దక్షిణాది రాష్ట్రాలకు బీజేపీ ప్రాధాన్యం ఇస్తోంది. ముఖ్యంగా ఆర్ ఎస్ ఎస్తో సంబంధం ఉన్న వారికి బీజేపీ అధ్యక్ష పీఠాలను అప్పగిస్తోంది. ఇది చిత్రం కాదు.. చాలా వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగులుగా విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీ ఇప్పటి వరకు ఉత్తరాది పైనే దృష్టి పెట్టింది. ఉత్తరాది రాష్ట్రాల ఓటు బ్యాంకు, అక్కడి ప్రజలను మచ్చిక చేసుకునే విషయంపైనే దృష్టి సారించింది. అలాంటి ఒక్కసారిగా దక్షిణాదిపై మక్కువ చూపిస్తోంది.
దీనికి కారణం.. ఉత్తరాదిలో కాంగ్రెస్ బలోపేతం అవుతోంది. దీనికితోడు.. చిన్న చితకా పార్టీలు.. కూడా ఉత్తరాదిలో బలం పుంజుకుంటున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ సహా.. సమాజ్వాదీ, తృణమూల్ కాంగ్రెస్ వంటివి బీజేపీకి సవాల్ రువ్వుతున్నారు. వీటితో పోల్చుకుంటే.. దక్షిణాదిలో పార్టీల దూకుడు బీజేపీకి పెద్దగా మైనస్ కాదు. పైగా.. ఎక్కువ పార్టీలు.. బీజేపీ ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో కలిసి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ 2029 ఎన్నికలను దృస్టిలో పెట్టుకుని దక్షిణాదికి ప్రాధాన్యం పెంచుతోంది.
అంతేకాదు.. బీజేపీకి కలిసి వచ్చే అవకాశం కూడా దక్షిణాదిలో ఉంది. ఇప్పటి వరకు ఎలా ఉన్నా.. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలకు ఇస్తున్న నిధులు.. ఏర్పాటు చేస్తున్న ప్రాజెక్టులు వంటివి కమల నాథులకు కొంత ఊపిరి సలుపుకునే అవకాశం కల్పిస్తున్నాయి. తెలంగాణలో అయినా.. ఏపీలో అయినా.. తమిళనాడు, కర్ణాటకల్లో అయినా.. బీజేపీకి మేలు జరిగే అవకాశం కనిపిస్తోందన్నది ప్రత్యక్షంగానే కనిపిస్తోంది. అందుకే.. ఇక్కడి వారికి ప్రాధాన్యం ఇచ్చేందుకు బీజేపీ ఉత్సాహంగా ఉంది.
ఉదాహరణకు గత ఎన్నికలను తీసుకుంటే.. బీజేపీకి దక్షిణాది పార్టీలైన టీడీపీ, జనసేనలు అండగా నిలిచాయి. ఫలితంగా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం కలిగింది. ఇదే ఫార్ములను వచ్చే ఎన్నికల నాటికి కూడా పాటించడం ద్వారా.. బీజేపీ పుంజుకునే దిశగా ముఖ్యంగా అధికారం నిలబెట్టుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఎన్నికలకు నాలుగేళ్ల సమయం ఉన్నా.. ఇప్పటి నుంచి దక్షిణాదిపైనే
ఆపరేషన్ లోటస్కు ఇదీ కారణమని అంటున్నారు పరిశీలకులు.
ఎనిమిది సంవత్సరాల క్రితం రంగస్థలం విడుదలకు ముందు ఇది ఎలా ఉంటుందనే అనుమానాలు ఫ్యాన్స్ లోనే ఉండేవి. కారణం టిపికల్…
ఒకప్పటి హీరో అక్షయ్ ఖన్నా అంటే జెన్ జీ ప్రేక్షకులకు వెంటనే ఫ్లాష్ కాదు. దురంధర్ విలన్ రెహమాన్ డెకాయిట్…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందే ప్యాన్ ఇండియా మూవీ ప్రకటన పోస్టర్ రూపంలో రావడం ఆలస్యం తెలుగు…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత విశ్వరూపం చూపించారు. పదునైన మాటలతో విరుచుకుపడ్డారు. ``ఇప్పటి వరకు మీరు అన్న..…
మిస్టర్ బచ్చన్ లాంటి డిజాస్టర్ తో టాలీవుడ్ కెరీర్ మొదలుపెట్టిన భాగ్యశ్రీ బోర్సేకు చాలా కాలం టైం కలిసి రాలేదు.…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చి తీరుతుందన్నారు.…