Political News

అందుకే మేం క‌నిగిరి నుంచి వెళ్లిపోయాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

గ‌తంలో త‌మ కుటుంబం ప్ర‌కాశం జిల్లా క‌నిగిరి నియోజ‌క‌వ‌ర్గంలో ఉండేద‌ని.. అయితే.. ఇక్క‌డ తాగు నీరు క‌లుషిత‌మ‌ని అందుకే.. తమ కుటుంబం ఆరు మాసాల కాలంలో అక్క‌డ నుంచి వేరే చోట‌కు త‌ర‌లి పోయింద‌ని ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ వ్యాఖ్యానించారు. క‌నిగిరిలో ఫ్లోరైడ్ జ‌లాలు వ‌స్తున్నాయ‌ని .. దీంతో ఇక్క‌డి వారు అనారోగ్యం బారిన‌ప‌డుతున్నార‌ని చెప్పారు. ఈ స‌మ‌స్య త‌న‌కు కూడా తెలుసున‌ని వ్యాఖ్యానించారు. చిన్న‌ప్పుడు తాము క‌నిగిరిలోనే ఉండేవార‌మ‌ని చెప్పారు.

ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలో ప‌ర్య‌టించిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. కేంద్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న జల్ జీవన్ మిషన్ ద్వారా ఈ జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో ఉన్న‌ 31 మండలాల్లోని 1,387 గ్రామాలకు నీటి సరఫరా చేసే పథకానికి శుక్రవారం శంకుస్థాపన చేసారు. 1,290 కోట్ల రూపాయల వ్యయంతో చేప‌ట్టే ఈ పథకానికి సంబంధించిన పైలాన్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడారు.

“ప్రకాశం జిల్లా వాసుల తాగునీటి కష్టాలు నాకు తెలుసు. నేను కూడా ఒంగోలు, కనిగిరి ప్రాంతాలలో ఉన్నా. మా చిన్న‌ప్పుడు.. ఇక్క‌డే ఉండేవాళ్లం. కనిగిరిలో ఫ్లోరైడ్ సమస్య వల్లే ఆరు నెలల్లోనే అక్కడి నుంచి మా కుటుంబం వెళ్లిపోయింది.” అని ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పారు. ఈ సంద‌ర్భంగా గత వైసీపీ స‌ర్కారుపై ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వం జలజీవన్ మిషన్ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిందన్నారు. క‌నీసం ప్ర‌జ‌ల‌కు స్వ‌చ్ఛ‌మైన నీటిని కూడా ఇవ్వ‌లేద‌న్నారు.

నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే వెలుగొండ ప్రాజెక్టు పూర్తయ్యలేదని చెప్పిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. దానిని కూడా వైసీపీ నాయ‌కులు పూర్తి చేయలేదని తెలిపారు. ప్రస్తుతం చేపట్టిన ప్రాజెక్టు వల్ల పశ్చిమ ప్రాంతంలోని ప్రజలకు సురక్షిత తాగునీరు అందుతుందన్నారు. క్షేత్ర‌స్థాయిలో స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌న్నారు.

This post was last modified on July 4, 2025 5:58 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తిరుమల జీవోలపై చంద్రబాబు క్లారిటీ

తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…

3 minutes ago

శ్రీ విష్ణుకు సన్నాఫ్ సత్యమూర్తి ఇచ్చిన షాక్

చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్‌లో మంచి క్రేజ్‌తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…

1 hour ago

రాజమౌళి, మహేష్ కొట్టుకోవడమేంటయ్యా

దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి సినిమా చేయాలని వాళ్లిద్దరి అభిమానులు ఎన్నో ఏళ్ల ముందు…

2 hours ago

మున్నా మంచి స్ట్రాటజీ వాడుతున్నాడు

మాములుగా రీ రిలీజులు ఏవి ఆడతాయో ఏవి ఆడవో అంత ఈజీగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. గత ఏడాది ఖలేజాని…

2 hours ago

ఇలాంటిది వేరే మతంలో జరిగి ఉంటే?: పవన్

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంశం జాతీయ స్థాయిలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ టాపిక్ పై…

5 hours ago

చరణ్‌పై మచ్చ పడనివ్వని అల్లు శిరీష్

మెగా, అల్లు బంధం మీద ఎప్పటికప్పుడు రకరకాల ఊహాగానాలు, అనుమానాలు వస్తూనే ఉంటాయి. ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు ఒకప్పట్లా…

6 hours ago