Political News

ఉలిక్కిప‌డ్డ వైసీపీ.. ఒకేసారి 113 మందిపై కేసు!

ఎలాంటి కేసులు వ‌చ్చినా.. ఎంత మందిని జైల్లోకి నెట్టిన బేఫిక‌ర్ అంటూ.. ఏపీలో ప్ర‌తిప‌క్ష పార్టీ వైసీపీ వ్యాఖ్య‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. ముఖ్యంగా ఆ పార్టీ అధినేత జ‌గ‌న్ ప‌దేప‌దే.. కేసులు పెడ‌తారా పెట్టుకోండి.. అంటూ కూడా వ్యాఖ్యానించారు. ఇలాంటి కీల‌క స‌మ‌యంలో అనూహ్య ప‌రిస్థితి ఎదురైంది. వైసీపీకి చెందిన కీల‌క నాయ‌కులు స‌హా, నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్‌లుగా ఉన్న‌వారికి మొత్తంగా 113 మంది ఒకేసారి పోలీసులు నోటీసులు జారీ చేశారు. వారిపై కేసులు కూడా పెట్టారు.

ఈ హ‌ఠాత్ ప‌రిణామంతో వైసీపీ అధినాయ‌క‌త్వం ఉలిక్కిప‌డింది. ఏం జ‌రిగింది? అంటూ.. జ‌గ‌న్ ఆరా తీసే ప‌రిస్థితి వ‌చ్చింది. గ‌త నెల 18న జ‌గ‌న్ గుంటూరు జిల్లా స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలోని రెంట‌పాళ్ల గ్రామం లో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా సింగ‌య్య అనే కార్య‌క‌ర్త కాన్వాయ్ కింద ప‌డి మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే. ఈ కేసు ఒక‌వైపు న‌డుస్తోంది. ఇప్పుడు తాజాగా ఆనాడు పోలీసుల మాట విన‌లేద‌ని.. ప్ర‌జ‌ల ఆస్థుల‌ను ధ్వంసం చేశార‌ని పేర్కొంటూ.. పోలీసులు 113 మందిపై ఒకేసారి కేసులు పెట్టారు.

పోలీసుల అనుమ‌తి లేకుండా.. ర్యాలీ నిర్వ‌హించ‌డంతోపాటు.. వాహ‌నాల‌కు డీజే సౌండ్ బాక్సులు ఏర్పాటు చేసి ప్రజలు, స్కూల్స్, ఆస్పత్రులకు ఇబ్బంది కలిగించార‌ని పేర్కొంటూ.. న‌మోదు చేసిన కేసులో మాజీ మంత్రులు విడదల రజనీ, అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యేలు నంబూరు శంకర‌రావు, బొల్లా బ్రహ్మనాయుడు, కాసు మహేశ్ రెడ్డి, గొపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, అన్నాబత్తుని శ్రావణ్ కుమార్, దేవినేని అవినాశ్, తదితర 113 మంది నేతలపై కేసు నమోదు చేశారు.

దీంతో ఒక్క‌సారిగా వైసీపీలో క‌ల‌క‌లం రేగింది. అస‌లు ఏం జ‌రిగింది? ఇప్ప‌టి వ‌ర‌కు పోలీసులు ఏం చేశారు.? ఈ ఘ‌ట‌న జ‌రిగి 20 రోజుల త‌ర్వాత‌.. కేసులు న‌మోదుచేయ‌డం రాజ‌కీయ క‌క్ష‌లో భాగ‌మ‌ని తాడేప‌ల్లి నాయ‌కులు వ్యాఖ్యానించారు. దీనిపై కోర్టులో తేల్చుకుంటామ‌ని వ్యాఖ్యానించారు.

This post was last modified on July 6, 2025 9:46 pm

Share

Recent Posts

కాంగ్రెస్ లో క్రమశిక్షణ తప్పదా?

మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. కొండా సురేఖ కూతురు సుస్మిత మొదలుపెట్టిన వివాదానికి ఫుల్ స్థాప్ పెట్టడానికి రంగం…

1 hour ago

మీరు టికెట్ ఇవ్వడానికి ఎవరు ఉండరు జగన్

స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరిస్తున్నట్లుంది వైసీపీ అధినేత జగన్ తీరు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి…

3 hours ago

రోమాంచకం… సరిపోతుందా సమయం

టాలీవుడ్ లోనే కాదు బయట రాష్ట్రాల్లో కూడా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అంటే ఒక బ్రాండ్. తీసింది కేవలం…

4 hours ago

హనుమాన్ దర్శకుడి హవా మొదలైంది

‘హనుమాన్’ సినిమాతో రెండున్నరేళ్ల ముందు దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎంతటి సంచలనం రేపాడో తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో ఈ…

5 hours ago

అజ్ఞాతవాసి… పుచ్చుకున్నదంతా ఇచ్చేసిన త్రివిక్రమ్

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో రాజమౌళి, అనిల్ రావిపూడిలను పక్కన పెడితే డిజాస్టర్లు లేని దర్శకులు లేరు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్…

5 hours ago

పంజాని మరో ఆరెంజ్ చేసేలా ఉన్నారు

ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ కాక డిజాస్టర్లుగా నిలిచిపోయిన సినిమాలు ఇప్పుడు రీ రిలీజ్ టైంలో అద్భుతాలు చేయడం చూస్తూనే…

6 hours ago