Political News

ఉలిక్కిప‌డ్డ వైసీపీ.. ఒకేసారి 113 మందిపై కేసు!

ఎలాంటి కేసులు వ‌చ్చినా.. ఎంత మందిని జైల్లోకి నెట్టిన బేఫిక‌ర్ అంటూ.. ఏపీలో ప్ర‌తిప‌క్ష పార్టీ వైసీపీ వ్యాఖ్య‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. ముఖ్యంగా ఆ పార్టీ అధినేత జ‌గ‌న్ ప‌దేప‌దే.. కేసులు పెడ‌తారా పెట్టుకోండి.. అంటూ కూడా వ్యాఖ్యానించారు. ఇలాంటి కీల‌క స‌మ‌యంలో అనూహ్య ప‌రిస్థితి ఎదురైంది. వైసీపీకి చెందిన కీల‌క నాయ‌కులు స‌హా, నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్‌లుగా ఉన్న‌వారికి మొత్తంగా 113 మంది ఒకేసారి పోలీసులు నోటీసులు జారీ చేశారు. వారిపై కేసులు కూడా పెట్టారు.

ఈ హ‌ఠాత్ ప‌రిణామంతో వైసీపీ అధినాయ‌క‌త్వం ఉలిక్కిప‌డింది. ఏం జ‌రిగింది? అంటూ.. జ‌గ‌న్ ఆరా తీసే ప‌రిస్థితి వ‌చ్చింది. గ‌త నెల 18న జ‌గ‌న్ గుంటూరు జిల్లా స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలోని రెంట‌పాళ్ల గ్రామం లో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా సింగ‌య్య అనే కార్య‌క‌ర్త కాన్వాయ్ కింద ప‌డి మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే. ఈ కేసు ఒక‌వైపు న‌డుస్తోంది. ఇప్పుడు తాజాగా ఆనాడు పోలీసుల మాట విన‌లేద‌ని.. ప్ర‌జ‌ల ఆస్థుల‌ను ధ్వంసం చేశార‌ని పేర్కొంటూ.. పోలీసులు 113 మందిపై ఒకేసారి కేసులు పెట్టారు.

పోలీసుల అనుమ‌తి లేకుండా.. ర్యాలీ నిర్వ‌హించ‌డంతోపాటు.. వాహ‌నాల‌కు డీజే సౌండ్ బాక్సులు ఏర్పాటు చేసి ప్రజలు, స్కూల్స్, ఆస్పత్రులకు ఇబ్బంది కలిగించార‌ని పేర్కొంటూ.. న‌మోదు చేసిన కేసులో మాజీ మంత్రులు విడదల రజనీ, అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యేలు నంబూరు శంకర‌రావు, బొల్లా బ్రహ్మనాయుడు, కాసు మహేశ్ రెడ్డి, గొపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, అన్నాబత్తుని శ్రావణ్ కుమార్, దేవినేని అవినాశ్, తదితర 113 మంది నేతలపై కేసు నమోదు చేశారు.

దీంతో ఒక్క‌సారిగా వైసీపీలో క‌ల‌క‌లం రేగింది. అస‌లు ఏం జ‌రిగింది? ఇప్ప‌టి వ‌ర‌కు పోలీసులు ఏం చేశారు.? ఈ ఘ‌ట‌న జ‌రిగి 20 రోజుల త‌ర్వాత‌.. కేసులు న‌మోదుచేయ‌డం రాజ‌కీయ క‌క్ష‌లో భాగ‌మ‌ని తాడేప‌ల్లి నాయ‌కులు వ్యాఖ్యానించారు. దీనిపై కోర్టులో తేల్చుకుంటామ‌ని వ్యాఖ్యానించారు.

This post was last modified on July 6, 2025 9:46 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవర్ స్టార్ మేజిక్ పని చేస్తోంది

ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…

6 minutes ago

దేవిశ్రీ ప్రసాద్ దూరానికి కారణమిదేనా ?

పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…

42 minutes ago

పెంపుడు పిల్లి చ‌నిపోయింద‌ని.. ఉరేసుకున్న విద్యార్థిని!

పెంపుడు జంతువుల ప‌ట్ల య‌జ‌మానులు, కుటుంబ స‌భ్యులు ఎంత ప్రేమ‌ను పెంచుకుంటారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆయా జంతువులు…

1 hour ago

ఉస్తాద్ పాట‌ల వాడ‌కం.. ఎంత ఖ‌ర్చు పెట్టారో?

ఒక‌ప్పుడు పాత సినిమాల పాట‌లను య‌థేచ్ఛ‌గా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవ‌రికీ ఏ అభ్యంత‌రాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…

2 hours ago

వైసీపీ పంచాంగం.. కేంద్రం ప్లస్.. రాష్ట్రం మైనస్

ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం…

5 hours ago

స‌మంత బంగారం కోసం రాజు గారు వ‌స్తారా?

ఒక‌ప్పుడు తెలుగు, త‌మిళంలో టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా ద‌శాబ్దానికి పైగా ఒక వెలుగు వెలిగిన క‌థానాయిక స‌మంత‌. కానీ కొన్నేళ్లుగా…

6 hours ago