తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ మాజీ సీఎం జగన్, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ల తెరచాటు స్నేహమే తెలంగాణను జల వివాదాల్లోకి నెట్టిందని వ్యాఖ్యానించారు. వారిద్దరి మధ్య ఎలాంటి స్నేహం ఉన్నా.. తెలంగాణకు మేలు చేసేలా ఉండాలని.. కానీ, తీవ్రంగా నష్టపరిచేలా వ్యవహరించారని అన్నారు. అదే తెలంగాణ సమాజానికి మరణ శాసనం రాసిందన్నారు. ఈ అధికారం కేసీఆర్కు ఎవరు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. గతంలోనే జల వివాదాల పై బలమైన గళం వినిపించి ఉంటే.. ఇప్పుడు ఈ కష్టాలు వచ్చి ఉండేవి కావని రేవంత్ రెడ్డి చెప్పారు.
ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న రేవంత్ రెడ్డి.. మీడియాతో మాట్లాడారు. దీనికి ముందు కృష్ణా జలాల విషయంలో ఏపీ, తెలంగాణ వాటాలు, ఇతరత్రా సమస్యలు, ఏపీ ఏవిధంగా వ్యవహరిస్తోందన్న విషయాలపై రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాకు వివరించారు. అనంతరం.. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. “బేసిన్లు లేవు.. భేషజాలు లేవని కేసీఆర్ అన్నారు. గోదావరి నుంచి 3 వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని చెప్పారు. గోదావరి, కృష్ణా, పెన్నా బేసిన్ వరకు నీళ్లు తరలించుకోవచ్చన్నారు. అప్పటి ఏపీ సీఎం జగన్తో చేతులు కలిపి .. తెలంగాణ గొంతు కోశాడు” అని వ్యాఖ్యానించారు.
రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి జల వాలాల నుంచి హైదరాబాద్ నీటి వాటాను వేరు చేయాల్సిన బాధ్యతను కేసీఆర్ విస్మరించారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్కుపోగా మిగిలిన జలాలను మాత్రమే రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయాల్సి ఉందని.. ఈ చిన్న విషయాన్ని విస్మరించి.. తెలంగాణ సమాజాన్ని కేసీఆర్ ముంచేశారని దుయ్యబట్టారు. తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లాల్సిన నీటిని.. ముందుగా ఏపీకి తరలించేలా వ్యవహరించారని, ఆ తర్వాత.. తెలంగాణ వాడుకునేలా చేశారని.. దీనివల్ల తెలంగాణ ఎంత నష్టపోయిందో ఇప్పుడు తెలుస్తోంది. “మీరు మీరు రాసుకోండి.. పూసుకోండి. కానీ, తెలంగాణ సమాజాన్ని ఇబ్బంది పెట్టే హక్కు నీకెవరిచ్చారు” అని రేవంత్ రెడ్డి నిలదీశారు.
This post was last modified on July 9, 2025 10:43 pm
లోకనాయకుడు కమల్ హాసన్ పనైపోయిందనుకున్న సమయంలో ఆయన అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చిన సినిమా.. విక్రమ్. ఆ సినిమాతోనే సౌత్…
తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిధి స్టాలిన్ను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నటి త్రిష,…
గుజరాత్లో చాందిపుర వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే 22 మంది చిన్నారులు మృతిచెందినట్లు రాష్ట్ర…
సినీ అభిమానులందు తెలుగు అభిమానులు వేరు అని ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే. తమ సినిమాలను ప్రమోట్ చేయడం కోసం తెలుగు రాష్ట్రాలకు…
మలయాళం సూపర్ స్టార్ గా పేరొందిన మోహన్ లాల్ కూతురు విస్మయ ఈ శుక్రవారం విడుదల కాబోతున్న తుదక్కంతో తెరంగేట్రం…
బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…