Political News

సౌత్‌లో ‘ఆప‌రేష‌న్ లోట‌స్‌’ రీజ‌నేంటి?

ద‌క్షిణాది రాష్ట్రాల‌కు బీజేపీ ప్రాధాన్యం ఇస్తోంది. ముఖ్యంగా ఆర్ ఎస్ ఎస్‌తో సంబంధం ఉన్న వారికి బీజేపీ అధ్యక్ష పీఠాల‌ను అప్ప‌గిస్తోంది. ఇది చిత్రం కాదు.. చాలా వ్యూహాత్మ‌కంగా వేస్తున్న అడుగులుగా విశ్లేష‌కులు చెబుతున్నారు. బీజేపీ ఇప్ప‌టి వ‌ర‌కు ఉత్త‌రాది పైనే దృష్టి పెట్టింది. ఉత్త‌రాది రాష్ట్రాల ఓటు బ్యాంకు, అక్క‌డి ప్ర‌జ‌ల‌ను మ‌చ్చిక చేసుకునే విష‌యంపైనే దృష్టి సారించింది. అలాంటి ఒక్క‌సారిగా ద‌క్షిణాదిపై మ‌క్కువ చూపిస్తోంది.

దీనికి కార‌ణం.. ఉత్త‌రాదిలో కాంగ్రెస్ బ‌లోపేతం అవుతోంది. దీనికితోడు.. చిన్న చిత‌కా పార్టీలు.. కూడా ఉత్త‌రాదిలో బ‌లం పుంజుకుంటున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ స‌హా.. స‌మాజ్‌వాదీ, తృణ‌మూల్ కాంగ్రెస్ వంటివి బీజేపీకి స‌వాల్ రువ్వుతున్నారు. వీటితో పోల్చుకుంటే.. ద‌క్షిణాదిలో పార్టీల దూకుడు బీజేపీకి పెద్ద‌గా మైన‌స్ కాదు. పైగా.. ఎక్కువ పార్టీలు.. బీజేపీ ప్ర‌త్య‌క్షంగానో.. ప‌రోక్షంగానో క‌లిసి వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో బీజేపీ 2029 ఎన్నిక‌ల‌ను దృస్టిలో పెట్టుకుని ద‌క్షిణాదికి ప్రాధాన్యం పెంచుతోంది.

అంతేకాదు.. బీజేపీకి క‌లిసి వ‌చ్చే అవ‌కాశం కూడా ద‌క్షిణాదిలో ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఎలా ఉన్నా.. ప్ర‌స్తుతం ద‌క్షిణాది రాష్ట్రాల‌కు ఇస్తున్న నిధులు.. ఏర్పాటు చేస్తున్న ప్రాజెక్టులు వంటివి క‌మ‌ల నాథుల‌కు కొంత ఊపిరి స‌లుపుకునే అవ‌కాశం క‌ల్పిస్తున్నాయి. తెలంగాణ‌లో అయినా.. ఏపీలో అయినా.. త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌ల్లో అయినా.. బీజేపీకి మేలు జ‌రిగే అవ‌కాశం క‌నిపిస్తోంద‌న్న‌ది ప్ర‌త్య‌క్షంగానే క‌నిపిస్తోంది. అందుకే.. ఇక్క‌డి వారికి ప్రాధాన్యం ఇచ్చేందుకు బీజేపీ ఉత్సాహంగా ఉంది.

ఉదాహ‌ర‌ణ‌కు గ‌త ఎన్నిక‌ల‌ను తీసుకుంటే.. బీజేపీకి ద‌క్షిణాది పార్టీలైన టీడీపీ, జ‌న‌సేన‌లు అండ‌గా నిలిచాయి. ఫ‌లితంగా కేంద్రంలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసుకునే అవ‌కాశం క‌లిగింది. ఇదే ఫార్ముల‌ను వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి కూడా పాటించ‌డం ద్వారా.. బీజేపీ పుంజుకునే దిశ‌గా ముఖ్యంగా అధికారం నిల‌బెట్టుకునే దిశ‌గా అడుగులు వేస్తోంది. ఎన్నిక‌ల‌కు నాలుగేళ్ల స‌మ‌యం ఉన్నా.. ఇప్ప‌టి నుంచి ద‌క్షిణాదిపైనే
ఆప‌రేష‌న్ లోట‌స్‌కు ఇదీ కార‌ణ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on July 7, 2025 10:37 am

Share
Show comments
Published by
Satya
Tags: BJP

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

3 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

3 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

3 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

4 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

6 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

7 hours ago