తెలంగాణ బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి బండి సంజయ్.. పుట్టిన రోజు ఈ నెల 11న. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన భారీ గిఫ్టులనే సిద్ధం చేశారు. వాస్తవానికి రాజకీయ నాయకుల పుట్టిన రోజు నాడు వారికి గిఫ్టులు ఇచ్చేందుకు చాలా మంది ప్రయత్నిస్తారు. కానీ, బండి సంజయ్ కొంచెం డిఫరెంట్ గా ఆలోచించారు. తన పుట్టిన రోజును పురస్కరించుకుని ఆయనే గిఫ్టులు పంచాలని నిర్ణయించారు. కరీంనగర్ నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న బండి సంజయ్.. నియోజకవర్గం పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ.. ఈ గిఫ్టులను పంచనున్నారట.
దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. తనపుట్టిన రోజు నాడు ప్రధాని మోడీకి క్రెడిట్ ఇస్తూ.. బండి సంజయ్ పదో తరగతి విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇదేమీ.. పదో ఇరవయ్యో కాదు.. ఏకంగా 10 వేల మంది విద్యార్థులకు.. అది కూడా ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఒక్కొక్క సైకిల్కు 4000 రూపాయల చొప్పున ఖర్చు చేశారట. అంటే.. మొత్తంగా 4 కోట్ల రూపాయలను దీనికి వెచ్చించారు. ఈ సైకిళ్లను తన పుట్టిన రోజు కంటే రెండు రోజుల ముందుగానే పక్కాగా పంపిణీ చేసేందుకు రెడీ అయ్యారు.
కరీంనగర్ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఈ సైకిళ్లను పంపిణీ చేయనున్నారు. సైకిల్పై ప్రధాని నరేంద్ర మోడీ బొమ్మతోపాటు.. వెనుకాల ఒకరు కూర్చునే స్టాండును కూడా ఏర్పాటు చేశారు. ఇక, కరీంనగర్లో 3,096, సిరిసిల్లలో 3,841, జగిత్యాలలో 1,137, సిద్దిపేటలో 783, హనుకొండలో 491 మంది విద్యార్థులకు ఈ సైకిళ్లను పంపిణీ చేయనున్నట్టు బండి చెప్పుకొచ్చారు. మొత్తంగా బండి బర్త్డే గిఫ్టులపై జిల్లాల్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. మరి ఈ కార్యక్రమాన్ని ఎంత అట్టహాసంగా చేస్తారో చూడాలి.
This post was last modified on July 5, 2025 11:23 am
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…