ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. గిరిజనుల సంక్షేమం.. వారి సౌకర్యాలు వంటి వాటిపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో రహదారులు వేయిస్తున్నారు. వారికి అవసరమైన మౌలిక సదుపాయాలను కూడా కల్పిస్తున్నారు. అంతేకాదు.. వారి మనసెరిగి మెసులు కుంటున్నారు. కొన్నాళ్ల కిందట.. అల్లూరు సీతారామరాజు జిల్లాలోని గిరిజనుల కుటుంబాలకు పాదరక్షలు పంపించిన విషయం గుర్తుండే ఉంటుంది.
అప్పట్లో అడవి బిడ్డలు పవన్ కల్యాణ్ ఆప్యాయతకు పొంగిపోయారు. మూడు మాసాల కిందట.. పవన్ కల్యాణ్ అల్లూరి జిల్లాలో సుదూరంగా ఉండే కురిడి గ్రామాన్ని సందర్శించారు. ఆ సమయంలో ఆయన అక్కడ కాలికి చెప్పులు లేకుండా రాళ్లు రప్పలపై తిరుగుతున్న గిరిజనులను చూసి ద్రవించిపోయారు. ఈ క్రమంలోనే తాను తిరిగి మంగళగిరికి వచ్చాక.. ప్రత్యేక వాహనంలో 500 మందికి పైగా చెప్పుల జతలు పంపించారు. దీంతో గిరిజనుల కళ్లలో ఆనందరం.. సుడులు తిరిగింది.
తాజాగా మరోసారి ఆ ప్రాంత గిరిజనుల పట్ల పవన్ కల్యాణ్ స్పందించారు. వారికి తన తోటలో పండించిన మామిడి పండ్లను పంపించారు. అయితే.. ఈ విషయాన్ని ముందుగానే ఎవరికీ చెప్పకుండా.. చాలా గోప్యంగా ఉంచారు. మొత్తం 300లకు పైగా కుటుంబాలు కురిడి గ్రామంలో ఉన్నాయి. అక్కడి ప్రతి ఇంటికీ.. అరడజను చొప్పున నాణ్యమైన తీపి మామిడి పండ్లను పంపించారు.
ప్రత్యేక వాహనంలో మంగళగిరి నుంచి చేరిన మామిడి.. ఇంటింటికీ అందాయి. దీంతో గిరిజన బిడ్డలు ఎంతో ఆప్యాయంగా వాటిని ఆరగించారు. కాగా.. ఈ మామిడి పండ్లను ఆర్గానిక్(సంప్రదాయ ఎరువుల విధానం) విధానంలో పండించడం గమనార్హం. ప్రతికుటుంబానికీ ఆరేసి చొప్పున వీటిని అందించారు. దీంతో గిరిజనులు మా మంచి పవన్ అంటూ.. మురిసిపోయారు.
This post was last modified on July 4, 2025 12:42 pm
‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…
ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…