Political News

వివేకా కేసులో విచార‌ణ పూర్తి.. సీబీఐ ముందు బోలెడు ప్ర‌శ్న‌లు!

ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్ సొంత బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి 2019, మార్చి లో సొంత ఇంట్లోనే దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు. ఈ కేసులో సీబీఐ.. విచార‌ణ పూర్త‌యింద‌ని.. ఇక‌, తాము వ్య‌క్తిగ‌తంగా చేయాల్సిన విచార‌ణ అంటూ.. లేద‌ని స్ప‌ష్టం చేసింది. అంతేకాదు.. ఈ మేర‌కు సుప్రీంకోర్టు లో అఫిడ‌విట్ కూడా దాఖ‌లు చేసింది. ఇదేస‌మ‌యంలో “మీరు మ‌రోసారి విచార‌ణ చేయ‌మంటే“ అం టూ.. ధ‌ర్మ సందేహాన్ని కోర్టుకు వ‌దిలేసింది. మ‌రి సీబీఐ ఈ కేసులో విచార‌ణ పూర్తి చేసేసిన‌ట్టేనా? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.

ఈ కోణంలో చూసుకుంటే.. వివేకా కుమార్తె, డాక్ట‌ర్ న‌ర్రెడ్డి సునీత చెబుతున్న ప్ర‌కారం.. ఈ కేసులో `సూత్ర ధారి` ఎవ‌రు? అన్న‌ది మాత్రం సీబీఐ ఇప్ప‌టి వ‌ర‌కు బ‌య‌ట పెట్ట‌లేదు. ఒక‌వేళ సూత్ర‌ధారి, పాత్ర ధారి కూడా.. ఒక్క‌రే అని భావిస్తే.. స‌ద‌రు నిందితుడికి ముంద‌స్తు బెయిల్ ఇచ్చిన‌ప్పుడు కూడా బల‌మైన వాద న‌లు వినిపించ‌లేద‌న్న విమ‌ర్శ‌లు కూడా ఉన్నాయి. దీనికి కూడా సీబీఐ నుంచి ఎలాంటి స‌మాధానం లేదు. అంతేకాదు.. ఈ కేసు విచార‌ణ పూర్త‌యింద‌ని సీబీఐ చెబుతున్న‌నేప‌థ్యంలో ఆ సంస్థ స‌మాధానం చెప్పాల్సిన ప్ర‌శ్న‌లు కూడా చాలానే ఉన్నాయ‌ని.. వివేకా బంధువులు(జ‌గ‌న్‌తో విభేదించేవారు) చెబుతున్నారు.

ప్ర‌ధానంగా.. సూత్ర‌ధారి ఎవ‌రు? ఎందుకు హ‌త్య చేయించారు? ఈ రెండు అంశాల‌ను సీబీఐ ఇప్ప‌టి వ‌ర‌కు.. బ‌య‌ట పెట్ట‌లేదు. అంతేకాదు.. ఈ కేసులో చార్జిషీట్లు దాఖ‌లు పూర్త‌య్యాయా? అనేది కూడా సందేహంగానే ఉంచేసింది. ఒక‌వేళ చార్జిషీట్లు పూర్త‌యితే.. తెలంగాణ కోర్టులో విచార‌ణ ఎందుకు ముందుకు సాగ‌డం లేదు? అనేది ప్ర‌శ్న‌. దీనికి కూడా స‌మాధానం చెప్పాల్సి ఉంది. మ‌రీ ముఖ్యంగా వివేకా దారుణ హ‌త్య‌ను గుండెపోటుగా అభివర్ణించింది ఎవ‌రు? దీనికి రీజ‌నేంటి? అనే విష‌యాల‌ను కూడా సీబీఐ చెప్పాల్సి ఉంది.

ప్ర‌ధానంగా.. వివేకా ఆస్తుల వివాదంతోనే హ‌త్య‌కు గురయ్యార‌న్న ప్ర‌త్య‌ర్థుల ఆరోప‌ణ‌ల‌పై సీబీఐ ఎందు కు మౌనంగా ఉంద‌న్న‌ది కూడా ప్ర‌శ్నే. రేపు న్యాయ‌స్థానం ముందు.. ఈ కేసు విచార‌ణ‌కు వ‌స్తే.. బాధిత ప‌క్షం చేసే వాద‌న‌లకంటే కూడా.. ప్ర‌త్య‌ర్థి ప‌క్షం, ముఖ్యంగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న‌వారు.. చేసే వాద‌న‌ల‌కు ప్రాధాన్యం ఏర్ప‌డేలా మొత్తం వ్య‌వ‌హారం ఉంద‌న్న సునీత త‌ర‌ఫు న్యాయ‌వాదుల వాద‌నల‌ను ఎందుకు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవ‌డం లేద‌న్న‌ది కూడా.. ముఖ్యం.

మ‌రి విచార‌ణ పూర్త‌యితే.. సీబీఐ డీఎస‌పీ రామ్ సింగ్ కేసు సంగ‌తేంటి? అనేది కూడా కీల‌కం. ఎలా చూసుకున్నా.. అప్రూవ‌ర్ ద‌స్త‌గిరి నుంచి అనేక మంది ఇచ్చిన వాంగ్మూలాల‌పై విచార‌ణ జ‌ర‌గాల్సి ఉంద‌న్న‌వాద‌న‌లు వినిపిస్తున్న స‌మ‌యంలో విచార‌ణ పూర్త‌యితే.. పై ప్ర‌శ్న‌ల‌కు సీబీఐ స‌మాధానం చెప్పాల్సి ఉంటుంద‌ని సునీత త‌ర‌ఫున న్యాయ‌వాదులు చెబుతున్నారు. 

This post was last modified on August 6, 2025 1:59 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

4 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

4 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

5 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

6 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

7 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

9 hours ago