Political News

వైసీపీలో చాలా షేడ్సే ఉన్నాయే!

ఆలు లేదు.. చూలు లేదు..అన్న‌ట్టుగా ఉంది వైసీపీ నాయ‌కుల వ్య‌వ‌హారం. తాము అధికారంలోకి వ‌స్తే.. అన్న మాట నుంచి వ‌చ్చేస్తే వ‌ర‌కు నాయ‌కులు రెచ్చిపోతున్నారు. ఎన్నిక‌లు ముగిసి ఏడాది మాత్ర‌మే గ‌డిచింద‌ని.. మ‌రోసారి ఎన్నిక‌లు జ‌రిగేందుకు నాలుగేళ్ల స‌మ‌యం ఉంద‌న్న విష‌యాన్ని వారు మ‌రిచిపోయారో.. లేక న‌టిస్తున్నారో.. తెలియదు కానీ.. వైసీపీ నేత‌లు వేస్తున్న వేషాలు.. నెటిజ‌న్ల‌కు మంట‌పుట్టిస్తున్నాయి. దీంతో ‘వార్నీ యేషాలో.. వైసీపీలో చాలా షేడ్సే ఉన్నాయే!’ అని కామెంట్లు చేస్తున్నారు. పార్టీ అధినేత నుంచి నాయ‌కుల వ‌ర‌కు చేస్తున్న కామెంట్ల‌పై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

కొన్నాళ్ల కింద‌ట నుంచి వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. మ‌ళ్లీ మన‌మే అధికారంలోకి వ‌స్తున్నాం. సినిమా చూపిస్తాం.. అని కామెంట్లు చేసిన విష‌యం తెలిసిందే. ఇక‌, పోలీసుల‌పైనా ఆయ‌న దూకుడుగానే వ్యాఖ్యాలు చేశారు. స‌ప్త స‌ముద్రాల ఆవ‌ల ఉన్నా.. వ‌దిలి పెట్టేంది లేద‌న్నారు. బ‌ట్ట‌లూడ‌దీయిస్తామ‌ని కూడా వ్యాఖ్య‌లు చేశారు. వీటిపై పోలీసులు కూడా తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. అయినా.. అధినేత త‌గ్గ‌లేదు. ఇక‌, అధినేత బాట‌లోనే నాయ‌కులు కూడా న‌డుస్తున్నారు. తాము అధికారంలోకి వ‌స్తే.. అంటూ.. కామెంట్లు కుమ్మ‌రిస్తున్నారు. ఈ వ్యాఖ్య‌ల‌పై నెటిజ‌న్లు కూడా తీవ్రంగానే స్పందిస్తున్నారు.

తాజాగా జ‌గ‌న్ మేన‌మామ‌, క‌డ‌ప జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ర‌వీంద్ర‌నాథ్ రెడ్డి మ‌రింత దూకుడుగా స్పందించారు. తాము అధికారంలోకి వ‌స్తూనే.. టీడీపీ నాయకులు, కార్య‌క‌ర్త‌ల ప‌నిప‌డ‌తాం అని సెల‌విచ్చారు. అంతేకాదు.. మ‌రో అడుగు ముందుకు వేసి.. టీడీపీ సానుభూతిప‌రుల‌కు ప‌థ‌కాల‌ను క‌ట్ చేసేస్తామ‌ని చెప్పారు. కేవ‌లం వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌కు మాత్ర‌మే సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తామ‌ని.. ఈ విష‌యాన్ని గుర్తు పెట్టుకోవాల‌ని కూడా ఆయ‌న నొక్కి చెప్పారు. నియోజ‌క‌వ‌ర్గ స్థాయి స‌మావేశంలో ర‌వీంద్ర‌నాథ్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు వైర‌ల్‌గా మారాయి.

అయితే.. ఈ వ్యాఖ్య‌ల‌పై స్పందిస్తున్న నెటిజ‌న్లు.. అస‌లు మీరు అధికారంలోకి వ‌చ్చేదెప్పుడు? అని ప్ర‌శ్నిస్తున్నారు. ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ల స‌మ‌యం ఉంద‌ని.. ఇప్పుడే ప‌గ‌టి క‌ల‌లు కంటున్నారా? అని ప్ర‌శ్నించారు. ఇప్పటి నుంచే ఊహ‌ల్లో విహ రిస్తున్నారా? అని మ‌రికొంద‌రు ప్ర‌శ్నించారు. క‌ల‌లు క‌న‌డం మంచిదే కానీ.. మ‌రీ ఇంతగా కాద‌ని.. మ‌రికొంద‌రు వ్యాఖ్యానించారు. ఇంకొంద‌రు దురుసుగా ‘వార్నీ యేషాలో.. వైసీపీలో చాలా షేడ్సే ఉన్నాయే!’ అని కామెంట్లు కుమ్మ‌రిస్తున్నారు. ఇప్ప‌టికీ ప్ర‌జ‌ల‌ను మ‌చ్చిక చేసుకోవ‌డం.. వారి నుంచి సానుభూతిని దూసుకోవ‌డం వంటివి వైసీపీకి తెలియ‌డం లేద‌ని వ్యాఖ్యానిస్తున్నారు. ఇదీ.. సంగ‌తి!!.

Satya

Recent Posts

బాల‌కృష్ణ కూతురు మ‌ళ్లీ చిత‌గ్గొట్టేసింది

సెల‌బ్రెటీల కుటుంబాల్లో కొంద‌రిలో ఎంతో ప్ర‌తిభ ఉన్న‌ప్ప‌టికీ.. అది ఎప్పుడో కానీ బ‌య‌టికి రాదు. ఎప్పుడూ మామూలుగా క‌నిపించే వ్య‌క్తులు..…

2 hours ago

సలార్ ఇవ్వనిది లెనిన్ అందించింది

రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…

3 hours ago

శేఖ‌ర్ మాస్ట‌ర్ వెర్స‌స్ జానీ మాస్ట‌ర్

టాలీవుడ్ అగ్ర‌శ్రేణి డ్యాన్స్ మాస్ట‌ర్లు ఇద్ద‌రి మ‌ధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్ట‌ర్, శేఖ‌ర్ మాస్ట‌ర్ మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటు…

5 hours ago

కత్తి కొనల మీద ‘ప్యారడైజ్’ పరుగులు

టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…

5 hours ago

పృథ్విరాజ్ టార్గెట్ మిస్ అయ్యిందా

మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…

5 hours ago

‘మంగాపురం’లో ఏదో విషయం ఉంది

ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…

6 hours ago