రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎలా విజయం దక్కించుకుంది? ఎంత ఒబ్బిడిగా ముందుకు సాగింది? ఎలాంటి పంథా అనుసరించింది? అనేవి ఆసక్తికర విషయాలు. ఎందుకంటే భిన్నమైన సిద్ధాంతాలు, భిన్నమైన వ్యక్తిత్వాలు ఉన్న నాయకులు కలిసి కూటమిగా ఏర్పడి విజయం దక్కించుకున్నారు. ఇది ఒక ప్రయోగమని చెప్పాలి. అంతేకాదు భవిష్యత్తులో కూటమిగా ఏర్పడే పార్టీలకు ఇది ఒక కేసు స్టడీగా ఉపయోగపడుతుంది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ బీహార్ కు చెందిన కొంతమంది నాయకులు ఏపీలో పర్యటిస్తున్నారు. వారు ఇక్కడ కూటమి ఏ విధంగా విజయం దక్కించుకుంది ఎలాంటి ఫార్ములా అనుసరించింది ఏ విధంగా ముందుకు సాగింది అనే అంశాలపై అధ్యయనం చేస్తున్నారు.
ప్రస్తుతం అత్యంత గుట్టుగా సాగుతున్న ఈ అధ్యయనం అనంతపురం, కడప జిల్లాల్లో జరుగుతోందని తెలుస్తోంది. త్వరలోనే బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ బిజెపి.. అదే విధంగా జనతాదళ్ యునైటెడ్(జేడీయూ) పార్టీలు కూటమిగా ఉన్నాయి. వీటితోపాటు చిన్నాచితగా పార్టీలు కూడా కూటమిలో కలిశారు. ఇప్పుడు ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలనేది పెద్ద ఎత్తున చేస్తున్న ప్రయత్నం. ఈ పార్టీ కూడా ఆర్జెడి సహా మరో రెండు మూడు చిన్న పార్టీలతో కలిసి పోటీ చేయడానికి సిద్ధమవుతోంది.
ఈ క్రమంలో అటు నితీష్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎన్డీఏ కూటమి, ఇటు కాంగ్రెస్ నేతృత్వంలో లాలూ ప్రసాద్ యాదవ్ వంటి కీలక నేతలు ఉన్న ఆర్జెడి కూటమి మరో రకంగా యూపీఏ కూటమి ఈ రెండు ఏ విధంగా విజయం దక్కించుకోవాలనే అంశంపై తర్జనభర్జన పడుతున్నాయి. రెండు కూటములే. ఏపీలో మాదిరిగా బీహార్లో ఏకపక్షంగా ఎవరూ పోటీ చేయట్లేదు. ఏపీలో అయితే జగన్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేయడం తెలిసిందే. ఒకవైపు కూటమి మూడు పార్టీలు కలిసి వెళ్తే….బీహార్లో రెండే కోటములు ఒకటి కాంగ్రెస్ నేతృత్వంలో రెండోది బిజెపి నేతృత్వంలో ఉంది.
రెండు కూటముల మధ్య జరుగుతున్న ఈ ఎన్నికల్లో విజయం దక్కించుకోవడానికి ఏ విధమైన ఫార్ములాని అనుసరించాలి? అనే విషయం ఆసక్తిగా ఉంది. ఇప్పుడు అదే ఫార్ములాని అధ్యయనం చేయడం కోసం ఆ రాష్ట్రానికి చెందిన ఒకరిద్దరు నాయకులు ఏపీలో పర్యటిస్తున్నారు. ఇది జాతీయ మీడియా చెప్పిన మాట. ఏపీలో ఎలా విజయం దక్కించుకున్నారు? కూటమి ఇచ్చిన హామీలు ఏంటి? ప్రజలు కూటమి వైపు ఎందుకు మగ్గుచూపారు? ఇట్లాంటివన్నీ అధ్యయనం చేసి వాటిని ఒక కేసు స్టడీ లాగా మలుచుకుని బీహార్లో అప్లై చేయాలి అనేది ఈ నాయకుల ఉద్దేశం.
అయితే వీరు ఏ పార్టీకి చెందినవారు? అనేది అత్యంత గోప్యంగా ఉంచారు. అటు బిజెపికి చెందినవారు, ఇటు కాంగ్రెస్కు చెందినవారా అనేది రహస్యంగా ఉంచారు. వాస్తవానికి బిజెపి అయినా కాంగ్రెస్ అయినా సీనియర్ మోస్ట్ పార్టీలు. పైగా అధికారంలోకి వచ్చిన పార్టీలు, అధికారంలో ఉన్న పార్టీలు. కానీ ఇప్పుడు ఈ అధ్యయనం చేయడానికి కారణం ఏంటి? కూటమి పార్టీలు కొత్త కానీ, ఈ రెండు జాతీయ జాతీయ పార్టీలు ఎందుకు అధ్యయనం చేయాలని అనుకుంటున్నాయి? అధ్యయనం చేస్తున్నాయి? అంటే ఎప్పటికప్పుడు మారుతున్న ప్రజల నాడిని పట్టుకోవడంలో.. ప్రజల నాడిని తెలుసుకోవడంలో నాయకులు వెనకబడుతున్నారు.
పార్టీలు వెనకబడుతున్నాయి. కూటమిగా కూడా ఓడిపోయిన పరిస్థితి వాళ్ళ రాష్ట్రాల్లో కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏపీలో ఎటువంటి అంశాలను ముందుకు తీసుకెళ్లారు.. ఏపీలో కూటమి విజయానికి కారణాలు ఏంటి.. ప్రజల స్పందన ఎట్లా ఉందనేది మరోసారి కేసు స్టడీ మాదిరిగా తెలుసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిని బట్టి బీహార్ లో ఏ పంథా అనుసరించాలి అనేది నిర్ణయించుకునే అవకాశం ఉంది.
This post was last modified on June 30, 2025 9:11 am
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…