Political News

కూటమి ఎఫెక్ట్: ఏపీలో పర్యటిస్తున్న బీహార్ నేతలు

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎలా విజయం దక్కించుకుంది? ఎంత ఒబ్బిడిగా ముందుకు సాగింది? ఎలాంటి పంథా అనుసరించింది? అనేవి ఆసక్తికర విషయాలు. ఎందుకంటే భిన్నమైన సిద్ధాంతాలు, భిన్నమైన వ్యక్తిత్వాలు ఉన్న నాయకులు కలిసి కూటమిగా ఏర్పడి విజయం దక్కించుకున్నారు. ఇది ఒక ప్రయోగమని చెప్పాలి. అంతేకాదు భవిష్యత్తులో కూటమిగా ఏర్పడే పార్టీలకు ఇది ఒక కేసు స్టడీగా ఉపయోగపడుతుంది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ బీహార్ కు చెందిన కొంతమంది నాయకులు ఏపీలో పర్యటిస్తున్నారు. వారు ఇక్కడ కూటమి ఏ విధంగా విజయం దక్కించుకుంది ఎలాంటి ఫార్ములా అనుసరించింది ఏ విధంగా ముందుకు సాగింది అనే అంశాలపై అధ్యయనం చేస్తున్నారు.

ప్రస్తుతం అత్యంత గుట్టుగా సాగుతున్న ఈ అధ్యయనం అనంతపురం, కడప జిల్లాల్లో జరుగుతోందని తెలుస్తోంది. త్వరలోనే బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ బిజెపి.. అదే విధంగా జనతాద‌ళ్‌ యునైటెడ్(జేడీయూ) పార్టీలు కూటమిగా ఉన్నాయి. వీటితోపాటు చిన్నాచితగా పార్టీలు కూడా కూట‌మిలో కలిశారు. ఇప్పుడు ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలనేది పెద్ద ఎత్తున చేస్తున్న ప్రయత్నం. ఈ పార్టీ కూడా ఆర్జెడి సహా మరో రెండు మూడు చిన్న పార్టీలతో కలిసి పోటీ చేయడానికి సిద్ధమవుతోంది.

ఈ క్రమంలో అటు నితీష్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎన్డీఏ కూటమి, ఇటు కాంగ్రెస్ నేతృత్వంలో లాలూ ప్రసాద్ యాదవ్ వంటి కీలక నేతలు ఉన్న ఆర్జెడి కూటమి మ‌రో ర‌కంగా యూపీఏ కూటమి ఈ రెండు ఏ విధంగా విజయం దక్కించుకోవాలనే అంశంపై తర్జనభర్జన పడుతున్నాయి. రెండు కూటములే. ఏపీలో మాదిరిగా బీహార్లో ఏకపక్షంగా ఎవరూ పోటీ చేయట్లేదు. ఏపీలో అయితే జగన్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేయడం తెలిసిందే. ఒకవైపు కూటమి మూడు పార్టీలు కలిసి వెళ్తే….బీహార్లో రెండే కోటములు ఒకటి కాంగ్రెస్ నేతృత్వంలో రెండోది బిజెపి నేతృత్వంలో ఉంది.

రెండు కూటముల మధ్య జరుగుతున్న ఈ ఎన్నికల్లో విజయం దక్కించుకోవడానికి ఏ విధమైన ఫార్ములాని అనుసరించాలి? అనే విషయం ఆసక్తిగా ఉంది. ఇప్పుడు అదే ఫార్ములాని అధ్యయనం చేయడం కోసం ఆ రాష్ట్రానికి చెందిన ఒకరిద్దరు నాయకులు ఏపీలో పర్యటిస్తున్నారు. ఇది జాతీయ మీడియా చెప్పిన మాట. ఏపీలో ఎలా విజయం దక్కించుకున్నారు? కూటమి ఇచ్చిన హామీలు ఏంటి? ప్రజలు కూటమి వైపు ఎందుకు మగ్గుచూపారు? ఇట్లాంటివన్నీ అధ్యయనం చేసి వాటిని ఒక కేసు స్టడీ లాగా మలుచుకుని బీహార్లో అప్లై చేయాలి అనేది ఈ నాయకుల ఉద్దేశం.

