ఇటీవల దశాబ్ద కాలంలో ప్రశాంతంగా ఉన్న భాగ్యనగరంలో ఒక్కసారిగా అలజడి రేగింది. మార్నింగ్ వాక్ కు వచ్చిన కమ్యూనిస్టు నాయకుడే లక్ష్యంగా కొందరు దుండగులు.. తుపాకీలతో కాల్పులు జరిపారు. దీంతో హైదరాబాద్ నగరం యావత్తు పొద్దు పొద్దున్నే ఉలిక్కి పడింది. అసలేం జరిగిందంటూ.. అందరూ ఆరా తీశారు. వాస్తవానికి తెలంగాణలో తుపాకీ సంస్కృతి లేదు. తుపాకులు ఉన్న నాయకులు ఉన్నా.. ఎప్పుడూ వాటిని బయటకు కూడా తీసినట్టు ఎక్కడా కనిపించలేదు.
కానీ.. తాజాగా మంగళవారం ఉదయం మలక్ పేటలో చోటు చేసుకున్న ఘటన యావత్ హైదరాబాదీలను ఉలికిపాటుకు గురి చేసింది. మలక్పేటలోని శాలివాహన నగర్ పార్క్లో జరిగిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. మార్నింగ్ వాక్ కోసం.. వెళ్లిన సీపీఐ రాష్ట్ర నేత చందు నాయక్(43)పై గుర్తు తెలియని దండు గులు తుపాకీతో కాల్పులు జరిపారు. కారులో ఒక్క ఉదుటన దూసుకు వచ్చిన దుండగులు ఆరు రౌండ్లు కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు.
అయితే.. ఈ కాల్పుల ఘటనలో చందు స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. ఆయనకు భార్య, కుమార్తె కూడా ఉన్నారు. వారు కూడా ఈ ఘటన సమయంలో మార్నింగ్ వాక్లోనే ఉన్నారు. అయితే.. వారు కూడా భయంతో అక్కడ నుంచి పరారయ్యారు. ఘటన జరిగిన కొద్ది సేపటికే పోలీసులు రంగంలోకి దిగి.. ఆధారాలు సేకరించారు. మరోవైపు.. పోస్టుమార్టమ్ కోసం.. మృత దేహాన్ని ఆసుపత్రికి తరలించారు.
ఏంటి కారణం?
కాల్పుల ఘటనపై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. భూములు, పొలాల విషయంపై పంచాయతీలు చేసిన నేపథ్యంలోనే ప్రత్యర్థి పక్షం చందుపై కక్ష పెంచుకుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయనపై కాల్పులు జరిగాయని అంటున్నారు. మరోవైపు.. వివాహేతర సంబంధం కూడా కారణమనే వాదన కూడా వినిపిస్తోంది. ఇదిలావుంటే.. నాగర్కర్నూల్ జిల్లా బల్మూరు మండలం నర్సాయిపల్లికి చెందిన చందు.. సీపీఐలో 20 ఏళ్లుగా ఉన్నారు. జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి నాయకుడిగా ఎదిగారు.
ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…
భుజానికి అయిన గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రస్తుతం ముంబై…
హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ మరోసారి తనదైన శైలిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈసారి భారీ పొక్లెయిన్…
తెలుగులో ప్రస్తుతం నంబర్ వన్ హీరోయిన్ పొజిషన్కు గట్టి పోటీదారుగా మారిన అమ్మాయి.. భాగ్యశ్రీ బోర్సే. రెండు రోజుల ముందు…