Political News

తుస్సుమ‌న్న క‌విత నిర‌స‌న‌.. 72 కాదు.. 7 గంట‌ల్లోనే విర‌మ‌ణ‌!

బీఆర్ ఎస్ నాయ‌కురాలు, ఎమ్మెల్సీ కవిత చేప‌ట్టిన 72 గంట‌ల దీక్ష తుస్సు మంది. బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పిస్తూ.. రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన బిల్లును త‌క్ష‌ణం ఆమోదింప చేయాల‌న్న ల‌క్ష్యంతో క‌విత కొన్నాళ్లుగా వ్యాఖ్య‌లు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే తాజాగా సోమ‌వారం 72 గంట‌ల దీక్ష‌కు పిలుపునిచ్చారు. సోమ‌వారం స్వయంగా హైద‌రాబాద్ లోని ధ‌ర్నా చౌక్‌లో నిరాహార దీక్ష‌కు కూర్చున్నారు. అయితే.. ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి ఇబ్బందీ రాలేదు. కానీ.. 72 గంట‌లన్న దీక్ష‌.. కేవ‌లం ఏడు గంట‌లలోనే ముగిసిపోయింది. ఈ వ్య‌వ‌హారం రాజ‌కీయంగా చ‌ర్చ‌కు దారితీసింది.

క‌విత చెప్పిన కార‌ణం ఇదీ..

తాము చేప‌ట్టిన నిరాహార దీక్ష‌కు హైకోర్టు అనుమ‌తి ఇవ్వ‌లేద‌ని క‌విత చెప్పారు. అందుకే.. కోర్టుల ప‌ట్ల గౌర‌వంతో ఉన్న తాము .. దీక్ష‌ను విర‌మిస్తున్నాని వ్యాఖ్యానించారు. అయితే.. మ‌రోరూపంలో నిర‌స‌న దీక్ష‌లు కొన‌సాగుతాయ‌ని.. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్య‌మిస్తామ‌ని ఆమె చెప్పారు. చిత్త శుద్ధి ఉంటే.. రాష్ట్ర స‌ర్కారు కేంద్రం ముందు పోరాడాల‌ని.. లేక‌పోతే.. కోర్టుల్లో పోరాటం చేయాల‌ని క‌విత ఉచిత స‌ల‌హాలు ఇచ్చారు. గ‌వ‌ర్న‌ర్‌పై సుప్రీంకోర్టులో కేసు వేయాల‌ని ఆమె సూచించారు. ఆర్డినెన్సు తెచ్చేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నించింద‌న‌డం వేస్ట్ అన్న ఆమె.. ఇవ‌న్నీ బీసీల‌ను మోస‌గించేందుకేన‌ని వ్యాఖ్యానించారు. చిత్త‌శుద్ధి ఉంటే.. వెంట‌నే కోర్టులో కేసు వేయాల‌న్నారు. తమ పోరాటాలు కూడా సాగుతాయ‌ని చెప్పారు.

అస‌లు కార‌ణం ఏంటి?

క‌విత చాలా ఆశ‌లు పెట్టుకుని దీక్ష చేశారు. ఈ 72 గంట‌ల దీక్ష ద్వారా.. జాగృతి నాయ‌కురాలిగా త‌ను గుర్తింపు కోసం ప్ర‌య‌త్నించారు. కానీ, పెద్ద‌గా దీనికి స్పందన రాలేదు. ప్ర‌జ‌లు కూడాపెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. ఇక‌, జాగృతి త‌ర‌ఫున కూడా కొద్ది మంది మాత్ర‌మే స్పందించారు. చివ‌ర‌కు.. దీక్ష విర‌మించే స‌మ‌యానికి ప‌ట్టుమ‌ని ప‌ది మంది మాత్ర‌మే కార్య‌క‌ర్త‌లు మిగ‌లగా.. పోలీసులు.. భ‌ద్ర‌తా సిబ్బంది 20 మంది ఉన్నారు. అంటే.. కార్య‌క‌ర్త‌ల కంటే కూడా పోలీసులే ఎక్కువ‌గా క‌నిపించారు.

దీంతో ఆమె దీక్ష విర‌మ‌ణ‌కు నిర్ణ‌యం తీసుకున్నార‌న్న చ‌ర్చ రాజ‌కీయాల్లో సాగుతోంది. దీనికి తోడు.. కాళేశ్వ‌రంపై సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌క‌ట‌న‌.. దీనిపై కార్యాచ‌ర‌ణ‌.. వంటివి ఫోక‌స్ కావ‌డంతో క‌విత వెన‌క్కి త‌గ్గార‌న్న చ‌ర్చ కూడా తెరమీదికి వ‌చ్చింది. లేక‌పోతే.. పైకోర్టుకు వెళ్లేందుకు అనుమ‌తి తీసుకుని దీక్ష‌ను కొన‌సాగించేవార‌ని అంటున్నారు. ఏదేమైనా తొలి ప్ర‌య‌త్నంలోనే క‌విత‌కు పెద్ద ప‌రాభ‌వం ఎదురైంద‌న్న వాద‌న బీఆర్ఎస్ వ‌ర్గాల నుంచే వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on August 5, 2025 10:55 am

Share

Recent Posts

ఆ వివాదాస్పద ఐపీఎస్ ఇంట పెళ్లికి జగన్

హైదరాబాద్‌లో జరిగిన ఓ వివాహ వేడుకకు వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ హాజరయ్యారు. సీనియర్ ఐపీఎస్ అధికారి…

9 minutes ago

ఆ ఒక్కటి అడగొద్దంటే ఎలా విశ్వంభరా

ప్రతి సంవత్సరం లాగే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఆయన అభిమానులు హైదరాబాద్ లో ఘనంగా జరుపుకున్నారు. దీనికి మెగా…

13 minutes ago

అల వైకుంఠపురములో కాదు అనంతపురములో… వైరల్

‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…

2 hours ago

మమిత బైజు – వయసు తక్కువా… హిట్లు ఎక్కువ!

ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…

3 hours ago

కేరళం ప్రకృతి వైద్యానికి పవన్ ప్రాధాన్యత

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…

3 hours ago

మల్లెపూల పల్లకి… ఊగుతున్న థియేటర్లు

ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…

5 hours ago