Political News

రేప్ కేస్: మాజీ ప్ర‌ధాని మ‌న‌వ‌డికి జీవిత ఖైదు!

భార‌త దేశ చ‌రిత్ర‌లో మునుపెన్న‌డూ క‌నీ వినీ ఎరుగ‌ని విధంగా ఓ మాజీ ప్ర‌ధాని మ‌న‌వ‌డికి జీవిత ఖైదు ప‌డింది. ఆయ‌నే మాజీ ప్ర‌ధాన మంత్రి, క‌ర్ణాట‌కకు చెందిన దేవెగౌడ మ‌న‌వ‌డు, మాజీ మంత్రి రేవ‌ణ్ణ పెద్ద‌కుమారుడు, మాజీ ఎంపీ ప్ర‌జ్వ‌ల్‌. ఇంట్లో వంట మ‌నిషిపై ప‌లు మార్లు అత్యాచారం చేసిన కేసులో ప్ర‌జ్వ‌ల్‌ను దోషిగా తేలుస్తూ.. బెంగ‌ళూరులోని ప్ర‌జాప్ర‌తినిధుల కోర్టు.. శుక్ర‌వారం తీర్పు వెలువరించిన విష‌యం తెలిసిందే. తాజాగా దీనిపై తీర్పును వెలువ‌రించింది. అత్యంత ఉత్కంఠ న‌డుమ ప్ర‌జాప్ర‌తినిధుల కోర్టు న్యాయాధికారి.. సంతోశ్‌ గజానన హెగ్డే.. ప్ర‌జ్వ‌ల్‌కు జీవిత ఖైదును విధిస్తున్న‌ట్టు తీర్పు వెలువ‌రించారు.

ఏడాదిన్న‌రలో తేల్చేసి..

గ‌త ఏడాది పార్ల‌మెంటుఎన్నిక‌ల స‌మయంలో ప్ర‌జ్వ‌ల్‌.. హాస‌న్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేశారు. అయితే.. అప్ప‌టికే ఆయ‌న ఎంపీ అన్న విష‌యం తెలిసిందే. సొంత పార్టీ జేడీఎస్ త‌ర‌ఫున ఆయ‌న రెండోసారి రంగంలోకి దిగారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని బ‌రిలోకి దిగిన జేడీఎస్‌పై ఒక‌ప్ప‌టి మిత్ర‌ప‌క్షం కాంగ్రెస్ పార్టీ నుంచి అనేక విమ‌ర్శ‌లు తెర‌మీదికి వ‌చ్చాయి. ఈ క్ర‌మంలోనే ప్ర‌జ్వ‌ల్ వ్య‌వ‌హారం తెర‌మీదికి వ‌చ్చింది. ఇంట్లో వంట మ‌నిషిపై అత్యాచారం చేయ‌డంతోపాటు.. స‌ద‌రు ఘ‌ట‌న‌ను వీడియోలు తీసి.. పోర్న్ సైట్ల‌లో పోస్టు చేశార‌న్న‌ది ప్ర‌ధాన అభియోగం. ఈ వ్య‌వ‌హారం బ‌య‌ట‌కు వ‌చ్చిన వెంట‌నే ప్ర‌జ్వ‌ల్‌ను పార్టీ నుంచి బ‌హిష్క‌రించారు. అయితే.. ఆయ‌న జ‌ర్మ‌నీకి పారిపోయారు.

