Political News

వివేకా కేసులో విచార‌ణ పూర్తి.. సీబీఐ ముందు బోలెడు ప్ర‌శ్న‌లు!

ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్ సొంత బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి 2019, మార్చి లో సొంత ఇంట్లోనే దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు. ఈ కేసులో సీబీఐ.. విచార‌ణ పూర్త‌యింద‌ని.. ఇక‌, తాము వ్య‌క్తిగ‌తంగా చేయాల్సిన విచార‌ణ అంటూ.. లేద‌ని స్ప‌ష్టం చేసింది. అంతేకాదు.. ఈ మేర‌కు సుప్రీంకోర్టు లో అఫిడ‌విట్ కూడా దాఖ‌లు చేసింది. ఇదేస‌మ‌యంలో “మీరు మ‌రోసారి విచార‌ణ చేయ‌మంటే“ అం టూ.. ధ‌ర్మ సందేహాన్ని కోర్టుకు వ‌దిలేసింది. మ‌రి సీబీఐ ఈ కేసులో విచార‌ణ పూర్తి చేసేసిన‌ట్టేనా? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.

ఈ కోణంలో చూసుకుంటే.. వివేకా కుమార్తె, డాక్ట‌ర్ న‌ర్రెడ్డి సునీత చెబుతున్న ప్ర‌కారం.. ఈ కేసులో `సూత్ర ధారి` ఎవ‌రు? అన్న‌ది మాత్రం సీబీఐ ఇప్ప‌టి వ‌ర‌కు బ‌య‌ట పెట్ట‌లేదు. ఒక‌వేళ సూత్ర‌ధారి, పాత్ర ధారి కూడా.. ఒక్క‌రే అని భావిస్తే.. స‌ద‌రు నిందితుడికి ముంద‌స్తు బెయిల్ ఇచ్చిన‌ప్పుడు కూడా బల‌మైన వాద న‌లు వినిపించ‌లేద‌న్న విమ‌ర్శ‌లు కూడా ఉన్నాయి. దీనికి కూడా సీబీఐ నుంచి ఎలాంటి స‌మాధానం లేదు. అంతేకాదు.. ఈ కేసు విచార‌ణ పూర్త‌యింద‌ని సీబీఐ చెబుతున్న‌నేప‌థ్యంలో ఆ సంస్థ స‌మాధానం చెప్పాల్సిన ప్ర‌శ్న‌లు కూడా చాలానే ఉన్నాయ‌ని.. వివేకా బంధువులు(జ‌గ‌న్‌తో విభేదించేవారు) చెబుతున్నారు.

ప్ర‌ధానంగా.. సూత్ర‌ధారి ఎవ‌రు? ఎందుకు హ‌త్య చేయించారు? ఈ రెండు అంశాల‌ను సీబీఐ ఇప్ప‌టి వ‌ర‌కు.. బ‌య‌ట పెట్ట‌లేదు. అంతేకాదు.. ఈ కేసులో చార్జిషీట్లు దాఖ‌లు పూర్త‌య్యాయా? అనేది కూడా సందేహంగానే ఉంచేసింది. ఒక‌వేళ చార్జిషీట్లు పూర్త‌యితే.. తెలంగాణ కోర్టులో విచార‌ణ ఎందుకు ముందుకు సాగ‌డం లేదు? అనేది ప్ర‌శ్న‌. దీనికి కూడా స‌మాధానం చెప్పాల్సి ఉంది. మ‌రీ ముఖ్యంగా వివేకా దారుణ హ‌త్య‌ను గుండెపోటుగా అభివర్ణించింది ఎవ‌రు? దీనికి రీజ‌నేంటి? అనే విష‌యాల‌ను కూడా సీబీఐ చెప్పాల్సి ఉంది.

ప్ర‌ధానంగా.. వివేకా ఆస్తుల వివాదంతోనే హ‌త్య‌కు గురయ్యార‌న్న ప్ర‌త్య‌ర్థుల ఆరోప‌ణ‌ల‌పై సీబీఐ ఎందు కు మౌనంగా ఉంద‌న్న‌ది కూడా ప్ర‌శ్నే. రేపు న్యాయ‌స్థానం ముందు.. ఈ కేసు విచార‌ణ‌కు వ‌స్తే.. బాధిత ప‌క్షం చేసే వాద‌న‌లకంటే కూడా.. ప్ర‌త్య‌ర్థి ప‌క్షం, ముఖ్యంగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న‌వారు.. చేసే వాద‌న‌ల‌కు ప్రాధాన్యం ఏర్ప‌డేలా మొత్తం వ్య‌వ‌హారం ఉంద‌న్న సునీత త‌ర‌ఫు న్యాయ‌వాదుల వాద‌నల‌ను ఎందుకు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవ‌డం లేద‌న్న‌ది కూడా.. ముఖ్యం.

మ‌రి విచార‌ణ పూర్త‌యితే.. సీబీఐ డీఎస‌పీ రామ్ సింగ్ కేసు సంగ‌తేంటి? అనేది కూడా కీల‌కం. ఎలా చూసుకున్నా.. అప్రూవ‌ర్ ద‌స్త‌గిరి నుంచి అనేక మంది ఇచ్చిన వాంగ్మూలాల‌పై విచార‌ణ జ‌ర‌గాల్సి ఉంద‌న్న‌వాద‌న‌లు వినిపిస్తున్న స‌మ‌యంలో విచార‌ణ పూర్త‌యితే.. పై ప్ర‌శ్న‌ల‌కు సీబీఐ స‌మాధానం చెప్పాల్సి ఉంటుంద‌ని సునీత త‌ర‌ఫున న్యాయ‌వాదులు చెబుతున్నారు. 

This post was last modified on August 6, 2025 1:59 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రెహమాన్ నిజంగా లైవ్ ఇస్తున్నారా

పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…

2 hours ago

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

3 hours ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

3 hours ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

5 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

5 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

7 hours ago