మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో విడుదల కావడం కొత్త కాదు కానీ ఒక పాత మూవీని ఫ్రెష్ గా రిలీజ్ చేయడం అరుదు. అలాంటి ఘనతను మనం దక్కించుకోనుంది. పదకొండు సంవత్సరాల క్రితం 2014లో రిలీజైన మనంలో అక్కినేని హీరోలందరూ నటించారు. దర్శకుడు విక్రమ్ కె కుమార్ టిపికల్ స్క్రీన్ ప్లేని సామాన్యులకు సైతం అర్థమయ్యేలా చెప్పడంతో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకుంది. ముఖ్యంగా ఏఎన్ఆర్ చివరి చిత్రంగా దీంతో ఫ్యాన్స్ కి ఎమోషనల్ కనెక్షన్ ఉంది. ఆ మధ్య పరిమితంగా మళ్ళీ విడుదల చేస్తే హైదరాబాద్ లో పలు చోట్ల హౌస్ ఫుల్స్ పడ్డాయి.
ఇదిలా ఉండగా మనం ఆగస్ట్ 8 జపాన్ లో భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. నాగార్జునకు అక్కడ ఇమేజ్ ఉంది. బ్రహ్మాస్త్ర పార్ట్ 1 తర్వాత తనను అక్కడి ఫ్యాన్స్ నాగ్ సామ అని పిలుచుకుంటున్నారు. సామ అంటే అక్కడి భాషలో అన్నయ్య, దేవుడు, కావాల్సినవాడు అని అర్థం. అప్పటి నుంచి రకరకాలుగా తమ అభిమానాన్ని నాగ్ మీద చూపిస్తూనే ఉంటారు. అందుకే మనం వాళ్లకు బాగా కనెక్ట్ అవుతుందనే ఉద్దేశంతో అక్కడి ఆడియన్స్ కోసం థియేటర్లకు తీసుకొస్తున్నారు. రిలీజ్ రోజు నాగార్జున వర్చువల్ వీడియో కాల్ ద్వారా జపాన్ అభిమానులతో ముచ్చటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ తర్వాత ఇండియన్ మూవీస్ కి జపాన్ లో డిమాండ్ పెరిగింది. విజువల్ ఎఫెక్ట్స్ నిండినవి కాకుండా మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న వాటికి పట్టం కడుతున్న వైనం వసూళ్లలో కనిపిస్తోంది. ముత్తు సక్సెస్ కు కారణం అదే. భావోద్వేగాలు పుష్కలంగా ఉండే మనం ఖచ్చితంగా జపాన్ జనాలకు కనెక్ట్ అవుతుందని బయ్యర్ల నమ్మకం. ఒకవేళ ఇది కనక వర్కౌట్ అయితే భవిష్యత్తులో మరిన్ని నాగ్ మూవీస్ జపాన్ కు వెళ్లిపోతాయి. మనంకే ఇలా అయితే నువ్వు వస్తావని, నిన్నే పెళ్లాడతా, హలో బ్రదర్ లాంటి ఆల్ టైం సూపర్ హిట్స్ కి ఇంకేమవుతారో చూడాలి. మొత్తానికి నాగ్ సామ జోరు మాములుగా లేదు.
This post was last modified on August 2, 2025 6:19 pm
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…