ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ సొంత బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి 2019, మార్చి లో సొంత ఇంట్లోనే దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసులో సీబీఐ.. విచారణ పూర్తయిందని.. ఇక, తాము వ్యక్తిగతంగా చేయాల్సిన విచారణ అంటూ.. లేదని స్పష్టం చేసింది. అంతేకాదు.. ఈ మేరకు సుప్రీంకోర్టు లో అఫిడవిట్ కూడా దాఖలు చేసింది. ఇదేసమయంలో “మీరు మరోసారి విచారణ చేయమంటే“ అం టూ.. ధర్మ సందేహాన్ని కోర్టుకు వదిలేసింది. మరి సీబీఐ ఈ కేసులో విచారణ పూర్తి చేసేసినట్టేనా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
ఈ కోణంలో చూసుకుంటే.. వివేకా కుమార్తె, డాక్టర్ నర్రెడ్డి సునీత చెబుతున్న ప్రకారం.. ఈ కేసులో `సూత్ర ధారి` ఎవరు? అన్నది మాత్రం సీబీఐ ఇప్పటి వరకు బయట పెట్టలేదు. ఒకవేళ సూత్రధారి, పాత్ర ధారి కూడా.. ఒక్కరే అని భావిస్తే.. సదరు నిందితుడికి ముందస్తు బెయిల్ ఇచ్చినప్పుడు కూడా బలమైన వాద నలు వినిపించలేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. దీనికి కూడా సీబీఐ నుంచి ఎలాంటి సమాధానం లేదు. అంతేకాదు.. ఈ కేసు విచారణ పూర్తయిందని సీబీఐ చెబుతున్ననేపథ్యంలో ఆ సంస్థ సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు కూడా చాలానే ఉన్నాయని.. వివేకా బంధువులు(జగన్తో విభేదించేవారు) చెబుతున్నారు.
ప్రధానంగా.. సూత్రధారి ఎవరు? ఎందుకు హత్య చేయించారు? ఈ రెండు అంశాలను సీబీఐ ఇప్పటి వరకు.. బయట పెట్టలేదు. అంతేకాదు.. ఈ కేసులో చార్జిషీట్లు దాఖలు పూర్తయ్యాయా? అనేది కూడా సందేహంగానే ఉంచేసింది. ఒకవేళ చార్జిషీట్లు పూర్తయితే.. తెలంగాణ కోర్టులో విచారణ ఎందుకు ముందుకు సాగడం లేదు? అనేది ప్రశ్న. దీనికి కూడా సమాధానం చెప్పాల్సి ఉంది. మరీ ముఖ్యంగా వివేకా దారుణ హత్యను గుండెపోటుగా అభివర్ణించింది ఎవరు? దీనికి రీజనేంటి? అనే విషయాలను కూడా సీబీఐ చెప్పాల్సి ఉంది.
ప్రధానంగా.. వివేకా ఆస్తుల వివాదంతోనే హత్యకు గురయ్యారన్న ప్రత్యర్థుల ఆరోపణలపై సీబీఐ ఎందు కు మౌనంగా ఉందన్నది కూడా ప్రశ్నే. రేపు న్యాయస్థానం ముందు.. ఈ కేసు విచారణకు వస్తే.. బాధిత పక్షం చేసే వాదనలకంటే కూడా.. ప్రత్యర్థి పక్షం, ముఖ్యంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు.. చేసే వాదనలకు ప్రాధాన్యం ఏర్పడేలా మొత్తం వ్యవహారం ఉందన్న సునీత తరఫు న్యాయవాదుల వాదనలను ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదన్నది కూడా.. ముఖ్యం.
మరి విచారణ పూర్తయితే.. సీబీఐ డీఎసపీ రామ్ సింగ్ కేసు సంగతేంటి? అనేది కూడా కీలకం. ఎలా చూసుకున్నా.. అప్రూవర్ దస్తగిరి నుంచి అనేక మంది ఇచ్చిన వాంగ్మూలాలపై విచారణ జరగాల్సి ఉందన్నవాదనలు వినిపిస్తున్న సమయంలో విచారణ పూర్తయితే.. పై ప్రశ్నలకు సీబీఐ సమాధానం చెప్పాల్సి ఉంటుందని సునీత తరఫున న్యాయవాదులు చెబుతున్నారు.
This post was last modified on August 6, 2025 1:59 pm
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…