బీహార్ ముఖ్యమంత్రి, సిఎం అభ్యర్ది నితీష్ కుమార్ కూడా నాలుక మడతేసి యూటర్న్ తీసేసుకున్నారు. తాను కూడా సగటు రాజకీయ నేతనే అని నిరూపించుకున్నారు. బీహార్ మూడో దశ ఎన్నికల ప్రచార సభ ముగింపులో మాట్లాడుతూ ఇవే తనకు చివరి ఎన్నికలంటు చేసిన ప్రకటన బీహార్లో సంచలనం సృష్టించింది. మొదటి రెండు దశల్లోను వెనకబడిన ఎన్డీయే కూటమి మూడో దశలో అయినా పుంజుకునేందుకే నీతీష్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని అనుమానలు అప్పట్లోనే వచ్చాయి.
దానికి తగ్గట్లే కూటమి గెలిచిన తర్వాత ఇపుడు నితీష్ అలాగే మాట్లాడటం ఆశ్చర్యమేసింది. ఇవే తనకు చివరి ఎన్నికలన్న తన ప్రకటనను జనాలే తప్పుగా అర్ధం చేసుకున్నారంటూ ఇఫుడు చల్లగా చెబుతున్నారు. చివరి ఎన్నికలంటే తన అర్ధం ప్రచారంలో చివరి ఎన్నికని అర్ధమంటు చక్కగా వివరించారు మీడియాకు. చివరి ఎన్నికల ప్రకటన విషయంలో నితీష్ తాజాగా ఇఛ్చిన వివరణ అచ్చంగా ‘అశ్వత్ధామ అతః కుంజరహ’ అని మహాభారతంలో ధర్మారాజు చెప్పినట్లే ఉంది.
కురుక్షేత్ర యుద్ధంలో కూడా ధర్మరాజు అశ్వత్థామ అతః అని అందరికీ ముఖ్యంగా ద్రోణాచార్యునికి వినబడేట్లుగా అరచి కుంజరహ అని ఎవరికీ వినబడకుండా చెబుతాడు. అలాగే ఉంది ఇపుడు నితీష్ చెప్పిన వివరణ కూడా. బహుశా మొన్నటి ఎన్నికల్లో ఎన్డీయూ కూటమి గనుక ఓడిపోయుంటే నితీష్ తన ప్రకటనకు కట్టబడుండే వారేమో. అయితే ఎవరు ఊహించని రీతిలో గెలుపు గుర్రం ఎక్కటంతో నాలుకను మడతేశారు. పైగా తన ప్రకటనను జనాలే తప్పుగా అర్ధం చేసుకున్నారంటు చెప్పటమే విచిత్రంగా ఉంది.
గాయని సునీత అంటే తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. చిత్ర, జానకి లాంటి సీనియర్ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న టైంలో…
కేంద్ర మంత్రివర్గం ప్రక్షాళన దాదాపు ఖరారైన నేపథ్యంలో ఏపీ నుంచి మరో ఇద్దరు ఎంపీలకు మంత్రి యోగం పట్టనుందని టీడీపీ…
కెరీర్లో ఒక దశ వరకు మామూలు మాస్ మసాలా సినిమాలే తీశాడు రాజమౌళి. మగధీర నుంచి ఆయనలోని మరో కోణం…
సోషల్ మీడియాలో హడావిడి తగ్గింది కానీ వీక్ డేస్ లో కూడా మా ఇంటి బంగారంకు మంచి ఆక్యుపెన్సీలు నమోదవుతున్నాయి.…
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రెండు వర్గాలుగా చీలిపోయి ఒక ఊహించని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఏప్రిల్…
కొన్ని డిజాస్టర్లు ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంటాయి. అందులో పనిచేసిన వాళ్లందరినీ జీవిత కాల చేదు జ్ఞాపకాలుగా మారిపోతుంటాయి. ఆ సినిమాల…