బీహార్ ముఖ్యమంత్రి, సిఎం అభ్యర్ది నితీష్ కుమార్ కూడా నాలుక మడతేసి యూటర్న్ తీసేసుకున్నారు. తాను కూడా సగటు రాజకీయ నేతనే అని నిరూపించుకున్నారు. బీహార్ మూడో దశ ఎన్నికల ప్రచార సభ ముగింపులో మాట్లాడుతూ ఇవే తనకు చివరి ఎన్నికలంటు చేసిన ప్రకటన బీహార్లో సంచలనం సృష్టించింది. మొదటి రెండు దశల్లోను వెనకబడిన ఎన్డీయే కూటమి మూడో దశలో అయినా పుంజుకునేందుకే నీతీష్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని అనుమానలు అప్పట్లోనే వచ్చాయి.
దానికి తగ్గట్లే కూటమి గెలిచిన తర్వాత ఇపుడు నితీష్ అలాగే మాట్లాడటం ఆశ్చర్యమేసింది. ఇవే తనకు చివరి ఎన్నికలన్న తన ప్రకటనను జనాలే తప్పుగా అర్ధం చేసుకున్నారంటూ ఇఫుడు చల్లగా చెబుతున్నారు. చివరి ఎన్నికలంటే తన అర్ధం ప్రచారంలో చివరి ఎన్నికని అర్ధమంటు చక్కగా వివరించారు మీడియాకు. చివరి ఎన్నికల ప్రకటన విషయంలో నితీష్ తాజాగా ఇఛ్చిన వివరణ అచ్చంగా ‘అశ్వత్ధామ అతః కుంజరహ’ అని మహాభారతంలో ధర్మారాజు చెప్పినట్లే ఉంది.
కురుక్షేత్ర యుద్ధంలో కూడా ధర్మరాజు అశ్వత్థామ అతః అని అందరికీ ముఖ్యంగా ద్రోణాచార్యునికి వినబడేట్లుగా అరచి కుంజరహ అని ఎవరికీ వినబడకుండా చెబుతాడు. అలాగే ఉంది ఇపుడు నితీష్ చెప్పిన వివరణ కూడా. బహుశా మొన్నటి ఎన్నికల్లో ఎన్డీయూ కూటమి గనుక ఓడిపోయుంటే నితీష్ తన ప్రకటనకు కట్టబడుండే వారేమో. అయితే ఎవరు ఊహించని రీతిలో గెలుపు గుర్రం ఎక్కటంతో నాలుకను మడతేశారు. పైగా తన ప్రకటనను జనాలే తప్పుగా అర్ధం చేసుకున్నారంటు చెప్పటమే విచిత్రంగా ఉంది.
This post was last modified on November 13, 2020 11:41 am
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచం పుంజుకుంటోంది. ప్రధానంగా ఐటీ సంస్థల నుంచి ప్రభుత్వ కార్యాలయాల వరకు కూడా ఏఐ ఆధారిత…
ప్రస్తుతం శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ 3 ది థర్డ్ కేస్ పూర్తి చేసే పనిలో ఉన్న న్యాచురల్ స్టార్…
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్కు సొంత బాబాయి.. వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసు లో తాజాగా…
గత ఏడాది సంక్రాంతికి ‘హనుమాన్’తో సెన్సేషన్ క్రియేట్ చేసింది ప్రశాంత్ వర్మ-తేజ సజ్జ జోడీ. పాన్ ఇండియా స్థాయిలో పెద్ద…
మాటల మాంత్రికుడు.. సోషల్ మీడియాలో దుమ్మురేపి.. ప్రస్తుతం ప్రజాప్రతినిధిగా శాసన మండలిలో ఉన్న తీన్మార్ మల్లన్న తన వాయిస్ ద్వారా…