Political News

వైసీపీ నేతలకు పవన్ మాస్ వార్నింగ్

తప్పు చేసిన వైసీపీ నేతలు ఈ రోజు చట్టపరమైన చర్యలు ఎదుర్కొంటూ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్నారు. అయితే, ఆ విషయం వదిలేసి తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి పార్టీల నేతలపై రివేంజ్ తీర్చుకుంటామని వార్నింగులు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ నేతలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదని హెచ్చరించారు.

2029లో మళ్ళీ వస్తే అంతు చూస్తామని వైసీపీ నేతలు వార్నింగ్ ఇస్తున్నారని, అలా అంతుచూడాలంటే వైసీపీ అధికారంలోకి రావాలి కదా అని ప్రశ్నించారు. అసలు, వైసీపీ అధికారంలోకి ఎలా వస్తుందో తామూ చూస్తామని పవన్ చెప్పారు. గతంలో వైసీపీ ప్రజలతో పాటు ప్రతిపక్ష నేతలను భయభ్రాంతులకు గురిచేసిందని, అవన్నీ తట్టుకునే ఈ స్థాయికి వచ్చామని పవన్ చెప్పారు.

వైసీపీ మీద తనకు వ్యక్తిగతంగా కక్ష లేదని అన్నారు. వైసీపీ సుపరిపాలన అందిస్తే 11సీట్లు వచ్చేవి కాదు కదా అని చురకలంటించారు. తప్పు చేస్తే శిక్షించే ప్రభుత్వం తమదని గుర్తు చేశారు. ప్రభుత్వం తప్పు చేస్తే చెప్పాలని, తాము వింటామని అన్నారు. గత ప్రభుత్వం జల్‌ జీవన్‌ మిషన్‌ను పట్టించుకోలేదని ఆరోపించారు. రౌడీయిజం, గూండాయిజంతో భయపెట్టి వేధించారని, ప్రజలకు మంచినీరు అందించాలన్న ధ్యాస కూడ గత పాలకులకు లేదని చెప్పారు..

వైసీపీ హయాంలో 4వేల కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగమయ్యాయని, కూటమి ప్రభుత్వం కృషి, కేంద్ర సహకారంతో ప్రకాశం జిల్లాలోని నరసింహాపురంలో అతి పెద్ద తాగునీటి పథకం ఏర్పాటైందని అన్నారు. వైసీపీ నేతలు ఎన్నికలకు ముందు శిలాఫలకాలు వేసేందుకే పరిమితమయ్యారని విమర్శించారు. కానీ, తమ ప్రభుత్వం అలా కాదని, 18 నుంచి 20 నెలలోపు ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని అన్నారు. స్వాతంత్య్రం వచ్చాక తొలిసారిగా ప్రకాశం జిల్లాలో అతిపెద్ద తాగునీటి పథకమిదేనని, 10 లక్షలకు పైచిలుకు జనాభాకు తాగునీటిని అందించబోతున్నామని అన్నారు.

This post was last modified on July 4, 2025 5:56 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కొరటాల మాస్… బాలయ్య కార్పెంటర్

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కలయికలో తెరకెక్కబోతున్న సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. విశ్వసనీయ సమాచారం మేరకు…

1 hour ago

సువేందు అధికారి ఆనే నేను..

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం కొలువు తీరింది. ఉదయం 11 గంటలకు బ్రిగేడ్‌ పరేడ్ గ్రౌండ్స్‌లో బెంగాల్‌ సీఎంగా సువేందు…

1 hour ago

వీరభద్రుడికి ముందు నుయ్యి వెనుక గొయ్యి

ఇప్పటికే పలు వాయిదాల్లో నలిగిపోయిన సూర్య వీరభద్రుడు మే 14 విడుదల కానుంది. మొన్నటిదాకా వాయిదా పడుతుందనే ప్రచారం చెన్నై…

1 hour ago

పవన్ అభిమానులు… కొత్త ట్రాప్ లో పడొద్దు…

జనసేనాని పవన్ కళ్యాణ్ మీద గత రెండు మూడు రోజులుగా వైసీపీ మద్దతుదారులు. అనుకూల మీడియా పెడుతున్న సోషల్ మీడియా…

2 hours ago

సుమంత్ పేరు వెనుక‌ ప్ర‌భాస్ ఎందుకు?

మేం ఫేమ‌స్ చిత్రంతో టాలీవుడ్లోకి దూసుకొచ్చాడు యువ న‌టుడు సుమంత్ ప్ర‌భాస్. షార్ట్ ఫిలిమ్స్ నేప‌థ్యం నుంచి వ‌చ్చిన ఈ…

3 hours ago

దిల్ రాజుకు దెబ్బ మీద దెబ్బ‌

ఇప్పుడు టాలీవుడ్లో ఏ నిర్మాత‌, డిస్ట్రిబ్యూట‌ర్ ప‌రిస్థితీ అంత బాగా లేదు. స‌క్సెస్ రేట్ అంత‌కంత‌కూ ప‌డిపోతోంది. జ‌నాలు థియేట‌ర్ల‌కు…

4 hours ago