Political News

‘లిక్కర్ కేసు’: ఆ డబ్బంతా ఎవరికి చేరింది?

వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ కుంభకోణం వ్యవహారంపై విచారణ చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు తాజాగా మరో చార్జిషీట్‌ను విజయవాడలోని ఏసీబీ కోర్టుకు సమర్పించారు. లిక్కర్ కుంభకోణానికి సంబంధించి గతంలోనే సుదీర్ఘ చార్జిషీట్‌ను అధికారులు సమర్పించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో అనుబంధ చార్జిషీట్‌ను ఇచ్చారు.

దీనిలో అసలు నగదు ఎక్కడ నుంచి ఎలా వచ్చింది? ఈ నగదు చివరి లభ్ధిదారువరకు ఏయే మార్గాల్లో తరలింది? అనే కీలక విషయాలు వెల్లడించినట్టు తెలిసింది.

ఈ మొత్తం వ్యవహారంలో భారతీ సిమెంట్ సంస్థ ఆడిటర్ బాలాజీ గోవిందప్ప, మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, జగన్‌కు ఓఎస్‌డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డిల పాత్రను సిట్ అధికారులు సమగ్రంగా వివరించారు. ఈ ముగ్గురు ప్రస్తుతం విజయవాడ జైలులో ఉన్నారు. వీరి ద్వారానే నగదు అంతిమ లభ్ధిదారు (ఎవరనేది చెప్పలేదు) వరకు చేరిందని సిట్ పేర్కొంది.

ప్రధానంగా ఈ కేసులో ఏ1గా ఉన్న కసిరెడ్డి రాజశేఖరరెడ్డి (రాజ్ కసిరెడ్డి)కి వీరితో ఉన్న అనుబంధం, కేసులో ఎక్కడెక్కడ ఎలాంటి పాత్ర పోషించారన్న విషయాలను కూడా వివరించారు. దుబాయ్, హైదరాబాద్, పుంగనూరు నియోజకవర్గంలోని పెద్దిరెడ్డి ఇంట్లో పలుమార్లు వీరంతా కలిసి చర్చలు జరిపారని సిట్ పేర్కొంది.

ఈ చర్చలకు ఎంపీ మిథున్ రెడ్డి కూడా పాల్గొన్నారని, ఆయన కనుసన్నల్లో డిస్టిలరీలకు టార్గెట్లు విధించారని తెలిపింది. ఈ నేపథ్యంలో మొత్తం నిందితులు సొమ్మును తలా పంచుకుని చివరి లభ్ధిదారుకు చేరవేసిన విధానం, ఆ సొమ్మును ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టిందీ కూడా వివరించారు.

రియల్ ఎస్టేట్ సహా సినిమా రంగంలో పెట్టుబడులు పెట్టారని, దీనికి సంబంధించిన మరిన్ని వివరాలపై దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తాజాగా చార్జిషీట్‌లో వివరించారు.

This post was last modified on August 12, 2025 11:34 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

డైరెక్ట‌ర్ ప్రాణాల‌తో ఆడుకున్న నెట్‌ఫ్లిక్స్

బ్లాక్ ఫ్రైడే, గ్యాంగ్స్ ఆఫ్ వ‌స్సీపూర్ స‌హా ప‌లు గొప్ప చిత్రాల‌తో బాలీవుడ్ గ్రేట్ డైరెక్ట‌ర్ల‌లో ఒక‌డిగా పేరు తెచ్చుకున్నాడు…

2 hours ago

ఎమ్మెల్యేల‌తో `ఆట‌లు`: ముహూర్తం ఫిక్స్

ఏపీ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలలో  కేవ‌లం చ‌ర్చ‌లు, ప్ర‌శ్న‌ల‌కే ప‌రిమితం కాకుండా మంత్రులు, ఎమ్మె ల్యేలు, ఎమ్మెల్సీల‌కు క్రీడ‌లు పోటీలు…

5 hours ago

బాల్క సుమ‌న్ కు రిమాండ్‌.. కేటీఆర్ వడ్డీ వార్నింగ్

బీఆర్ ఎస్ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేప‌థ్యంలో తెలంగాణ రాజ‌కీయాలు మ‌రో సారి నిప్పు రాజుకున్నాయి.…

9 hours ago

జైల్లో ఎంజాయ్ చేసిన అంబటి

ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…

10 hours ago

చేదుగా ఉన్నా నిజం చెప్పిన దిల్ రాజు

ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…

11 hours ago

బుర్ఖా వేసుకున్న యువకుడు.. ఫ్రీ బస్ కోసమేనా?

తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్‌లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…

13 hours ago