Political News

12 వేల ఓట్లు.. ఆ యువనేతను సీఎం కాకుండా చేశాయ్

ఎన్నికల్లో అంకెలు చేసే మేజిక్ అంతా ఇంతా కాదు. గెలుపు.. ఓటముల మధ్య రేఖ ఎంత పలుచగా ఉందో కొన్ని సందర్భాల్ని చూస్తే ఇట్టే అర్థమైపోతాయి. తాజాగా బిహార్ ఎన్నికల ఫలితాల్ని చూస్తే మరింత బాగా అర్థం కావటం ఖాయం. ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో కాస్తంత మెజార్టీ అంటేనే పదివేల ఓట్ల అధిక్యత ఉంటుంది. అలాంటి పన్నెండు వేల ఓట్లు.. ఒక యువనేతను ముఖ్యమంత్రి కాకుండా అడ్డుపడ్డాయంటే పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడు అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు ఆర్జేడీ యువనేత తేజస్వీ యాదవ్.

బిహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే.. అన్ని మీడియా సంస్థలు ప్రకటించిన ఎగ్జిట్ ఫలితాల్ని చూస్తే.. మహాకూటమి గెలుపు ఖాయమని తేల్చేశారు. పోలింగ్ పూర్తి అయిన తర్వాత నుంచి ఓట్ల లెక్కింపు వరకు ఇదే జోష్ నడిచింది. ఓట్ల లెక్కింపు మాత్రం ఇందుకు భిన్నంగా సాగటమే కాదు.. అధికారం చివరకు ఎన్డీయే వైపు వెళ్లటం తెలిసిందే. పోటాపోటీగా సీట్లు సాధించినప్పటికీ.. చివర్లో మొగ్గు ఎన్డీయే వైపు సాగింది.

ఆసక్తికరమైన విషయం ఏమంటే.. 2015లో ఎన్నికల్లో మహాకూటమి.. ఎన్డీయే కంటే 7.8 శాతం ఓట్లను సాధించగా.. ఈసారి ఎన్డీయే 0.3 శాతం ఓట్లను మాత్రమే ఎక్కువగా పొందాయి. ఎన్డీయేకు 1.57 కోట్ల ఓట్లు వస్తే.. మహా కూటమికి 1.56 కోట్ల ఓట్లు వచ్చాయి. రెండు కూటమిలకు మధ్య వ్యత్యాసం కేవలం 12,768 ఓట్లు మాత్రమే. కేవలం 0.3 శాతం ఓట్లు తగ్గటంతో తేజస్వీకి సీఎం అయ్యే అవకాశం మిస్ అయితే.. ఎన్డీయే ఆ అవకాశాన్ని సొంతం చేసుకుంది. ఇంత స్వల్ప వ్యత్యాసంతో ముఖ్యమంత్రి పీఠం చేజారటం విపరీతమైన వేదనకు గురి చేస్తుందనటంలో సందేహం లేదు.

This post was last modified on November 13, 2020 11:53 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

బోకేలు, శాలువాలు లేవు… పవన్ రియాక్షన్ ఏంటి?

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…

1 hour ago

నెగిటివిటీ వలయంలో దురంధర్ విలవిలా

బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…

1 hour ago

పరకామణి దొంగను వెనకేసుకొచ్చిన జగన్!

చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…

4 hours ago

‘కూటమి బలంగా ఉండాలంటే మినీ యుద్ధాలు చేయాల్సిందే’

2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…

5 hours ago

ప్రీమియర్లు క్యాన్సిల్… ఫ్యాన్స్ గుండెల్లో పిడుగు

ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…

5 hours ago

‘పరదాల్లో పవన్’ అన్న వైసీపీ ఇప్పుడేమంటుందో?

ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…

7 hours ago