Political News

10 ఏళ్లు ఒక‌రు.. 15 ఏళ్లు మ‌రొక‌రు.. ఏంటీ ధీమా?!

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకే రోజు చిత్ర‌మైన రాజ‌కీయాలు తెర‌మీదికి వ‌చ్చాయి. రెండు ప్ర‌భుత్వాల‌కు చెందిన ముఖ్యనాయ‌కులు కీల‌క ప్ర‌క‌ట‌న‌లు చేశారు. తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి.. త‌మ ప్ర‌భుత్వం మ‌రో ప‌దేళ్ల‌పాటు ఉంటుంద‌ని.. చెప్పుకొచ్చారు. త‌మ‌ను దింపేయాల‌ని కొంద‌రు కుట్ర‌లు చేసినా అవిఫ‌లించ‌లేద‌న్నారు. అంతేకాదు..వ‌చ్చే ఎన్నిక‌ల్లో 100 సీట్ల‌కు త‌గ్గ‌కుండా అధికారంలోకి వ‌స్తామ‌ని చెప్పారు. ఎవ‌రు ఏమ‌నుకున్నా.. ఎవ‌రు ఏం చేసినా.. తాము ప‌దేళ్ల వ‌ర‌కు అధికారంలో ఉంటామ‌ని రేవంత్ రెడ్డి ధీమా వ్య‌క్తం చేశారు.

ఇక ఏపీ విష‌యానికి వ‌స్తే.. శుక్ర‌వారం.. ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌రోసారి పాల‌న గురించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీ ఎలా అధికారంలోకి వ‌స్తుందో చూస్తామ‌ని చెబుతూనే.. ఆయ‌న మ‌రో 15 ఏళ్ల వ‌ర‌కు కూట‌మి అధికారంలోనే ఉంటుంద‌ని చెప్పారు. వైసీపీకి ఛాన్స్ ఇచ్చేదే లేద‌ని చెప్పారు. అయితే.. ప‌వ‌న్ ఇప్పుడే కాదు.. గ‌తంలోనూ కూట‌మి 15 ఏళ్ల‌పాటు అధికారంలోనే ఉంటుంద‌ని చెప్పారు. కానీ.. ఇప్పుడు మ‌రింత బ‌లంగా నొక్కి మ‌రీ చెప్పుకొచ్చారు. కూట‌మిని పిడికిలితో పోల్చారు. దీంతో ఆయ‌న చెప్పిన వ్య‌వ‌హారం ఆస‌క్తిగా మారింది.

అయితే..ఇలా రెండు రాష్ట్రాల కీల‌క నాయ‌కులు ఇంత ధీమాగా త‌మ త‌మ పాల‌న‌పై వ్యాఖ్య‌లు చేయ‌డం వెనుక రీజనేంటి? ఇంత ధీమాకు కార‌ణాలేంటి? అనేది ఆస‌క్తిగా మారింది. తెలంగాణ విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుత ప్ర‌భుత్వానికి ప్ర‌త్య‌ర్థులు ఇద్ద‌రు ఉన్నారు. 1) బీఆర్ఎస్‌. 2) బీజేపీ. ఈ రెండు పార్టీల‌ను కూడా దీటుగా ఎదిరించిన‌ప్పుడు మాత్ర‌మే తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. ఇలా ఎదిరించేందుకు ఉన్న శ‌క్తియుక్తులు ఏంట‌నేది చూస్తే.. కుల గ‌ణ‌న‌తోపాటు ప్ర‌స్తుతం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాలు కావొచ్చ‌న్న‌ది ఒక అంచ‌నా. దీనికి తోడు ‘రేవంత్ రెడ్డి’ ఇమేజ్ కూడా పార్టీకి క‌లిసి వ‌స్తోంది. కొంద‌రు రేవంత్ ను వ్య‌తిరేకించినా.. మాస్‌లోను, క్లాస్‌లోనూ ఆయ‌న‌కు ఉన్న ఇమేజ్ క‌లిసి వ‌స్తుంద‌న్న అంచ‌నా అయితే.. ప్ర‌తి ఒక్క‌రిలోనూ బ‌లంగా ఉంది. ఇదే ఈ ప‌దేళ్ల ధీమాకు కార‌ణ‌మ‌ని అంటున్నారు.

ఇక‌, ఏపీ విష‌యానికి వ‌స్తే.. పిడికిలి వంటి కూట‌మి మ‌రోసారి విజ‌యం ద‌క్కించుకుంటుంద‌న్న ధీమా క‌నిపిస్తోంది. ఒక‌రిద్ద‌రు నాయ‌కులు యాగీ చేసినా.. వారిని బ‌య‌ట‌కు పంపించేసి..కూట‌మిగానే వ‌చ్చే ఎన్నిక‌ల‌కువెళ్లాల‌న్న‌ది వ్యూహం. మ‌రోవైపు.. వైసీపీ చేస్తున్న విమ‌ర్శ‌లు, వ్యాఖ్య‌లు ఆ పార్టీకి మైన‌స్ అవుతున్నాయి. అంతేకాదు.. ఆపార్టీ చేశామ‌ని చెబుతున్న సంక్షేమాన్ని కూట‌మి ఎలానూ చేస్తోంది. ఇక‌, అర్హులు, అన‌ర్హులు అనేది అప్పుడు వైసీపీ హ‌యాంలోనూ ఉన్నారు. ఇప్పుడు కూడా ఉన్నారు. కాబ‌ట్టి చిన్న చిన్న వ్య‌వ‌హారాల‌ను పెద్ద‌గా చూడాల్సిన అవ‌స‌రం లేద‌ని కూట‌మి భావిస్తోంది. మ‌రోవైపు.. బ‌ల‌మైన మేధావి వ‌ర్గం, పెట్టుబ‌డిదారులు, అభివృద్ధి వంటివాటికి తోడు..చంద్ర‌బాబు, ప‌వ‌న్‌ల ఇమేజ్ కార‌ణంగానే మ‌రో 15 ఏళ్ల‌పాటు మాదే అధికారం అని చెప్ప‌డం వెనుక కీల‌క ధీమా ఉండి ఉంటుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

This post was last modified on July 5, 2025 11:31 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవర్ స్టార్ మేజిక్ పని చేస్తోంది

ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…

6 minutes ago

దేవిశ్రీ ప్రసాద్ దూరానికి కారణమిదేనా ?

పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…

41 minutes ago

పెంపుడు పిల్లి చ‌నిపోయింద‌ని.. ఉరేసుకున్న విద్యార్థిని!

పెంపుడు జంతువుల ప‌ట్ల య‌జ‌మానులు, కుటుంబ స‌భ్యులు ఎంత ప్రేమ‌ను పెంచుకుంటారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆయా జంతువులు…

1 hour ago

ఉస్తాద్ పాట‌ల వాడ‌కం.. ఎంత ఖ‌ర్చు పెట్టారో?

ఒక‌ప్పుడు పాత సినిమాల పాట‌లను య‌థేచ్ఛ‌గా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవ‌రికీ ఏ అభ్యంత‌రాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…

2 hours ago

వైసీపీ పంచాంగం.. కేంద్రం ప్లస్.. రాష్ట్రం మైనస్

ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం…

5 hours ago

స‌మంత బంగారం కోసం రాజు గారు వ‌స్తారా?

ఒక‌ప్పుడు తెలుగు, త‌మిళంలో టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా ద‌శాబ్దానికి పైగా ఒక వెలుగు వెలిగిన క‌థానాయిక స‌మంత‌. కానీ కొన్నేళ్లుగా…

6 hours ago