Movie News

నేనా.. పవన్ కళ్యాణ్‌ను డీగ్రేడ్ చేయడమా?

టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరు, సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ.. సోషల్ మీడియాలో ఎంత పాపులరో తెలిసిందే. ఆయన ఏదైనా ఈవెంట్లో పాల్గొన్నా.. ప్రెస్‌మీట్‌కు హాజరైనా.. ఇంటర్వ్యూ ఇచ్చినా.. తన కామెంట్లతో వార్తల్లో వ్యక్తి అయిపోతుంటారు. చాలా ఓపెన్‌గా మాట్లాడే క్రమంలో ఆయన చేసే కామెంట్లు కొన్నిసార్లు వివాదాస్పదం అవుతుంటాయి. ఇటీవల ‘కింగ్డమ్’ సినిమా సక్సెస్ మీట్లో నాగవంశీ ఇలాగే యథాలాపంగా చేసిన కామెంట్‌కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హర్టయ్యారు.

‘కింగ్డమ్’ సక్సెస్ మీట్ ఏపీలో నిర్వహించాలనుకుంటున్నట్లు నాగవంశీ చెప్పగా.. ఆ ఈవెంట్‌కు పవన్ కళ్యాణ్‌కు అతిథిగా పిలుస్తారా అని ఒక విలేకరి అడిగాడు. దానికాయన బదులిస్తూ.. ప్రస్తుతం తమకు విజయే పవన్ కళ్యాణ్ అని వ్యాఖ్యానించారు. దీని మీద పవన్ ఫ్యాన్స్ ఫైర్ అయిపోయారు. పవన్ కళ్యాణ్‌ను డీగ్రేడ్ చేసి మాట్లాడాడంటూ సోషల్ మీడియాలో.. నాగవంశీ మీద యుద్ధం ప్రకటించేశారు.

ఐతే తాజాగా ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూలో నాగవంశీ ఈ వివాదం మీద స్పందించారు. తాను పవన్ కళ్యాణ్‌ను డీగ్రేడ్ చేయడం ఏంటి అని ఆయన ఆశ్చర్యపోయారు. సినిమాలకు సంబంధించి కొన్ని విషయాల్లో కొందరిని రెఫరెన్సుగా తీసుకుంటామని.. ఎవరైనా అందంగా ఉన్నారని చెప్పడానికి హృతిక్ రోషన్‌లా ఉన్నాడు అని కామెంట్ చేస్తామని.. అలాగే తెలుగులో హీరో అంటే పవన్ కళ్యాణే అనే అభిప్రాయం ఉందని.. తాను కూడా ఆ ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్‌ ఒక రెఫరెన్స్ అన్నట్లుగా.. తమకు విజయ్ దేవరకొండనే పవన్ కళ్యాణ్ అనే అర్థంలో మాట్లాడానని నాగవంశీ వివరించాడు.

నిజానికి తాను పవన్ కళ్యాణ్‌కు ఎలివేషన్ ఇచ్చానని.. ఇలాంటి కామెంట్‌ను కూడా కాంట్రవర్శీగా మారిస్తే తాను ఏం చేయలేనని నాగవంశీ వ్యాఖ్యానించాడు. నిజానికి కొందరు పవన్ ఫ్యాన్స్.. నాగవంశీ కామెంట్లను పాజిటివ్‌గానే తీసుకున్నారు. అది ఎలివేషనే తప్ప.. డీగ్రేడ్ చేయడం కాదని కో ఫ్యాన్స్‌కు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయినా కొందరు నాగవంశీ మీద పడిపోయారు.

This post was last modified on August 2, 2025 4:48 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

9 minutes ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

12 minutes ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

1 hour ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

2 hours ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

5 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

5 hours ago