Political News

12 వేల ఓట్లు.. ఆ యువనేతను సీఎం కాకుండా చేశాయ్

ఎన్నికల్లో అంకెలు చేసే మేజిక్ అంతా ఇంతా కాదు. గెలుపు.. ఓటముల మధ్య రేఖ ఎంత పలుచగా ఉందో కొన్ని సందర్భాల్ని చూస్తే ఇట్టే అర్థమైపోతాయి. తాజాగా బిహార్ ఎన్నికల ఫలితాల్ని చూస్తే మరింత బాగా అర్థం కావటం ఖాయం. ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో కాస్తంత మెజార్టీ అంటేనే పదివేల ఓట్ల అధిక్యత ఉంటుంది. అలాంటి పన్నెండు వేల ఓట్లు.. ఒక యువనేతను ముఖ్యమంత్రి కాకుండా అడ్డుపడ్డాయంటే పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడు అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు ఆర్జేడీ యువనేత తేజస్వీ యాదవ్.

బిహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే.. అన్ని మీడియా సంస్థలు ప్రకటించిన ఎగ్జిట్ ఫలితాల్ని చూస్తే.. మహాకూటమి గెలుపు ఖాయమని తేల్చేశారు. పోలింగ్ పూర్తి అయిన తర్వాత నుంచి ఓట్ల లెక్కింపు వరకు ఇదే జోష్ నడిచింది. ఓట్ల లెక్కింపు మాత్రం ఇందుకు భిన్నంగా సాగటమే కాదు.. అధికారం చివరకు ఎన్డీయే వైపు వెళ్లటం తెలిసిందే. పోటాపోటీగా సీట్లు సాధించినప్పటికీ.. చివర్లో మొగ్గు ఎన్డీయే వైపు సాగింది.

ఆసక్తికరమైన విషయం ఏమంటే.. 2015లో ఎన్నికల్లో మహాకూటమి.. ఎన్డీయే కంటే 7.8 శాతం ఓట్లను సాధించగా.. ఈసారి ఎన్డీయే 0.3 శాతం ఓట్లను మాత్రమే ఎక్కువగా పొందాయి. ఎన్డీయేకు 1.57 కోట్ల ఓట్లు వస్తే.. మహా కూటమికి 1.56 కోట్ల ఓట్లు వచ్చాయి. రెండు కూటమిలకు మధ్య వ్యత్యాసం కేవలం 12,768 ఓట్లు మాత్రమే. కేవలం 0.3 శాతం ఓట్లు తగ్గటంతో తేజస్వీకి సీఎం అయ్యే అవకాశం మిస్ అయితే.. ఎన్డీయే ఆ అవకాశాన్ని సొంతం చేసుకుంది. ఇంత స్వల్ప వ్యత్యాసంతో ముఖ్యమంత్రి పీఠం చేజారటం విపరీతమైన వేదనకు గురి చేస్తుందనటంలో సందేహం లేదు.

This post was last modified on November 13, 2020 11:53 am

Share
Show comments
Published by
satya

Recent Posts

మూడో టిల్లు జోడిగా బుట్టబొమ్మ?

టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…

6 hours ago

శ్యామ్ సింగ రాయ్ దర్శకుడి కొత్త ట్యాక్సీ

కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…

7 hours ago

అల్లరోడికి అసలు పరీక్ష రేపే

వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…

8 hours ago

స‌మ‌యం మించి పోయింది.. సేనానీ: ఎన్నిక‌ల సంఘం

ఏపీలో త‌లెత్తిన ఎన్నిక‌ల  గుర్తు ర‌గ‌డ మ‌రో మ‌లుపు తిరిగింది. జ‌న‌సేన‌కు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వ‌తంత్ర…

9 hours ago

క్రిష్‌కు ఇది సమ్మతమేనా?

టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…

9 hours ago

వరలక్ష్మితో రూమ్ బుక్ చేయనా అన్నాడట

ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…

10 hours ago