అయితే వీరు ఏ పార్టీకి చెందినవారు? అనేది అత్యంత గోప్యంగా ఉంచారు. అటు బిజెపికి చెందినవారు, ఇటు కాంగ్రెస్కు చెందినవారా అనేది రహస్యంగా ఉంచారు. వాస్తవానికి బిజెపి అయినా కాంగ్రెస్ అయినా సీనియర్ మోస్ట్ పార్టీలు. పైగా అధికారంలోకి వచ్చిన పార్టీలు, అధికారంలో ఉన్న పార్టీలు. కానీ ఇప్పుడు ఈ అధ్య‌య‌నం చేయడానికి కారణం ఏంటి? కూటమి పార్టీలు కొత్త కానీ, ఈ రెండు జాతీయ జాతీయ పార్టీలు ఎందుకు అధ్యయనం చేయాలని అనుకుంటున్నాయి? అధ్యయనం చేస్తున్నాయి? అంటే ఎప్పటికప్పుడు మారుతున్న ప్రజల నాడిని పట్టుకోవడంలో.. ప్రజల నాడిని తెలుసుకోవడంలో నాయకులు వెనకబడుతున్నారు.

పార్టీలు వెనకబడుతున్నాయి. కూటమిగా కూడా ఓడిపోయిన పరిస్థితి వాళ్ళ రాష్ట్రాల్లో కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏపీలో ఎటువంటి అంశాలను ముందుకు తీసుకెళ్లారు.. ఏపీలో కూటమి విజయానికి కారణాలు ఏంటి.. ప్రజల స్పందన ఎట్లా ఉందనేది మరోసారి కేసు స్టడీ మాదిరిగా తెలుసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిని బట్టి బీహార్ లో ఏ పంథా అనుసరించాలి అనేది నిర్ణయించుకునే అవకాశం ఉంది.

Kumar

Recent Posts

అసెంబ్లీ వ‌ద్దు.. ప్ర‌జ‌లూ వ‌ద్దు.. జ‌గ‌న్ ల‌క్ష్యం ఏంటి.. ?

ఏపీలో ప్ర‌తిప‌క్ష పార్టీ(ప్ర‌ధాన కాదు)గా ఉన్న వైసీపీ రెండేళ్ల కాలంలో ఏం చేసింది? ఏం సాధించింది? అనేది ఆస‌క్తిక‌రం. శుక్ర‌వారం(జూన్…

8 minutes ago

జంధ్యాల వాడకం… రావిపూడి మార్కు ప్రచారం

దర్శకులందు అనిల్ రావిపూడి వేరయాని ఊరికే అనలేదు. షూటింగ్ మొదలుపెట్టడానికి ముందే తనదైన ప్రమోషన్లతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్…

42 minutes ago

మళ్లీ డీలిమిటేషన్ రచ్చ షురూ

దేశంలో ఇటీవలే లోక్ సభ, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపునకు సంబందించి ఓ రేంజిలో రచ్చ జరిగిన సంగతి తెలిసిందే.…

2 hours ago

రెడ్ బుక్ తెరిచే ఉంది… వైసీపీకి లోకేష్ వార్నింగ్‌

రెడ్ బుక్ మూసేయ‌లేద‌ని.. అది ఇంకా తెరిచే ఉంద‌ని మంత్రి నారా లోకేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రెడ్ బుక్‌లో…

3 hours ago

హిందీ సినిమాలు మైనస్… పెద్దికి ప్లస్ కాలేదే

ఈ ఏడాది ‘దురంధర్-2’ సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ బాగానే కళకళలాడినప్పటికీ.. ఓవరాల్ సక్సెస్ రేట్ ఏమీ అంత గొప్పగా లేదు.…

4 hours ago

‘అన్న లేని లోటును నా పవనన్న తీర్చాడు’

తమరిది అన్నదమ్ముల అనుబంధం అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మంత్రి నారా లోకేష్ పలుమార్లు వ్యాఖ్యానించారు.…

4 hours ago