చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో పర్యటించిన జగన్.. పక్కా ప్లాన్తో వ్యవహరించారని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. చిత్తూరు జిల్లాకే చెందిన వైసీపీ మాజీ సర్పంచ్ ప్రకాష్ రెడ్డికి 25 ఎకరాల మామిడి తోట ఉందని.. ఆయన గతంలోనే చాలా వరకు కాయలను కిలో 4 రూపాయల చొప్పున అమ్మేసుకున్నారని చెప్పారు. అయితే.. జగన్ వస్తున్నాడని తెలిసి.. పక్కా ప్లాన్ ప్రకారం ఐదు ట్రాక్టర్లలో మామిడికాయలను తరలించి.. నడిరోడ్డుపై పోసి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నారని తెలిపారు. రైతులను పరామర్శించాలన్న ఉద్దేశం ఉంటే.. రెండు మాసాల కిందటే జగన్ వచ్చి ఉండాల్సిందన్నారు.
కాని.. ఇప్పుడు కొనుగోలు ప్రక్రియ దాదాపు ముగిసిపోతున్న దశలో వచ్చి.. రాజకీయం చేయాలని.. కుట్రలు పన్నారని మంత్రి చెప్పారు. ఈ నేపథ్యంలోనే ప్రకాష్రెడ్డి తోట నుంచి అప్పటికప్పుడు ట్రాక్టర్లలో మామిడి కాయలు తరలించి.. రహదారికి అడ్డంగా నిలిపి.. ట్రాఫిక్ నిలిపివేసి.. ట్రాక్టర్లలోని మామిడి కాయలను రహదారులపై వెదజల్లారని చెప్పారు. పోనీ.. ఆయనకు బాధతో అలా చేశారని అనుకున్నా.. జగన్ ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పాలించిన అనుభవం ఏమైంది? అని అచ్చెన్న ప్రశ్నించారు. వెంటనే కారు దిగి.. ప్రకాష్రెడ్డిని వారించాల్సిన అవసరం లేదా? మామిడికాయలను తొక్కుకుంటూ వెళ్లిపోతారా? అని నిలదీశారు.
వాస్తవానికి జగన్ వచ్చే హెలిప్యాడ్ వద్దకు 30 మందికి అనుమతి మాత్రమే ఉందన్న అచ్చన్నాయుడు 300 మంది వచ్చారని చెప్పారు. సీఎంగా పని చేసిన వ్యక్తి ఈ సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారని ఆయన నిలదీశారు. ఆ తర్వాత ర్యాలీ వద్దన్నా.. వేల మందిని పోగేసి.. ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం చేశారన్నారు. ముందు వేసుకున్న ప్లాన్ ప్రకారమే ర్యాలీలు చేశారని చెప్పారు. ప్రభుత్వం అప్రమత్తంగా లేకపోతే.. ఈ రోజు మరింత మంది సింగయ్యలు చనిపోయి ఉండేవారని చెప్పారు. ఎంత జాగ్రత్తలు పాటించినా.. పోలీసులు, విలేకరులపైనా దాడులకు తెగబడ్డారని.. ఇలాంటి వాటిని చూస్తూ ఊరుకుంటామా? అని ప్రశ్నించారు.
This post was last modified on July 9, 2025 10:11 pm
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…