Political News

లిక్క‌ర్ స్కాంలో మిథున్ రెడ్డి రోల్ ఇదీ.. !

ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం ఉన్న ఐదేళ్ల కాలంలో లిక్క‌ర్ ఆ పార్టీ నాయ‌కుల‌కు ఒక ఆదాయ వ‌న‌రు!. ఈ మాట చెప్పింది… ప్ర‌త్య‌ర్థులు కాదు.. ఈ కేసును విచారిస్తున్న ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం అధికారులు. అందుకే.. ఈ కేసులో ఇప్ప‌టికి 44 మందిని విచారించారు. వీరిలోనూ కీల‌క‌మైన మాజీ ఐఏఎస్ అదికారులు కూడా ఉన్నారు. అలానే.. వైసీపీ మాజీ నాయ‌కుడు, రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి కూడా ఉన్నారు. సో.. మొత్తంగా రాజ్ క‌సిరెడ్డితో మొద‌లైన ఈ వ్య‌వ‌హారం.. ఇప్పుడు కీల‌క మ‌లుపు తిరిగింది.

ప్ర‌స్తుత ఎంపీ.. వైసీపీ కీల‌క నాయ‌కుడు.. మిథున్ రెడ్డి వ‌ర‌కు వ‌చ్చింది. ఆయ‌న‌ను రేపో మాపో అరెస్టు చేయ‌డం ఖాయం. అయితే.. అస‌లు ఈ లిక్క‌ర్ కుంభ‌కోణంలో మిథున్ రెడ్డి ఏం చేశారు? అంత‌గా ఆయ‌నను ఈ కేసులో ఏ-4గా న‌మోదు చేయాల్సిన అవ‌స‌రం ఏముంది? అనేవి కీల‌క ప్ర‌శ్న‌లు. వీటిపైనా ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం అధికారులు.. ప‌లు విష‌యాల‌ను వివ‌రించారు.

1) వైసీపీ హ‌యాంలో చీపు లిక్క‌రును అత్య‌ధిక మొత్తంలో అంటే.. రూ.50 విలువ చేసే బ్రాండ్ల‌ను రూ.200(క్వార్ట‌ర్‌)కు విక్ర‌యించేలా ధ‌ర నిర్ణ‌యించింది.. మిథున్ రెడ్డే.

2) త‌మ సొంత కంపెనీల‌ను ఏర్పాటు చేసి.. ఈ డిస్ట‌ల‌రీల ద్వారా మ‌ద్యాన్ని ప్ర‌భుత్వానికి విక్ర‌యించారు. ఈ క్ర‌మంలో సుమారు 15 కోట్ల‌ను తమ ఖాతాలోకి మ‌ళ్లించుకున్నారు.

3) సిట్ కేసు న‌మోదు చేయ‌డానికి ముందే.. ఏ కంపెనీల ద్వారా త‌మ‌కు సొమ్ము అందిందో .. ఆయా కంపెనీల‌కు ఈ మొత్తాన్ని తిరిగి ఇచ్చేశారు. ఈ విష‌యాన్ని కూడా సిట్ అధికారులు గుర్తించారు.

4) ఎంపీగా త‌న‌కు ఉన్న అధికారాల‌ను అడ్డం పెట్టుకుని.. జిల్లాల్లో.. అధికార యంత్రాంగాన్ని న‌డిపించారు. ఎక్సైజ్ పాల‌సీ రూప‌క‌ల్ప‌న‌లోనూ.. మిథున్ రెడ్డి పాత్ర ఉంది.

5) డిస్టిల‌రీలకు(ఇత‌ర కంపెనీలు) ఇండెంటు పెట్టే విష‌యం కూడా.. మిథున్ రెడ్డే చూసుకున్నారు. త‌ద్వారా.. త‌మ‌కు అధిక మొత్తంలో క‌మీష‌న్లు ఇచ్చే కంపెనీల‌కు ఎక్కువ మొత్తంలో ఇండెంటు ద‌క్కేలా చ‌క్రం తిప్పారు.

6) వ‌చ్చిన క‌మీష‌న్లు ఎవ‌రికి ఎంత మొత్తం చెల్లించాలో.. హైద‌రాబాద్‌, రాజంపేటలోని నివాసం, దుబాయ్‌ల‌లో చ‌ర్చించి నిర్ణ‌యించిన గ్రూపులో మిథున్ రెడ్డి ఒక‌రు. ఇలా.. ప‌లు అంశాల‌ను సిట్ అధికారులు పేర్కొన్నారు.

This post was last modified on July 18, 2025 3:02 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘మావిగన్’ పేరుతో జగన్ కొత్త రాజధాని ప్రతిపాదన

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…

31 minutes ago

అమరావతిపై జగన్ అక్కసు తగ్గలేదా?

ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…

1 hour ago

జయలలిత స్ట్రాటజీ మళ్లీ: విజయ్ పెద్ద ప్లాన్

సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…

2 hours ago

యుద్ధంలో కేబుల్స్ కట్?

అమెరికా-ఇరాన్ యుద్ధం ఇప్పుడు కేవలం భూమి, ఆకాశానికే పరిమితం కాకుండా సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ వ్యవస్థపై కూడా నీలినీడలు…

2 hours ago

హైదరాబాద్ లో కొత్త ట్రెండ్.. ‘పారా నార్మల్ టాక్స్’

రోటీన్ కు తగ్గట్లు వ్యవహరిస్తే కిక్ ఏముంటుంది? వినూత్న ఆలోచనలకు వేదికగా హైదరాబాద్ మహానగరం సాగుతోంది. ఇందులో భాగంగా సరికొత్త…

2 hours ago

7 గంటల 30 నిముషాలు… చరిత్రలో మొదటిసారి

వసూళ్ల లెక్కల్లోనే కాదు చాలా విషయాల్లో దురంధర్ ది రివెంజ్ ఎవరికీ అందని రికార్డులు సొంతం చేసుకుంటోంది. భారతీయ సినీ…

3 hours ago