Political News

తుస్సుమ‌న్న క‌విత నిర‌స‌న‌.. 72 కాదు.. 7 గంట‌ల్లోనే విర‌మ‌ణ‌!

బీఆర్ ఎస్ నాయ‌కురాలు, ఎమ్మెల్సీ కవిత చేప‌ట్టిన 72 గంట‌ల దీక్ష తుస్సు మంది. బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పిస్తూ.. రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన బిల్లును త‌క్ష‌ణం ఆమోదింప చేయాల‌న్న ల‌క్ష్యంతో క‌విత కొన్నాళ్లుగా వ్యాఖ్య‌లు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే తాజాగా సోమ‌వారం 72 గంట‌ల దీక్ష‌కు పిలుపునిచ్చారు. సోమ‌వారం స్వయంగా హైద‌రాబాద్ లోని ధ‌ర్నా చౌక్‌లో నిరాహార దీక్ష‌కు కూర్చున్నారు. అయితే.. ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి ఇబ్బందీ రాలేదు. కానీ.. 72 గంట‌లన్న దీక్ష‌.. కేవ‌లం ఏడు గంట‌లలోనే ముగిసిపోయింది. ఈ వ్య‌వ‌హారం రాజ‌కీయంగా చ‌ర్చ‌కు దారితీసింది.

క‌విత చెప్పిన కార‌ణం ఇదీ..

తాము చేప‌ట్టిన నిరాహార దీక్ష‌కు హైకోర్టు అనుమ‌తి ఇవ్వ‌లేద‌ని క‌విత చెప్పారు. అందుకే.. కోర్టుల ప‌ట్ల గౌర‌వంతో ఉన్న తాము .. దీక్ష‌ను విర‌మిస్తున్నాని వ్యాఖ్యానించారు. అయితే.. మ‌రోరూపంలో నిర‌స‌న దీక్ష‌లు కొన‌సాగుతాయ‌ని.. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్య‌మిస్తామ‌ని ఆమె చెప్పారు. చిత్త శుద్ధి ఉంటే.. రాష్ట్ర స‌ర్కారు కేంద్రం ముందు పోరాడాల‌ని.. లేక‌పోతే.. కోర్టుల్లో పోరాటం చేయాల‌ని క‌విత ఉచిత స‌ల‌హాలు ఇచ్చారు. గ‌వ‌ర్న‌ర్‌పై సుప్రీంకోర్టులో కేసు వేయాల‌ని ఆమె సూచించారు. ఆర్డినెన్సు తెచ్చేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నించింద‌న‌డం వేస్ట్ అన్న ఆమె.. ఇవ‌న్నీ బీసీల‌ను మోస‌గించేందుకేన‌ని వ్యాఖ్యానించారు. చిత్త‌శుద్ధి ఉంటే.. వెంట‌నే కోర్టులో కేసు వేయాల‌న్నారు. తమ పోరాటాలు కూడా సాగుతాయ‌ని చెప్పారు.

అస‌లు కార‌ణం ఏంటి?

క‌విత చాలా ఆశ‌లు పెట్టుకుని దీక్ష చేశారు. ఈ 72 గంట‌ల దీక్ష ద్వారా.. జాగృతి నాయ‌కురాలిగా త‌ను గుర్తింపు కోసం ప్ర‌య‌త్నించారు. కానీ, పెద్ద‌గా దీనికి స్పందన రాలేదు. ప్ర‌జ‌లు కూడాపెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. ఇక‌, జాగృతి త‌ర‌ఫున కూడా కొద్ది మంది మాత్ర‌మే స్పందించారు. చివ‌ర‌కు.. దీక్ష విర‌మించే స‌మ‌యానికి ప‌ట్టుమ‌ని ప‌ది మంది మాత్ర‌మే కార్య‌క‌ర్త‌లు మిగ‌లగా.. పోలీసులు.. భ‌ద్ర‌తా సిబ్బంది 20 మంది ఉన్నారు. అంటే.. కార్య‌క‌ర్త‌ల కంటే కూడా పోలీసులే ఎక్కువ‌గా క‌నిపించారు.

దీంతో ఆమె దీక్ష విర‌మ‌ణ‌కు నిర్ణ‌యం తీసుకున్నార‌న్న చ‌ర్చ రాజ‌కీయాల్లో సాగుతోంది. దీనికి తోడు.. కాళేశ్వ‌రంపై సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌క‌ట‌న‌.. దీనిపై కార్యాచ‌ర‌ణ‌.. వంటివి ఫోక‌స్ కావ‌డంతో క‌విత వెన‌క్కి త‌గ్గార‌న్న చ‌ర్చ కూడా తెరమీదికి వ‌చ్చింది. లేక‌పోతే.. పైకోర్టుకు వెళ్లేందుకు అనుమ‌తి తీసుకుని దీక్ష‌ను కొన‌సాగించేవార‌ని అంటున్నారు. ఏదేమైనా తొలి ప్ర‌య‌త్నంలోనే క‌విత‌కు పెద్ద ప‌రాభ‌వం ఎదురైంద‌న్న వాద‌న బీఆర్ఎస్ వ‌ర్గాల నుంచే వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on August 5, 2025 10:55 am

Share

Recent Posts

ఇప్ప‌టి వ‌ర‌కు లేనిది.. ఇప్పుడు మ‌ళ్లీ.. బాబు ఆగ్ర‌హానికి రీజ‌నేంటి?

ఏపీ సీఎం చంద్ర‌బాబు గ‌తానికి భిన్నంగా ఏపీలో పాల‌న సాగిస్తున్నారు. గ‌తంలో ఆయ‌న మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన స‌మ‌యంలో…

24 minutes ago

మళ్ళీ పోలీస్ కథ… మళ్ళీ ఇంకో హిట్టు

అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…

3 hours ago

‘ఆదర్శ కుటుంబం’లో తుపాకుల కలకలం

టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…

4 hours ago

గ్రీన్‌కార్డ్ ఎఫెక్ట్ వల్ల భారత్‌కు లాభమా?

అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్‌కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…

5 hours ago

‘డీసీ’కి ప్రాణం పోసిన ఆమెకు లేదా గిఫ్ట్?

పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్‌తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…

5 hours ago

విశ్వక్ సేన్ వేగం… 36 రోజుల్లో 3 సినిమాలు

ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…

6 hours ago