Political News

ఇద్ద‌రు సీఎంల భేటీ.. బ‌న‌క‌చ‌ర్ల‌పై ఏం తేల్చారంటే

ఏపీ, తెలంగాణ ముఖ్య‌మంత్రులు.. ఢిల్లీలో భేటీ అయ్యారు. చంద్ర‌బాబు, రేవంత్ రెడ్డిల‌తో కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రి సీఆర్ పాటిల్ చ‌ర్చించారు. దీనిలో ఏపీ ప్ర‌ధానంగా క‌ర్నూలు జిల్లాలో నిర్మించ త‌ల‌పెట్టిన బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టు విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకుంది. కానీ, తెలంగాణ మాత్రం గోదావ‌రి బోర్డు స‌హా.. నీటి కేటాయింపులు.. త‌మ రాష్ట్రంలో కొత్త‌గా నిర్మించే ప్రాజెక్టుల విష‌యాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంది. బ‌న‌క‌చర్ల అంశంపై చ‌ర్చించేది లేద‌ని తేల్చి చెప్పింది. అయితే.. కేంద్రం మాత్రం బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టుపై చ‌ర్చించింది. దీనిపై సీఎం చంద్ర‌బాబు ప‌ట్టుబ‌ట్టారు. ఈ క్ర‌మంలో రెండు మూడు నిమిషాలు మాత్ర‌మే ఈ స‌మావేశంలో బ‌న‌క‌చ‌ర్ల‌పై చ‌ర్చ జ‌రిగింది.

తెలంగాణ య‌ధావిధిగా త‌న అభ్యంత‌రాల‌ను పేర్కొంది. అస‌లు గోదావ‌రిలో మిగులు జ‌లాలు.. రెండు రాష్ట్రాల‌కూ వ‌ర్తిస్తాయ‌ని.. అలాంట‌ప్పుడు ఏక‌ప‌క్షంగా ఏపీ బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టును భుజాన ఎత్తుకోవ‌డం ఎందుకని ప్ర‌శ్నించింది. ఇది క‌డితే.. త‌మ ప్రాంతంలోని చాలా జిల్లాలు.. ఎడారి అవుతాయ‌ని పేర్కొంది. కానీ, ఏపీ మాత్రం అవ‌స‌ర‌మైతే.. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా నీటిని పంచుకునేందుకు తాము స‌హ‌క‌రిస్తామ‌ని తెలిపింది. ఈ నేప‌థ్యంలో ఈ వివాదంపై చ‌ర్చించేందుకు, బ‌న‌క‌చ‌ర్ల‌పై ఒక నిర్ణ‌యానికి వ‌చ్చేందుకు వీలుగా ఒక క‌మిటీని ఏర్పాటు చేస్తున్న‌ట్టు కేంద్ర మంత్రి ప్ర‌క‌టించారు. సోమ‌వారం ఈ క‌మిటీకి సంబంధించిన విధి విధానాల‌పై క‌స‌ర‌త్తు చేయాల‌ని నిర్ణ‌యించారు.

ఇక‌, తెలంగాణ‌, ఏపీ రాష్ట్రాల‌కు సంబంధించిన ఉమ్మ‌డి ప్రాజెక్టులు స‌హా.. గోదావ‌రి ప‌రివాహ‌క ప్రాంతంలోని ప్రాజెక్టుల‌పై టెలీ మెట్రీ విధానాన్ని అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించారు. త‌ద్వారా ఎవ‌రు ఎంత నీటిని వాడుతున్నార‌న్న‌ది లెక్క‌లు తేల‌నుంది. గ‌తంలో కేసీఆర్ దీనిని వ్య‌తిరేకించ‌గా.. ప్ర‌స్తుత సీఎం రేవంత్ రెడ్డి ఓకే చెప్పారని తెలిసింది. ఇక‌, ఏపీకి కీల‌క‌మైన శ్రీశైలం ప్రాజెక్టు మ‌ర‌మ్మ‌తులు, నీటి విడుద‌ల‌, స్టోరేజీ అంశాల‌పై ఏపీ చర్చించింది. నాగార్జున సాగ‌ర్ వివాదం కూడా చ‌ర్చ‌కు వ‌చ్చింది. మొత్తంగా ఒక నిర్ణ‌యం అంటూ.. ఏదీ తేల‌కుండానే.. ఈ స‌మావేశం ముగిసింది. తెలంగాణ‌లో కొత్త ప్రాజెక్టుల‌కు అనుమ‌తుల విష‌యంపై ప‌రిశీల‌న చేయ‌నున్న‌ట్టు కేంద్రం ప్ర‌క‌టించింది.

This post was last modified on July 16, 2025 6:40 pm

Share
Show comments

Recent Posts

బాల్క సుమ‌న్ కు రిమాండ్‌.. కేటీఆర్ వడ్డీ వార్నింగ్

బీఆర్ ఎస్ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేప‌థ్యంలో తెలంగాణ రాజ‌కీయాలు మ‌రో సారి నిప్పు రాజుకున్నాయి.…

3 hours ago

జైల్లో ఎంజాయ్ చేసిన అంబటి

ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…

4 hours ago

చేదుగా ఉన్నా నిజం చెప్పిన దిల్ రాజు

ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…

5 hours ago

బుర్ఖా వేసుకున్న యువకుడు.. ఫ్రీ బస్ కోసమేనా?

తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్‌లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…

7 hours ago

‘ఆ రెండు’ సీట్లు కాంగ్రెస్‌వే.. ఎవ‌రికి ద‌క్కేనో!!

తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…

7 hours ago

పుష్ప స్టైల్ లో లోకేష్ కౌంటర్

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌ను వీక్షించడం…

7 hours ago