‘మా మంచి నేత.’ అని ప్రజలతో అనిపించుకునేందుకు చాలానే కృషి చేయాలి. ఇలాంటి నాయకులు చాలా తక్కువ మందే ఉన్నారు. అయితే.. వయసు మీదపడ్డా.. నిఖార్సయిన నాయకుడిగా రాజకీయాలు చేస్తున్నారు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ప్రస్తుతం ఆయన 80+లో ఉన్నారు. అయితేనేం.. ఎలాంటి ఆధారం లేకుండా.. వడివడిగా నడవడంతోపాటు.. పొలం గట్లపైనా దూకుడగా ముందుకు సాగుతున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు.
ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పిలుపునిచ్చిన.. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గోరంట్ల నిర్వహిస్తున్నారు. వారిని మూడు రోజుల పాటు ఆయన ప్రజల మధ్యే ఉంటున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. రైతుల కష్టాలు , సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా స్థానిక అంశాలపై పట్టు ఉండడంతో వాటిపైనా ఆయన చర్చిస్తున్నారు. ఇక, సర్కారు చేస్తున్న మంచిని కూడా ప్రచారం చేస్తున్నారు.
ఇలా.. గోరంట్ల తనకంటూ ప్రత్యేకతను చాటుతున్నారు. వాస్తవానికి.. యువ ఎమ్మెల్యేలే చాలా మంది ఇంకా.. ప్రజల మధ్యకురానివారు.. పదుల సంఖ్యలో ఉన్నారు. అలాంటి సమయంలో గోరంట్ల ప్రజల మధ్య కు వడివడిగా రావడం.. ఇక్కడి వారి సమస్యలు తెలుసుకోవడం ఆసక్తిగా మారింది. ఇక, గత ఎన్నికల్లోనే అతి కష్టం మీద టికెట్ దక్కించుకున్న గోరంట్ల అప్పట్లో ఈ ఒక్కసారి అంటూ.. ప్రకటించారు. అంటే.. వచ్చే ఎన్నికలనాటికి తాను బరిలో నిలవనని పేర్కొన్నారు.
కానీ.. మారుతున్న పరిస్థితులు.. రాష్ట్రంలో మళ్ల కూటమి ప్రభుత్వమే వస్తుందన్న సంకేతాలు వస్తున్న క్రమంలో గోరంట్ల మరోసారి పోటీకి రెడీ అవుతున్నారన్నది రాజమండ్రి టాక్. అందుకే.. ఆయన ఉభయ కుశలోపరి అన్నట్టుగా.. ఇటు ప్రజలను కలుస్తూ.. మరోవైపు.. తన వ్యక్తిగత రాజకీయాల గ్రాఫ్ ఎలా ఉందో కూడా.. చూసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి డీలిమిటేషన్ ఎలానూ జరుగుతుంది కాబట్టి.. మరోసారి బరిలో నిలిచే ఆలోచన చేస్తున్నారు. ఇక, ప్రజల సమస్యల విషయంలోనూ.. రైతుల సమస్యల విషయంలో వెంటనే స్పందిస్తున్నారన్నది వాస్తవం. అందుకే.. గోరంట్ల మా మంచి నేత అయ్యారు!.
This post was last modified on July 21, 2025 3:24 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…