శర్వానంద్ శ్రీకారం, నాని గ్యాంగ్ లీడర్ తో మనకూ పరిచయమున్న ప్రియాంకా అరుళ్ మోహన్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ఓజి చేస్తున్న సంగతి తెలిసిందే. దీని షూటింగ్ అయిపోయింది కానీ ఈ సినిమా మీద అమ్మడు చాలా ఆశలు పెట్టుకుంది. టాలీవుడ్ మొదటి బ్లాక్ బస్టర్ దీంతో దక్కబోతోందని ఎదురు చూస్తోంది. సరిపోదా శనివారం మంచి పేరే తీసుకొచ్చినప్పటికీ అది పూర్తిగా నాని, ఎస్జె సూర్య డామినేషన్ లో నడవడంతో ఎక్కువ హైలైట్ కాలేకపోయింది. అయితే తమిళంలో మంచి ఫాలోయింగ్ ఉన్న ప్రియాంకా మోహన్ మీద మార్కెటింగ్ కుట్ర జరుగుతోందని కోలీవుడ్ మీడియా వర్గాలు కోడై కూస్తున్నాయి.
వివరాల్లోకి వెళ్తే ప్రియాంకా అరుళ్ మోహన్ కు మొన్నటిదాకా మార్కెట్ బాగానే ఉండేది. శివ కార్తికేయన్ తో డాన్ – డాక్టర్, సూర్య ఈటిలు మంచి హిట్లే ఇచ్చాయి. ధనుష్ కెఫైన్ మిల్లర్, జయం రవి బ్రదర్ ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయినా ఇమేజ్ పరంగా మరీ డౌన్ ఫాల్ అయితే రాలేదు. ప్రస్తుతం కెవిన్ తో చేస్తున్న మూవీ ఒకటే తన చేతిలో ఉంది. చెన్నై టాక్ ప్రకారం ప్రియాంక మోహన్ మీద ఒక పిఆర్ ఏజెన్సీ ఉద్దేశపూర్వకంగానే నెగటివ్ క్యాంపైన్ తో తనకు అవకాశాలు రాకుండా చేస్తోందట. ఒకప్పుడు ఇదే కంపెనీ కోలీవుడ్ టాప్ సెలబ్రిటీలతో పాటు ఈమెకు కూడా సేవలు అందించింది.
అయితే వీళ్ళ పద్ధతి నచ్చక ప్రియాంకా కొన్ని నెలల క్రితం వాళ్ళతో ఒప్పందం రద్దు చేసుకుంది. దీన్ని అవమానంగా భావించిన సదరు సంస్థ కావాలనే తన గురించి తప్పుడు ప్రచారాలు చేస్తోందని ఫ్యాన్స్ కంప్లయింట్ చేస్తున్నారు. వీటి మీద అంత సులభంగా ఆధారాలు దొరకవు కాబట్టి ప్రస్తుతానికి ఇది ఆన్ లైన్ డిస్కషన్ కు మాత్రమే పరిమితమయ్యింది. జాబిలమ్మ నీకు అంత కోపమాలో తను స్పెషల్ సాంగ్ చేసినప్పుడు జరిగిన ట్రోలింగ్ వెనుక కూడా అదే పిఆర్ ఉన్నారని అభిమానులు అనుమానపడుతున్నారు. అందుకే అంటారు సినీ పరిశ్రమలో ఎవరికి ఎవరు ఏమి కారు, ఇక్కడంతా అవసరాల మీద నడిచే వారని.
This post was last modified on July 21, 2025 5:36 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…