అయిన‌ప్ప‌టికీ.. రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ కేసును సీరియ‌స్‌గా తీసుకుంది. దీంతో ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి.. విచార‌ణను ముమ్మ‌రం చేసింది. ఈ కేసుతోపాటు.. ప్ర‌జ్వ‌ల్‌పై మైసూరు స‌హా.. య‌శ్వంత‌పూర్ వంటి ప్రాంతాల్లోనూ ఇదే త‌ర‌హా కేసులు న‌మోద‌య్యాయి. ఈ కేసుల‌ పై ప్ర‌స్తుతం విచార‌ణ సాగుతోంది. అయితే.. ఇంట్లో వంట‌మ‌నిషి పై జ‌రిపిన అత్యాచారం, వీడియోలు తీయ‌డం.. వంటి కేసుపై ప్ర‌స్తుతం తీర్పు వెలువ‌డింది. ఈ కేసులో ప్ర‌జ్వ‌ల్‌ను దోషిగా తేల్చిన స్థానిక కోర్టు.. జీవిత ఖైదును విధించింది. కాగా.. ఒక మాజీ ప్ర‌ధాని మ‌న‌వ‌డికి దేశంలో ఇలాంటి శిక్ష ప‌డ‌డం, పైగా మ‌హిళ‌ల‌పై అత్యాచారం కేసును ఎదుర్కొన‌డం ఇదే తొలిసారి..

ఇక్క‌డ చిత్రం ఏంటంటే.. ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ బాబాయి.. కుమార‌స్వామి ప్ర‌స్తుతం మోడీ మంత్రివ‌ర్గంలో కేంద్ర మంత్రిగా వున్నారు. జీవిత ఖైదుతో పాటు.. 10 ల‌క్ష‌ల జ‌రిమానా కూడా విధించిన కోర్టు దీనిలో 7 ల‌క్ష‌ల‌ను బాధిత వంట మ‌నిషికి ఇవ్వాల‌ని.. మిగిలిన మూడు ల‌క్ష‌లు.. అనాథ మ‌హిళల సేవాశ్ర‌మాల‌కు ఇవ్వాల‌ని తీర్పులో పేర్కొంది. ఇక‌, ఈ కేసుతోనే ప్ర‌జ్వ‌ల్ దారుణాల‌కు తెర‌ప‌డ‌లేదు. మ‌రో రెండు కేసులు విచార‌ణ‌లోనే ఉండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on August 2, 2025 6:14 pm

Share

Recent Posts

అధికార పార్టీ ఎమ్మెల్యే కుమారుడి ప్రేమ్ కహాని

తెలంగాణాలో ఎమ్మెల్యేలు, మంత్రులకు తమ కుమారుల ప్రేమ వ్యవహారాలు తలనొప్పిగా మారుతున్నాయి. నిన్నా మొన్నటి వరకు కేంద్ర మంత్రి బండి…

30 minutes ago

అల్లు అర్జున్ 23… అప్పుడే ఇన్ని ప్రచారాలా

ఇంకా రాకా షూటింగ్ పూర్తి కాలేదు. మూడు నెలలకు పైనే వర్కింగ్ డేస్ అవసరమవుతాయని అంటున్నారు. అందుకే విడుదల తేదీ…

39 minutes ago

మరో రెండు ఎయిమ్స్ ఆసుపత్రుల కోసం జనసేన వినతి

రాష్ట్రంలో వైద్యం ఖరీదైన వస్తువుగా మారిపోయింది. ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ పరీక్షలు, ఇతరత్రా ఖర్చుల పేరుతో ప్రైవేటు ఆసుపత్రులు రోగుల నుంచి…

1 hour ago

దర్శన్ కేసులో కీలక మలుపు

కన్నడ సినిమాలో అతి పెద్ద స్టార్లలో ఒకడైన దర్శన్.. ఏ బాధలూ లేని జీవితాన్ని, బంగారం లాంటి జీవితాన్ని ఎలా…

2 hours ago

ఆగస్ట్ 7… ఓటిటిలో కంటెంట్ వర్షం

థియేటర్లలో రేపు నాలుగైదు సినిమాలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రత్యేకంగా ఓటిటిలో వచ్చే కొత్త కంటెంట్ కోసం ఎదురు…

2 hours ago

వైసీపీ ‘జెన్ జీ’ కాదు… ‘గంజాయ్ జీ’

వైసీపీ అధినేత జ‌గ‌న్ వెనుక ఉండే కార్య‌క‌ర్త‌లు, యువ‌త అంతా `జెన్‌జీ` అంటూ వైసీపీ నేత‌లు ప్ర‌చారం చేస్తున్నారు. ముఖ్యంగా…

2 hours ago