందర్భంగా పోలీసులు చాలా మందిని గృహనిర్బంధం చేశారు. వీరిలో వైసీపీతో పాటు టీడీపీ నాయకులు కూడా ఉన్నారు. వేంపల్లిలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సతీశ్ రెడ్డిని, పులివెందులలో టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఇదే సమయంలో మరికొందరిని బైండోవర్ చేశారు.

అయితే ఈ వ్యవహారంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. శాంతి భద్రతల పరిరక్షణ, ఎన్నికలు సజావుగా సాగాలన్న ఉద్దేశంతోనే తాము అరెస్టులు చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. కానీ నాయకులు మాత్రం ఉద్దేశపూర్వకంగా తమను అరెస్టు చేస్తున్నారని, ఎన్నికల ప్రక్రియను దారి మళ్లిస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. ఏదేమైనా ఉమ్మడి కడప జిల్లాలో ప్రస్తుతం రాజకీయాలు గరంగరంగా మారిపోయాయి.

This post was last modified on August 12, 2025 11:37 am

Share

Recent Posts

డీలిమిటేషన్ బిల్లు లేన‌ట్టేనా?

దేశ‌వ్యాప్తంగా పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభించి .. మ‌హిళ‌ల‌కు రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాల‌న్న కేంద్ర ప్ర‌భుత్వం ఆశ‌లు ప్ర‌స్తుత స‌మావేశాల్లో నెర‌వేరేలా క‌నిపించ‌డం…

27 minutes ago

అధికార పార్టీ ఎమ్మెల్యే కుమారుడి ప్రేమ్ కహాని

తెలంగాణాలో ఎమ్మెల్యేలు, మంత్రులకు తమ కుమారుల ప్రేమ వ్యవహారాలు తలనొప్పిగా మారుతున్నాయి. నిన్నా మొన్నటి వరకు కేంద్ర మంత్రి బండి…

1 hour ago

అల్లు అర్జున్ 23… అప్పుడే ఇన్ని ప్రచారాలా

ఇంకా రాకా షూటింగ్ పూర్తి కాలేదు. మూడు నెలలకు పైనే వర్కింగ్ డేస్ అవసరమవుతాయని అంటున్నారు. అందుకే విడుదల తేదీ…

2 hours ago

మరో రెండు ఎయిమ్స్ ఆసుపత్రుల కోసం జనసేన వినతి

రాష్ట్రంలో వైద్యం ఖరీదైన వస్తువుగా మారిపోయింది. ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ పరీక్షలు, ఇతరత్రా ఖర్చుల పేరుతో ప్రైవేటు ఆసుపత్రులు రోగుల నుంచి…

2 hours ago

దర్శన్ కేసులో కీలక మలుపు

కన్నడ సినిమాలో అతి పెద్ద స్టార్లలో ఒకడైన దర్శన్.. ఏ బాధలూ లేని జీవితాన్ని, బంగారం లాంటి జీవితాన్ని ఎలా…

2 hours ago

ఆగస్ట్ 7… ఓటిటిలో కంటెంట్ వర్షం

థియేటర్లలో రేపు నాలుగైదు సినిమాలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రత్యేకంగా ఓటిటిలో వచ్చే కొత్త కంటెంట్ కోసం ఎదురు…

3 hours ago