Political News

సౌత్‌లో ‘ఆప‌రేష‌న్ లోట‌స్‌’ రీజ‌నేంటి?

ద‌క్షిణాది రాష్ట్రాల‌కు బీజేపీ ప్రాధాన్యం ఇస్తోంది. ముఖ్యంగా ఆర్ ఎస్ ఎస్‌తో సంబంధం ఉన్న వారికి బీజేపీ అధ్యక్ష పీఠాల‌ను అప్ప‌గిస్తోంది. ఇది చిత్రం కాదు.. చాలా వ్యూహాత్మ‌కంగా వేస్తున్న అడుగులుగా విశ్లేష‌కులు చెబుతున్నారు. బీజేపీ ఇప్ప‌టి వ‌ర‌కు ఉత్త‌రాది పైనే దృష్టి పెట్టింది. ఉత్త‌రాది రాష్ట్రాల ఓటు బ్యాంకు, అక్క‌డి ప్ర‌జ‌ల‌ను మ‌చ్చిక చేసుకునే విష‌యంపైనే దృష్టి సారించింది. అలాంటి ఒక్క‌సారిగా ద‌క్షిణాదిపై మ‌క్కువ చూపిస్తోంది.

దీనికి కార‌ణం.. ఉత్త‌రాదిలో కాంగ్రెస్ బ‌లోపేతం అవుతోంది. దీనికితోడు.. చిన్న చిత‌కా పార్టీలు.. కూడా ఉత్త‌రాదిలో బ‌లం పుంజుకుంటున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ స‌హా.. స‌మాజ్‌వాదీ, తృణ‌మూల్ కాంగ్రెస్ వంటివి బీజేపీకి స‌వాల్ రువ్వుతున్నారు. వీటితో పోల్చుకుంటే.. ద‌క్షిణాదిలో పార్టీల దూకుడు బీజేపీకి పెద్ద‌గా మైన‌స్ కాదు. పైగా.. ఎక్కువ పార్టీలు.. బీజేపీ ప్ర‌త్య‌క్షంగానో.. ప‌రోక్షంగానో క‌లిసి వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో బీజేపీ 2029 ఎన్నిక‌ల‌ను దృస్టిలో పెట్టుకుని ద‌క్షిణాదికి ప్రాధాన్యం పెంచుతోంది.

అంతేకాదు.. బీజేపీకి క‌లిసి వ‌చ్చే అవ‌కాశం కూడా ద‌క్షిణాదిలో ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఎలా ఉన్నా.. ప్ర‌స్తుతం ద‌క్షిణాది రాష్ట్రాల‌కు ఇస్తున్న నిధులు.. ఏర్పాటు చేస్తున్న ప్రాజెక్టులు వంటివి క‌మ‌ల నాథుల‌కు కొంత ఊపిరి స‌లుపుకునే అవ‌కాశం క‌ల్పిస్తున్నాయి. తెలంగాణ‌లో అయినా.. ఏపీలో అయినా.. త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌ల్లో అయినా.. బీజేపీకి మేలు జ‌రిగే అవ‌కాశం క‌నిపిస్తోంద‌న్న‌ది ప్ర‌త్య‌క్షంగానే క‌నిపిస్తోంది. అందుకే.. ఇక్క‌డి వారికి ప్రాధాన్యం ఇచ్చేందుకు బీజేపీ ఉత్సాహంగా ఉంది.

ఉదాహ‌ర‌ణ‌కు గ‌త ఎన్నిక‌ల‌ను తీసుకుంటే.. బీజేపీకి ద‌క్షిణాది పార్టీలైన టీడీపీ, జ‌న‌సేన‌లు అండ‌గా నిలిచాయి. ఫ‌లితంగా కేంద్రంలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసుకునే అవ‌కాశం క‌లిగింది. ఇదే ఫార్ముల‌ను వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి కూడా పాటించ‌డం ద్వారా.. బీజేపీ పుంజుకునే దిశ‌గా ముఖ్యంగా అధికారం నిల‌బెట్టుకునే దిశ‌గా అడుగులు వేస్తోంది. ఎన్నిక‌ల‌కు నాలుగేళ్ల స‌మ‌యం ఉన్నా.. ఇప్ప‌టి నుంచి ద‌క్షిణాదిపైనే
ఆప‌రేష‌న్ లోట‌స్‌కు ఇదీ కార‌ణ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on July 7, 2025 10:37 am

Share
Show comments
Published by
Satya
Tags: BJP

Recent Posts

బిర్యానీ రేంజులో ‘ప్యారడైజ్’ పాట

న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…

31 minutes ago

తిరుమల జీవోలపై చంద్రబాబు క్లారిటీ

తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…

1 hour ago

శ్రీ విష్ణుకు సన్నాఫ్ సత్యమూర్తి ఇచ్చిన షాక్

చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్‌లో మంచి క్రేజ్‌తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…

3 hours ago

రాజమౌళి, మహేష్ కొట్టుకోవడమేంటయ్యా

దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి సినిమా చేయాలని వాళ్లిద్దరి అభిమానులు ఎన్నో ఏళ్ల ముందు…

3 hours ago

మున్నా మంచి స్ట్రాటజీ వాడుతున్నాడు

మాములుగా రీ రిలీజులు ఏవి ఆడతాయో ఏవి ఆడవో అంత ఈజీగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. గత ఏడాది ఖలేజాని…

3 hours ago

ఇలాంటిది వేరే మతంలో జరిగి ఉంటే?: పవన్

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంశం జాతీయ స్థాయిలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ టాపిక్ పై…

6 hours ago