Political News

ఇద్ద‌రు సీఎంల భేటీ.. బ‌న‌క‌చ‌ర్ల‌పై ఏం తేల్చారంటే

ఏపీ, తెలంగాణ ముఖ్య‌మంత్రులు.. ఢిల్లీలో భేటీ అయ్యారు. చంద్ర‌బాబు, రేవంత్ రెడ్డిల‌తో కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రి సీఆర్ పాటిల్ చ‌ర్చించారు. దీనిలో ఏపీ ప్ర‌ధానంగా క‌ర్నూలు జిల్లాలో నిర్మించ త‌ల‌పెట్టిన బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టు విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకుంది. కానీ, తెలంగాణ మాత్రం గోదావ‌రి బోర్డు స‌హా.. నీటి కేటాయింపులు.. త‌మ రాష్ట్రంలో కొత్త‌గా నిర్మించే ప్రాజెక్టుల విష‌యాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంది. బ‌న‌క‌చర్ల అంశంపై చ‌ర్చించేది లేద‌ని తేల్చి చెప్పింది. అయితే.. కేంద్రం మాత్రం బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టుపై చ‌ర్చించింది. దీనిపై సీఎం చంద్ర‌బాబు ప‌ట్టుబ‌ట్టారు. ఈ క్ర‌మంలో రెండు మూడు నిమిషాలు మాత్ర‌మే ఈ స‌మావేశంలో బ‌న‌క‌చ‌ర్ల‌పై చ‌ర్చ జ‌రిగింది.

తెలంగాణ య‌ధావిధిగా త‌న అభ్యంత‌రాల‌ను పేర్కొంది. అస‌లు గోదావ‌రిలో మిగులు జ‌లాలు.. రెండు రాష్ట్రాల‌కూ వ‌ర్తిస్తాయ‌ని.. అలాంట‌ప్పుడు ఏక‌ప‌క్షంగా ఏపీ బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టును భుజాన ఎత్తుకోవ‌డం ఎందుకని ప్ర‌శ్నించింది. ఇది క‌డితే.. త‌మ ప్రాంతంలోని చాలా జిల్లాలు.. ఎడారి అవుతాయ‌ని పేర్కొంది. కానీ, ఏపీ మాత్రం అవ‌స‌ర‌మైతే.. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా నీటిని పంచుకునేందుకు తాము స‌హ‌క‌రిస్తామ‌ని తెలిపింది. ఈ నేప‌థ్యంలో ఈ వివాదంపై చ‌ర్చించేందుకు, బ‌న‌క‌చ‌ర్ల‌పై ఒక నిర్ణ‌యానికి వ‌చ్చేందుకు వీలుగా ఒక క‌మిటీని ఏర్పాటు చేస్తున్న‌ట్టు కేంద్ర మంత్రి ప్ర‌క‌టించారు. సోమ‌వారం ఈ క‌మిటీకి సంబంధించిన విధి విధానాల‌పై క‌స‌ర‌త్తు చేయాల‌ని నిర్ణ‌యించారు.

ఇక‌, తెలంగాణ‌, ఏపీ రాష్ట్రాల‌కు సంబంధించిన ఉమ్మ‌డి ప్రాజెక్టులు స‌హా.. గోదావ‌రి ప‌రివాహ‌క ప్రాంతంలోని ప్రాజెక్టుల‌పై టెలీ మెట్రీ విధానాన్ని అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించారు. త‌ద్వారా ఎవ‌రు ఎంత నీటిని వాడుతున్నార‌న్న‌ది లెక్క‌లు తేల‌నుంది. గ‌తంలో కేసీఆర్ దీనిని వ్య‌తిరేకించ‌గా.. ప్ర‌స్తుత సీఎం రేవంత్ రెడ్డి ఓకే చెప్పారని తెలిసింది. ఇక‌, ఏపీకి కీల‌క‌మైన శ్రీశైలం ప్రాజెక్టు మ‌ర‌మ్మ‌తులు, నీటి విడుద‌ల‌, స్టోరేజీ అంశాల‌పై ఏపీ చర్చించింది. నాగార్జున సాగ‌ర్ వివాదం కూడా చ‌ర్చ‌కు వ‌చ్చింది. మొత్తంగా ఒక నిర్ణ‌యం అంటూ.. ఏదీ తేల‌కుండానే.. ఈ స‌మావేశం ముగిసింది. తెలంగాణ‌లో కొత్త ప్రాజెక్టుల‌కు అనుమ‌తుల విష‌యంపై ప‌రిశీల‌న చేయ‌నున్న‌ట్టు కేంద్రం ప్ర‌క‌టించింది.

Satya

Recent Posts

కూట‌మికి రెండేళ్లు ఓకే… చేయవలసినవి ఇంకా ఉన్నాయి

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం రెండేళ్ల పాల‌న‌ను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్ర‌భుత్వం ఏం చేయాల‌న్నా.. మ‌రో…

1 hour ago

ప్రభాస్ ఫోన్ లో ఆ వాల్ పేపర్ ఎందుకుంది?

ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…

6 hours ago

“మ‌రో వందేళ్ల‌యినా… కాంగ్రెస్ ఇంతే”

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ.. ప‌శ్చిమ‌బెంగాల్‌లో శ‌నివారం సాయంత్రం ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న దేశ‌వ్యాప్తంగా అన్న‌దాత‌ల‌కు పీఎం-కిసాన్ నిధుల‌ను…

8 hours ago

‘గొడ్డ‌లి పార్టీ అంత‌కు మించి ఏం చేసింది?’

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. మ‌రోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గ‌త ఐదేళ్ల కాలంలో గొడ్డ‌లి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయ‌డం..…

10 hours ago

నేను హోమ్ మినిస్టర్ కాకపోవడమే నేరస్తుల అదృష్టం: పవన్

ఏపీలో అంతకంతకూ పెరిగిపోతున్న కుల భావనపైనా, విపక్షాలు నిత్యం ఆరోపణలు గుప్పిస్తున్న శాంతి భద్రతల మీద జనసేన అధినేత, డిప్యూటీ…

10 hours ago

సెన్సార్ చిక్కులు చిన్న సినిమాలకేనా

వందల కోట్లతో తీసినా, తక్కువ బడ్జెట్ లో పూర్తి చేసినా ఏదైనా సినిమానే. వేసేది ప్రొజెక్టర్ వాడే తెరపైనే. చిన్నాపెద్దా…

11 hours ago