Political News

ప్లాన్ ప్ర‌కార‌మే అల‌జ‌డి.. వారంతా వైసీపీ రైతులే!

చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో ప‌ర్య‌టించిన జ‌గ‌న్‌.. ప‌క్కా ప్లాన్‌తో వ్య‌వ‌హ‌రించార‌ని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. చిత్తూరు జిల్లాకే చెందిన వైసీపీ మాజీ స‌ర్పంచ్ ప్ర‌కాష్ రెడ్డికి 25 ఎక‌రాల మామిడి తోట ఉంద‌ని.. ఆయ‌న గ‌తంలోనే చాలా వ‌ర‌కు కాయ‌ల‌ను కిలో 4 రూపాయ‌ల చొప్పున అమ్మేసుకున్నార‌ని చెప్పారు. అయితే.. జ‌గ‌న్ వస్తున్నాడ‌ని తెలిసి.. ప‌క్కా ప్లాన్ ప్ర‌కారం ఐదు ట్రాక్ట‌ర్ల‌లో మామిడికాయ‌ల‌ను త‌ర‌లించి.. న‌డిరోడ్డుపై పోసి.. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా కుట్ర‌లు ప‌న్నార‌ని తెలిపారు. రైతుల‌ను ప‌రామ‌ర్శించాల‌న్న ఉద్దేశం ఉంటే.. రెండు మాసాల కింద‌టే జ‌గ‌న్ వ‌చ్చి ఉండాల్సింద‌న్నారు.

కాని.. ఇప్పుడు కొనుగోలు ప్ర‌క్రియ దాదాపు ముగిసిపోతున్న ద‌శ‌లో వ‌చ్చి.. రాజ‌కీయం చేయాల‌ని.. కుట్ర‌లు ప‌న్నార‌ని మంత్రి చెప్పారు. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌కాష్‌రెడ్డి తోట నుంచి అప్ప‌టిక‌ప్పుడు ట్రాక్ట‌ర్ల‌లో మామిడి కాయ‌లు త‌ర‌లించి.. ర‌హ‌దారికి అడ్డంగా నిలిపి.. ట్రాఫిక్ నిలిపివేసి.. ట్రాక్ట‌ర్ల‌లోని మామిడి కాయ‌ల‌ను ర‌హ‌దారుల‌పై వెద‌జ‌ల్లార‌ని చెప్పారు. పోనీ.. ఆయ‌న‌కు బాధ‌తో అలా చేశార‌ని అనుకున్నా.. జ‌గ‌న్ ఐదేళ్లు ముఖ్య‌మంత్రిగా పాలించిన అనుభ‌వం ఏమైంది? అని అచ్చెన్న ప్ర‌శ్నించారు. వెంట‌నే కారు దిగి.. ప్ర‌కాష్‌రెడ్డిని వారించాల్సిన అవ‌స‌రం లేదా? మామిడికాయ‌ల‌ను తొక్కుకుంటూ వెళ్లిపోతారా? అని నిల‌దీశారు.

వాస్త‌వానికి జ‌గ‌న్ వ‌చ్చే హెలిప్యాడ్‌ వద్దకు 30 మందికి అనుమతి మాత్ర‌మే ఉంద‌న్న అచ్చ‌న్నాయుడు 300 మంది వచ్చార‌ని చెప్పారు. సీఎంగా పని చేసిన వ్యక్తి ఈ సమాజానికి ఎలాంటి మెసేజ్‌ ఇస్తున్నారని ఆయ‌న నిల‌దీశారు. ఆ త‌ర్వాత ర్యాలీ వ‌ద్ద‌న్నా.. వేల మందిని పోగేసి.. ప్ర‌భుత్వాన్ని బ‌ద్నాం చేసే ప్ర‌య‌త్నం చేశారన్నారు. ముందు వేసుకున్న ప్లాన్‌ ప్రకారమే ర్యాలీలు చేశార‌ని చెప్పారు. ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్తంగా లేక‌పోతే.. ఈ రోజు మ‌రింత మంది సింగ‌య్య‌లు చ‌నిపోయి ఉండేవార‌ని చెప్పారు. ఎంత జాగ్ర‌త్తలు పాటించినా.. పోలీసులు, విలేకరులపైనా దాడులకు తెగబ‌డ్డార‌ని.. ఇలాంటి వాటిని చూస్తూ ఊరుకుంటామా? అని ప్ర‌శ్నించారు.

This post was last modified on July 9, 2025 10:11 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నో డౌట్‌: కేసీఆర్‌తోనే క‌విత ఢీ!

తెలంగాణ‌లో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌.. త‌న‌య క‌విత.. నిన్న…

38 minutes ago

త‌మిళ‌నాట మైకులు బంద్‌… ఎవ‌రి సత్తా ఎంత‌?

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసింది. ఎన్నిక‌ల సంఘం నిబంధ‌న‌ల మేర‌కు మంగ‌ళ‌వారం సాయంత్రం 5 గంట‌లకే అన్ని పార్టీలు..…

3 hours ago

ఈటీవీ విన్… జాగ్రత్తపడాలి

ఈటీవీ విన్.. పోస్టర్ మీద ఈ లోగో ఉంటే చాలు.. అది సినిమా అయినా, వెబ్ సిరీస్ అయినా అందులో…

5 hours ago

బన్నీపై 7th ఫెయిల్ ట్రోలింగ్

సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది ట్రెండింగ్ టాపిక్‌గా మారుతుందో.. దేని మీద నెటిజన్లు చర్చలు పెడతారో చెప్పలేం. కొన్నిసార్లు ఎప్పటివో…

6 hours ago

కూటమి నాయకులు అలా నేతలేమో ఇలా

ఏపీలో అధికార కూటమిలోని పార్టీల మధ్య తరచూ చిన్న చిన్న వివాదాలు చెలరేగుతున్నాయి. అయితే ఈ వివాదాలన్నీ ఆయా పార్టీల కీలక నేతల ప్రమేయం…

6 hours ago

కల్ట్ సీక్వెల్… ఈసారి సెటప్ అక్కడ

థియేటర్లలో రిలీజైనపుడు ఆశించిన స్పందన తెచ్చుకోకపోయినా.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ తెచ్చుకునే సినిమాలు కొన్ని ఉంటాయి. ‘ఈ నగరానికి…

6 hours ago