కరోనా కావొచ్చు.. దాని బాబాయ్ కావొచ్చు. వేళ ఏదైనా.. సందర్భం మరేదైనా సరే. ఆదివారం వస్తే చాలు.. కాసింత చికనో.. మటనో తింటే అదో లెక్క. ఎంత లాక్ డౌన్ అయితే మాత్రం పస్తులుంటామా? కరోనా పుణ్యమా అని బయటకు వెళ్లలేని వేళ.. ఇళ్లల్లోనే బంధీలుగా మారిపోయిన దుస్థితి.
కలలో కూడా ఊహించని రీతిలో వారాలకు తరబడి ఇళ్లలోనే ఉంటున్న వారికి.. వారాంతం వస్తే చాలు.. కూసింత చికనో.. కాసింత మటనో తెచ్చుకొని వండుకుంటే తప్పించి.. ఆదివారం పూర్తి కాదు.
అయితే.. ఏపీ ప్రభుత్వం తాజాగా షాకింగ్ నిర్ణయాన్ని తీసుకుంది. ఆదివారం వేళ మటన్ అమ్మకాలపై పూర్తిస్థాయిలో నిషేధాన్ని విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. నిత్యవసర వస్తువుల్ని తెచ్చుకునేందుకు ఇళ్లల్లో నుంచి బయటకు రావటానికి వీలుగా అనుమతలు ఇస్తే.. ప్రజలు వాటిని దుర్వినియోగం చేయటాన్ని తప్పు పట్టారు.
నిత్యవసర వస్తువుల్ని తెచ్చుకోవటానికి అనుమతిస్తే.. నిబంధనలకు విరుద్ధంగా బయటకు వస్తున్నారని.. ఆదివారం వేళ.. మాంసం దుకాణాల వద్ద నెలకొన్న రద్దీని చూస్తే.. పరిస్థితి ఇట్టే అర్థమైపోతుందన్నారు.
చికెన్.. మటన్.. చేపల కోసం అంగుళం దూరం కూడా పాటించకుండా షాపుల వద్ద ఎగబడిపోతున్న వైనాన్ని ఏపీ మంత్రి పేర్ని నాని తప్పుపట్టారు. ఈ కారణంతోనే ఆదివారం చికెన్.. మటన్.. చేపల అమ్మకాలపై బ్యాన్ విధించినట్లుగా తేల్చేశారు.
నాన్ వెజ్ తినకపోతే ఏమీ కాదని.. కానీ భౌతికదూరాన్ని అమలు చేయకుండా ఎగబడితే జరిగే ప్రమాదం ఎక్కువన్నారు. ఈ కారణంతోనే ఆదివారం మాంసం అమ్మకాలపై నిషేధాన్ని విధిస్తున్నట్లుగా పేర్ని స్పష్టం చేశారు. నాన్ వెజ్ ప్రియులకు ఏపీ సర్కారు తీసుకున్న తాజా నిర్ణయం వేదనకు గురి చేయటం ఖయమని చెప్పక తప్పదు.
This post was last modified on May 1, 2020 12:15 pm
టాక్సిక్ విడుదల నేపథ్యంలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ గురించి ప్రేక్షకుల్లో ఒకరకమైన ఆసక్తి నెలకొంది. ఎందుకంటే కెజిఎఫ్ తర్వాత…
ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్న ఇరుముడి మీద టీచర్ల సమాఖ్య అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సినిమాలో ప్రభుత్వ…
రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ మీద అభిమానుల అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఆశ్చర్యకరంగా హిందీ వెర్షన్ అమ్మకాలు…
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుతో లిక్కర్ కుంభకోణం మళ్ళీ తెరపైకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో నాశిరకం మద్యం వ్యాపారాన్ని…
``కాంగ్రెస్ పార్టీలో నేనైనా ఆమె అయినా ఒక్కటే. పార్టీ క్రమశిక్షణ విషయంలో అందరూ సమానమే. ఎవరు ఏం చేశారన్నది పార్టీ…
ఒక పార్టీలో ఇబ్బందులు రావొచ్చు.. నాయకులు అసంతృప్తి వ్యక్తం చేయొచ్చు. కానీ.. అడుగు పెట్టిన ప్రతిపార్టీలోనూ ఇబ్బందులు వస్తే.. ప్రతిపార్టీపైనా…