Political News

వైసీపీలో చాలా షేడ్సే ఉన్నాయే!

ఆలు లేదు.. చూలు లేదు..అన్న‌ట్టుగా ఉంది వైసీపీ నాయ‌కుల వ్య‌వ‌హారం. తాము అధికారంలోకి వ‌స్తే.. అన్న మాట నుంచి వ‌చ్చేస్తే వ‌ర‌కు నాయ‌కులు రెచ్చిపోతున్నారు. ఎన్నిక‌లు ముగిసి ఏడాది మాత్ర‌మే గ‌డిచింద‌ని.. మ‌రోసారి ఎన్నిక‌లు జ‌రిగేందుకు నాలుగేళ్ల స‌మ‌యం ఉంద‌న్న విష‌యాన్ని వారు మ‌రిచిపోయారో.. లేక న‌టిస్తున్నారో.. తెలియదు కానీ.. వైసీపీ నేత‌లు వేస్తున్న వేషాలు.. నెటిజ‌న్ల‌కు మంట‌పుట్టిస్తున్నాయి. దీంతో ‘వార్నీ యేషాలో.. వైసీపీలో చాలా షేడ్సే ఉన్నాయే!’ అని కామెంట్లు చేస్తున్నారు. పార్టీ అధినేత నుంచి నాయ‌కుల వ‌ర‌కు చేస్తున్న కామెంట్ల‌పై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

కొన్నాళ్ల కింద‌ట నుంచి వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. మ‌ళ్లీ మన‌మే అధికారంలోకి వ‌స్తున్నాం. సినిమా చూపిస్తాం.. అని కామెంట్లు చేసిన విష‌యం తెలిసిందే. ఇక‌, పోలీసుల‌పైనా ఆయ‌న దూకుడుగానే వ్యాఖ్యాలు చేశారు. స‌ప్త స‌ముద్రాల ఆవ‌ల ఉన్నా.. వ‌దిలి పెట్టేంది లేద‌న్నారు. బ‌ట్ట‌లూడ‌దీయిస్తామ‌ని కూడా వ్యాఖ్య‌లు చేశారు. వీటిపై పోలీసులు కూడా తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. అయినా.. అధినేత త‌గ్గ‌లేదు. ఇక‌, అధినేత బాట‌లోనే నాయ‌కులు కూడా న‌డుస్తున్నారు. తాము అధికారంలోకి వ‌స్తే.. అంటూ.. కామెంట్లు కుమ్మ‌రిస్తున్నారు. ఈ వ్యాఖ్య‌ల‌పై నెటిజ‌న్లు కూడా తీవ్రంగానే స్పందిస్తున్నారు.

తాజాగా జ‌గ‌న్ మేన‌మామ‌, క‌డ‌ప జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ర‌వీంద్ర‌నాథ్ రెడ్డి మ‌రింత దూకుడుగా స్పందించారు. తాము అధికారంలోకి వ‌స్తూనే.. టీడీపీ నాయకులు, కార్య‌క‌ర్త‌ల ప‌నిప‌డ‌తాం అని సెల‌విచ్చారు. అంతేకాదు.. మ‌రో అడుగు ముందుకు వేసి.. టీడీపీ సానుభూతిప‌రుల‌కు ప‌థ‌కాల‌ను క‌ట్ చేసేస్తామ‌ని చెప్పారు. కేవ‌లం వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌కు మాత్ర‌మే సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తామ‌ని.. ఈ విష‌యాన్ని గుర్తు పెట్టుకోవాల‌ని కూడా ఆయ‌న నొక్కి చెప్పారు. నియోజ‌క‌వ‌ర్గ స్థాయి స‌మావేశంలో ర‌వీంద్ర‌నాథ్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు వైర‌ల్‌గా మారాయి.

అయితే.. ఈ వ్యాఖ్య‌ల‌పై స్పందిస్తున్న నెటిజ‌న్లు.. అస‌లు మీరు అధికారంలోకి వ‌చ్చేదెప్పుడు? అని ప్ర‌శ్నిస్తున్నారు. ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ల స‌మ‌యం ఉంద‌ని.. ఇప్పుడే ప‌గ‌టి క‌ల‌లు కంటున్నారా? అని ప్ర‌శ్నించారు. ఇప్పటి నుంచే ఊహ‌ల్లో విహ రిస్తున్నారా? అని మ‌రికొంద‌రు ప్ర‌శ్నించారు. క‌ల‌లు క‌న‌డం మంచిదే కానీ.. మ‌రీ ఇంతగా కాద‌ని.. మ‌రికొంద‌రు వ్యాఖ్యానించారు. ఇంకొంద‌రు దురుసుగా ‘వార్నీ యేషాలో.. వైసీపీలో చాలా షేడ్సే ఉన్నాయే!’ అని కామెంట్లు కుమ్మ‌రిస్తున్నారు. ఇప్ప‌టికీ ప్ర‌జ‌ల‌ను మ‌చ్చిక చేసుకోవ‌డం.. వారి నుంచి సానుభూతిని దూసుకోవ‌డం వంటివి వైసీపీకి తెలియ‌డం లేద‌ని వ్యాఖ్యానిస్తున్నారు. ఇదీ.. సంగ‌తి!!.

This post was last modified on July 5, 2025 11:01 pm

Share

Recent Posts

అనిల్ యాదవ్ సైలెంటుగా సైడ్ అయిపోతున్నారా?

వైఎస్సార్‌సీపీ మాజీ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ రాజకీయ భవిష్యత్తుపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెల్లూరు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. వచ్చే…

22 minutes ago

టాలీవుడ్‌పై మలయాళ నిర్మాతల మంట

అవును.. టాలీవుడ్ పేరెత్తితే ఇప్పుడు మలయాళ నిర్మాతలు మండిపడుతున్నారట. అందుక్కారణం.. ఆ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు తెలుగు…

58 minutes ago

ఓపెనింగ్స్ బాగున్నాయి… ఏం చెబుతున్నాయి

నిన్న విడుదలైన టాక్సిక్ మొదటి రోజు 150 కోట్లకు పైగా గ్రాస్ సాధించినట్టు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. క్షేత్ర…

1 hour ago

కంటెంట్ ఉన్నప్పుడు ఛాలెంజ్ ఎందుకు

చిన్న సినిమాలకు ఉన్న అతి పెద్ద సమస్య ఓపెనింగ్స్ తెచ్చుకోవడం. ప్రమోషన్ టైంలో ఏదో ఒక వైరల్ కంటెంట్ ఇవ్వకపోతే…

3 hours ago

యాదాద్రి బోర్డు మెంబర్ గా చిరంజీవి భార్య, తీసేయాలంటున్న కవిత

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థాన పాలకమండలిలో సీనియర్‌ నటుడు చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖకు సభ్యురాలిగా చోటు కల్పించడంపై మాజీ ఎంపీ…

4 hours ago

ఏపీ లిక్కర్ స్కాం… ఈడీ తరువాత ఐటీ!

వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ కుంభకోణం దేశవ్యాప్తంగా సంచలన రేపిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ 3500…

5 hours ago