Political News

గిరిజ‌నుల మ‌న‌సు దోచిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఈసారి ఇలా!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. గిరిజ‌నుల సంక్షేమం.. వారి సౌక‌ర్యాలు వంటి వాటిపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ చూపిస్తున్న విష‌యం తెలిసిందే. ముఖ్యంగా గిరిజ‌న ప్రాంతాల్లో ర‌హ‌దారులు వేయిస్తున్నారు. వారికి అవ‌స‌ర‌మైన మౌలిక స‌దుపాయాల‌ను కూడా క‌ల్పిస్తున్నారు. అంతేకాదు.. వారి మ‌న‌సెరిగి మెసులు కుంటున్నారు. కొన్నాళ్ల కింద‌ట‌.. అల్లూరు సీతారామరాజు జిల్లాలోని గిరిజ‌నుల కుటుంబాల‌కు పాద‌ర‌క్ష‌లు పంపించిన విష‌యం గుర్తుండే ఉంటుంది.

అప్ప‌ట్లో అడ‌వి బిడ్డ‌లు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆప్యాయ‌త‌కు పొంగిపోయారు. మూడు మాసాల కింద‌ట‌.. ప‌వ‌న్ క‌ల్యాణ్ అల్లూరి జిల్లాలో సుదూరంగా ఉండే కురిడి గ్రామాన్ని సంద‌ర్శించారు. ఆ స‌మ‌యంలో ఆయ‌న అక్క‌డ కాలికి చెప్పులు లేకుండా రాళ్లు ర‌ప్ప‌ల‌పై తిరుగుతున్న గిరిజ‌నుల‌ను చూసి ద్ర‌వించిపోయారు. ఈ క్ర‌మంలోనే తాను తిరిగి మంగ‌ళ‌గిరికి వ‌చ్చాక‌.. ప్ర‌త్యేక వాహ‌నంలో 500 మందికి పైగా చెప్పుల జ‌త‌లు పంపించారు. దీంతో గిరిజ‌నుల క‌ళ్ల‌లో ఆనంద‌రం.. సుడులు తిరిగింది.

తాజాగా మ‌రోసారి ఆ ప్రాంత గిరిజ‌నుల ప‌ట్ల ప‌వ‌న్ క‌ల్యాణ్ స్పందించారు. వారికి త‌న తోట‌లో పండించిన మామిడి పండ్ల‌ను పంపించారు. అయితే.. ఈ విష‌యాన్ని ముందుగానే ఎవ‌రికీ చెప్ప‌కుండా.. చాలా గోప్యంగా ఉంచారు. మొత్తం 300ల‌కు పైగా కుటుంబాలు కురిడి గ్రామంలో ఉన్నాయి. అక్క‌డి ప్ర‌తి ఇంటికీ.. అర‌డ‌జ‌ను చొప్పున నాణ్య‌మైన తీపి మామిడి పండ్ల‌ను పంపించారు.

ప్ర‌త్యేక వాహ‌నంలో మంగ‌ళ‌గిరి నుంచి చేరిన మామిడి.. ఇంటింటికీ అందాయి. దీంతో గిరిజ‌న బిడ్డ‌లు ఎంతో ఆప్యాయంగా వాటిని ఆర‌గించారు. కాగా.. ఈ మామిడి పండ్ల‌ను ఆర్గానిక్‌(సంప్ర‌దాయ ఎరువుల విధానం) విధానంలో పండించ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌తికుటుంబానికీ ఆరేసి చొప్పున వీటిని అందించారు. దీంతో గిరిజ‌నులు మా మంచి ప‌వ‌న్ అంటూ.. మురిసిపోయారు.

Satya

Recent Posts

దేవర 2 ఆశలు వదులుకోక తప్పదా

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎదురు చూస్తున్న అప్డేట్ దేవర 2. మొదటి భాగం వచ్చి రెండేళ్లు దాటిపోతున్నా ఇప్పటికీ సీక్వెల్…

33 minutes ago

వీరభద్రుడిని వాయించేస్తున్నారు

కొన్ని సినిమాలకు బాక్సాఫీస్ దగ్గర పరిస్థితులు కలిసొచ్చి యావరేజ్ కంటెంట్‌తోనే ఇరగాడేస్తుంటాయి. రివ్యూలు, టాక్ అంతంతమాత్రంగా ఉన్నా సరే.. సినిమాకు…

1 hour ago

సర్వం సమంత మయం… బంగారం ప్రచారం

జూన్ 19 విడుదల కాబోతున్న మా ఇంటి బంగారం కౌంట్ డౌన్ మొదలైపోయింది. కేవలం నాలుగు రోజుల సమయం మాత్రమే…

1 hour ago

హిమాలయాలకు వెళ్లిపోవాలనుకున్న హీరోయిన్

కథానాయికగా పరిచయం అయింది తమిళంలోనే అయినా.. తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసి గుర్తింపు సంపాదించింది నివేథా పెతురాజ్. మెంటల్ మదిలో,…

1 hour ago

ట్రంప్ మాత్రమే కాదు ఇరాన్ కూడా చెప్పింది యుద్ధం ముగిసిందని!

ఒకప్పుడు అమెరికా అధ్యక్షుడు హోదాలో ఉన్న వ్యక్తి నోటి నుంచి ఒక మాట వస్తే.. అదో నిజమన్నట్లుగా ఉండేది. అలాంటి…

1 hour ago

కాక్రోచ్ పార్టీపై పవన్ ఫస్ట్ రియాక్షన్

ఢిల్లీలో 'జాతీయ సమగ్రత కోసం సేన ప్రస్థానం' పేరుతో 3 రోజుల పాటు సభలను నిర్వహించాలని జనసేన నిర్ణయించిన సంగతి…

2 hours ago