తెలంగాణ బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి బండి సంజయ్.. పుట్టిన రోజు ఈ నెల 11న. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన భారీ గిఫ్టులనే సిద్ధం చేశారు. వాస్తవానికి రాజకీయ నాయకుల పుట్టిన రోజు నాడు వారికి గిఫ్టులు ఇచ్చేందుకు చాలా మంది ప్రయత్నిస్తారు. కానీ, బండి సంజయ్ కొంచెం డిఫరెంట్ గా ఆలోచించారు. తన పుట్టిన రోజును పురస్కరించుకుని ఆయనే గిఫ్టులు పంచాలని నిర్ణయించారు. కరీంనగర్ నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న బండి సంజయ్.. నియోజకవర్గం పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ.. ఈ గిఫ్టులను పంచనున్నారట.
దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. తనపుట్టిన రోజు నాడు ప్రధాని మోడీకి క్రెడిట్ ఇస్తూ.. బండి సంజయ్ పదో తరగతి విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇదేమీ.. పదో ఇరవయ్యో కాదు.. ఏకంగా 10 వేల మంది విద్యార్థులకు.. అది కూడా ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఒక్కొక్క సైకిల్కు 4000 రూపాయల చొప్పున ఖర్చు చేశారట. అంటే.. మొత్తంగా 4 కోట్ల రూపాయలను దీనికి వెచ్చించారు. ఈ సైకిళ్లను తన పుట్టిన రోజు కంటే రెండు రోజుల ముందుగానే పక్కాగా పంపిణీ చేసేందుకు రెడీ అయ్యారు.
కరీంనగర్ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఈ సైకిళ్లను పంపిణీ చేయనున్నారు. సైకిల్పై ప్రధాని నరేంద్ర మోడీ బొమ్మతోపాటు.. వెనుకాల ఒకరు కూర్చునే స్టాండును కూడా ఏర్పాటు చేశారు. ఇక, కరీంనగర్లో 3,096, సిరిసిల్లలో 3,841, జగిత్యాలలో 1,137, సిద్దిపేటలో 783, హనుకొండలో 491 మంది విద్యార్థులకు ఈ సైకిళ్లను పంపిణీ చేయనున్నట్టు బండి చెప్పుకొచ్చారు. మొత్తంగా బండి బర్త్డే గిఫ్టులపై జిల్లాల్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. మరి ఈ కార్యక్రమాన్ని ఎంత అట్టహాసంగా చేస్తారో చూడాలి.
This post was last modified on July 5, 2025 11:23 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…