Political News

ముందు ఈ సంగ‌తి చూడండి: ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు కామ్రెడ్స్ లేఖ‌!

‘ముందు ఈ సంగ‌తి చూడండి’.. అంటూ.. ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ఉద్దేశించి సీపీఎం ఏపీ కార్య‌ద‌ర్శి వి. శ్రీనివాస‌రావు సుదీర్ఘ లేఖ సంధించారు. “మీ అవ‌స‌రానికి రాజకీయాల‌ను వాడుకుంటున్నారు. కానీ, మీ అవ‌స‌రం ఉంది.. ప్ర‌స్తుతం పంచాయతీల్లో.. ముందు ఈ సంగ‌తి చూడండి.” అని వ్యాఖ్యానించారు. పంచాయ‌తీలు ప్ర‌స్తుతం కోలుకునే ద‌శ‌లో లేవ‌ని పేర్కొన్నారు. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా 1121 కోట్ల రూపాయ‌ల‌ను పంచాయ‌తీల‌కు ఇచ్చింద‌ని.. ఈ సొమ్మును దారిమ‌ళ్లించ‌కుండా.. పంచాయతీల అభివృద్దికి కేటాయించాల‌ని శ్రీనివాస‌రావు సూచించారు.

రాజకీయాలు చేసుకునేందుకు ఎన్నిక‌లు ఇప్ప‌ట్లో లేవ‌ని శ్రీనివాస‌రావు వ్యాఖ్యానించారు. కాబ‌ట్టి.. గ్రామ పంచాయ‌తీల స‌మ‌స్యల‌పై దృష్టి పెట్టాల‌ని అన్నారు. “మీ శాఖ‌పై మీరు దృష్టి పెట్ట‌కుండా.. కేవ‌లం రాజ‌కీయాలు.. విమ‌ర్శ‌ల‌కే ప‌రిమితం అవుతున్నారు” అని వ్యాఖ్యానించారు. సర్పంచుల వేతనాలు పెంచాలని, గ్రామ సమస్యలు పరిష్కారం చేయాలని కోరారు. పంచాయ‌తీలు నానాటికీ బ‌ల‌హీన ప‌డుతున్నాయ‌ని పేర్కొన్న ఆయ‌న అధికార కేంద్రీక‌ర‌ణ జ‌రుగుతోంద‌న్నారు. “ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌చ్చాక‌.. మెరుగు అవుతాయ‌ని అంద‌రూ భావించారు. కానీ, మీరు ప‌ట్టీప‌ట్ట‌న‌ట్టే వ్య‌వ‌హ‌రిస్తున్నారు” అని శ్రీనివాస‌రావు వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో సర్పంచులు ఎన్నికై నాలుగేళ్లు దాటుతోందని పేర్కొన్న శ్రీనివాస‌రావు.. వారికి విధులు, నిధులు లేక‌.. ఇబ్బందులు ప‌డుతున్నార‌ని పేర్కొన్నారు. గ్రామాల‌ను అభివృద్ధి చేస్తామ‌ని చెప్పిన మీ మాట‌ను నిల‌బెట్టుకోవాల‌ని సూచించారు. చాలా మంది స‌ర్పంచులు అప్పులు చేసి మ‌రీ గ్రామాల‌ను అభివృద్ధి చేసుకుంటున్నార‌ని.. వారు ఆ అప్పుల‌కు వ‌డ్డీలు కూడా భ‌రించాల్సి వ‌స్తోంద‌ని తెలిపారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌బుత్వం తాజాగా వ‌చ్చిన నిధుల‌ను వెంట‌నే పంచాయ‌తీల‌కు విడుద‌ల చేయాల‌ని శ్రీనివాస‌రావు కోరారు. అలాగే రాష్ట్ర ప్ర‌భుత్వ వాటా కింద‌ పంచాయితీలకు ఇవ్వవలసిన నిధులు కూడా విడుద‌ల చేయాల‌న్నారు.

హామీ ఏమైంది..?

మేం వ‌చ్చిన త‌ర్వాత‌.. స‌ర్పంచుల వేత‌నాన్ని రూ.మూడు వేల నుంచి రూ.10వేల‌కు పెంచుతామ‌ని చెప్పార‌ని.. శ్రీనివాస‌రావు గుర్తు చేశారు.కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు వేత‌నాల గురించిన ప్ర‌స్తావ‌న కూడా లేకుండా చేస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామి పథకం అమల్లో గ్రామ పంచాయితీల పర్యవేక్షణ ఉండేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు.

This post was last modified on August 7, 2025 9:10 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

20 minutes ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

4 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

8 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

8 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

10 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

10 hours ago