Political News

‘కేసీఆర్ స్వార్థ జీవి… నేను అమ్ముడు పోలేదు’

బీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేసి 24 గంటలు కూడా కాకముందే ఆ పార్టీ తాజా మాజీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా పార్టీ అధినేత కేసీఆర్‌పైనా, తనను టార్గెట్ చేస్తున్న బీఆర్‌ఎస్ నాయకులపై ఆయన నిప్పులు చెరిగారు.

కేసీఆర్‌ను స్వార్థ జీవిగా గువ్వల అభివర్ణించారు. కేసీఆర్ స్వార్థానికి తాను బలి అయ్యానన్నారు. తనను అసమర్థ నాయకత్వం ఓడించిందంటూ బీఆర్‌ఎస్ అధిష్ఠానంపై నిప్పులు చెరిగారు. ఎక్కడికక్కడ రాజీ పడి, రాజకీయాలను నాశనం చేశారని, రాష్ట్రంలో అప్పులు తెచ్చిపెట్టారని గువ్వల కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

ఇదే సమయంలో తాను 100 కోట్ల రూపాయల‌కు అమ్ముడుపోయానని కొందరు అంటున్నారనీ, కానీ గువ్వల ఒకరి మోచేతి నీళ్లు తాగే టైపు కాదని వ్యాఖ్యానించారు. మొయినాబాద్ ఫాం హౌస్‌లో అయినా, ఎక్కడైనా తాను 100 కోట్ల రూపాయల‌కు అమ్ముడుపోయానని నిరూపిస్తే ఆధారాలు చూపాలని, అలా అయితే ముక్కు నేలకు రాస్తానని, రాజకీయాలను శాశ్వతంగా వదిలేస్తానని సవాల్ విసిరారు.

తెలంగాణ సాధించిన నాయకుడిగా కేసీఆర్ అంటే గౌరవంతోనే ఆ పార్టీలో చేరానన్న గువ్వల, తొలినాళ్లలో ఆయన బాగానే ఉన్నారని, కానీ తర్వాత స్వార్థ జీవిగా మారారన్నారు. గత ఎన్నికల్లో తనను మాయ చేసి టికెట్ అమ్ముకున్నారనీ మండిపడ్డారు.

ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీగా బీఆర్‌ఎస్ తన పాత్రను సరిగా పోషించడం లేదని గువ్వల వ్యాఖ్యానించారు. అధికార, ప్రతిపక్షాలు రెండూ కూడా ప్రజలను గాలికి వదిలేశాయని ఆరోపించారు. కార్యకర్తలను వాడుకుని వదిలేశారనీ, వారిని కష్టకాలంలో పట్టించుకోలేదని విమర్శించారు.

ప్రజలు కోరుకుంటున్న విధంగా ప్రభుత్వం పాలన చేయడం లేదన్న గువ్వల, ప్రజల ఆకాంక్షల మేరకు ప్రతిపక్షం కూడా ప్రవర్తించడం లేదని దుయ్యబట్టారు. ఒకరిపై ఒకరు పైచేయి సాధించుకునేందుకు ప్రయత్నిస్తూ ప్రజల సమస్యలను వదిలేస్తున్నారని, ప్రజల తరఫున గళం వినిపించాలన్న ఉద్దేశంతోనే బీఆర్‌ఎస్ నుంచి బయటకు వచ్చానని చెప్పారు.

ఈ క్రమంలో తనకు ఏ పార్టీలో స్వేచ్ఛ ఉంటే అక్కడికే వెళ్తానన్నారు.

This post was last modified on August 6, 2025 10:27 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

2 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

6 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

7 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

7 hours ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

8 hours ago

రచయితగా కొత్త రూటులో టాలీవుడ్ హీరో?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…

10 hours ago