అచ్చెన్నకు చంద్రబాబు షాక్ ఇచ్చారా ?

కొత్తగా రాష్ట్ర కమిటికి అధ్యక్షునిగా నామినేట్ అయిన మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకు జాతీయ అధ్యక్షుడు చంద్ర బాబునాయుడు షాకిచ్చారా ? అవుననే అనిపిస్తోంది పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే. పార్టీ కార్యాలయంలో అట్టహాసంగా నిర్వహించాలని అనుకున్న రాష్ట్ర కమిటి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం వాయిదా పడిందట. దీపావళి పండుగకు ముందు తన ప్రమాణస్వీకారోత్సవం చేయాలని అచ్చెన్నాయుడు అనుకున్నారట. అనుకున్నదే తడవుగా ఇదే విషయాన్ని చంద్రబాబుతో మాట్లాడేందుకు ఫోన్ చేశారట.

అయితే అచ్చెన్న చెప్పిందంతా విన్న తర్వాత ఆ కార్యక్రమానికి తాను వచ్చేది లేదంటు చంద్రబాబు చల్లగా చెప్పారట. కరోనా వైరస్ మళ్ళీ పెరుగుతున్న విషయాన్ని గుర్తుచేసిన చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని భారీ ఎత్తున కాకుండా సింపుల్ గా కానీచ్చేయమని సలహా కూడా ఇచ్చారట. ఆ కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కాకుండా ఇంకెక్కడైనా ఫంక్షన్ హాలులో నిర్వహించుకుంటే బాగుంటుందని కూడా సలహా ఇచ్చారట. దాంతో అచ్చెన్న అశ్చర్యపోయినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

పార్టీ అధ్యక్షుడి బాధ్యతలు తీసుకునే కార్యక్రమంతో పాటు మొత్తం కార్యవర్గమంతా ప్రమాణస్వీకారం పార్టీ కార్యాలయంలో చేయటమే రివాజుగా వస్తోంది. అలాకాకుండా ఇఫుడు మాత్రం పార్టీ కార్యకార్యాలయంలో కాకుండా ఇంకేదో ఫంక్షన్ హాలులో పెట్టుకోవాలని చెప్పటం ఏమిటో అచ్చెన్నాకు అర్ధంకాలేదట. అసలే రాష్ట్ర కార్యవర్గం ఏర్పాటులో తనకు మాట మాత్రం కూడా చెప్పకుండా చంద్రబాబే ఏకపక్షంగా చేసేశారనే మంట అచ్చెన్నలో ఉందట. దానికి తోడు ఇఫుడు బాధ్యతల స్వీకార కార్యక్రమానికి కూడా తాను రానని చెప్పటం, పార్టీ కార్యాలయంలో కాకుండా ఫంక్షన్ హాలులో పెట్టుకోమని చెప్పటం పై అచ్చెన్నలో అసంతృప్తి మొదలైనట్లు సమాచారం. చూద్దాం ఏం జరుగుతుందో.