Political News

ఓడిపోయిన దువ్వాడకు డబ్బులిచ్చిన చిరు

2019-24 మధ్య వైభవం చూసి.. గత ఏడాది ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాభవం చవిచూశాక బాగా అన్ పాపులర్ అయిన నేతల్లో దువ్వాడ శ్రీనివాస్ ఒకరు. ఆయన వ్యక్తిగత వ్యవహారాలు తీవ్ర దుమారం రేపడంతో, పార్టీ నుంచి సస్పెండై రాజకీయాలకు దూరమయ్యే పరిస్థితిని కొనితెచ్చుకున్నారు దువ్వాడ. అధికారంలో ఉండగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ఆయన ఏ స్థాయిలో నోరు పారేసుకున్నారో తెలిసిందే. అలాంటి వ్యక్తి తనకు ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి చేసిన సాయం గురించి ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయం వెల్లడించారు.

ఒకప్పుడు చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీలో దువ్వాడ శ్రీనివాస్ కూడా సభ్యుడే. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగానూ పోటీ చేశారాయన. కానీ ఓటమి పాలయ్యారు. ఐతే ఎన్నికల్లో ఓడి ఆర్థికంగా నష్టపోయానన్న ఉద్దేశంతో చిరు తనకు సాయం చేసిన విషయాన్ని శ్రీనివాస్ వెల్లడించాడు. ఎన్నికలు అయ్యాక చిరు స్వయంగా ఫోన్ చేసి.. ‘‘ఎన్నికల్లో ఓడిపోయావు కదా, డబ్బులు నష్టపోయి ఉంటావు, మనందరం రాజశేఖర్ రెడ్డి హవాలో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. డబ్బుల విషయంలో ఇబ్బంది పడుతుంటావు. ఈ సాయం తీసుకో’’ అని అడిగి మరీ డబ్బులు పంపించినట్లు దువ్వాడ శ్రీనివాస్ వెల్లడించారు.

ఏమనుకున్నారూ చిరంజీవి అంటే అంటూ మెగాస్టార్‌కు ఆయన ఎలివేషన్ ఇచ్చారు. తనకు చిరు డబ్బులు ఇచ్చిన విషయం అప్పట్లో ప్రజారాజ్యం పార్టీలో ఉన్న గంటా శ్రీనివాసరావు, కళా వెంకట్రావు లాంటి వాళ్లకు కూడా తెలుసని ఆయనన్నారు. ఐతే చిరు నుంచి ఇంత సాయం పొందిన దువ్వాడ.. తర్వాతి రోజుల్లో ఆయన సోదరుడైన పవన్ కళ్యాణ్ మీద ఆ స్థాయిలో ఎలా నోరు పారేసుకున్నారు, ఎలా దూషణలకు దిగారు అంటూ నెటిజన్లు ఈ వీడియో కింద కామెంట్లు పెడుతున్నారు.

This post was last modified on July 10, 2025 1:29 pm

Share

Recent Posts

జంతర్ మంతర్ కు చెక్ ?

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…

3 hours ago

సత్య హాస్యం చాలా ప్లస్ అవుతోంది

గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…

3 hours ago

వెంక‌ట‌ప్ప ఫెయిల్… ఇక మాలిక్ ఏం చేస్తాడో?

తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే అత్యంత గొప్ప న‌టుల జాబితా తీస్తే.. అందులో పైవ‌రుస‌లో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒక‌రు.…

4 hours ago

పీకే ఇక ఎమ్మెల్యే సాబ్!

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…

4 hours ago

వ్య‌క్తి చ‌నిపోతే… కేసు మూసేయొచ్చు: ఉండ‌వ‌ల్లి కేసుపై సుప్రీంకోర్టు

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ఓ కీల‌క కేసు విష‌యంలో సుప్రీంకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. వ్య‌క్తి చ‌నిపోయిన త‌ర్వాత‌.. కేసును…

4 hours ago

డాటరాఫ్ రవీనా… ఫలితం కూడా అదేనా

టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…

4 hours ago