జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యణ్ వస్త్రధారణలో చాలా ప్రత్యేకతను చూపుతారు. ఏ కార్యక్రమానికి ఎలాంటి వస్త్రధారణ అవసరమో… అందుకనుగుణంగానే ఆయన వెళతారు. అందులో భాగంగా ఇప్పటిదాకా ప్రభుత్వ, అధికారిక కార్యక్రమాల్లో ఆయన సినిమా హీరో లుక్కుతో కనిపించేలా వెళ్లలేదు. అయితే ఫర్ ద ఫస్ట్ టైమ్ గురువారం పవన్… రాజమహేంద్రవరంలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రారంభించిన అఖండ గోదావరి ప్రాజెక్టు కోసం సినీ హీరో లుక్కుతో వెళ్లి అందరినీ ఆకట్టుకున్నారు.
గోదావరి తీరం వెంట పర్యాటక ప్రాజెక్టుల అభివృద్ది కోసం అఖండ గోదావరి పేరిట కేంద్రం ఓ కొత్త ప్రాజెక్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. రూ.94.4 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టుతో పాటు రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాల్లోనూ ఇదే తరహా ప్రాజెక్టులకు కేంద్రం మొత్తంగా రూ.375 కోట్లను కేటాయించింది. ఈ ప్రాజెక్టులను ప్రారంబించేందుకు గజేంద్ర సింగ్ షెకావత్ రాగా… రాష్ట్ర ప్రభుత్వం తరఫున పవన్, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్, రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి, స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బారీ సంఖ్యలో హాజరయ్యారు.
ఈ సందర్బంగా పవన్ గతంలో నటించిన అజ్ఞాతవాసి సినిమాలో ఎలాంటి లుక్కులో కనిపించారో… గురువారం అదే లుక్కులో పవన్ హాజరయ్యారు. క్రీమ్ కలర్ ప్యాంట్, దానిపై లైట్ గ్రీన్ షర్ట్ వేసి, ఇన్ షర్ట్ చేసుకుని నీట్ గా టిప్ టాప్ గా కార్యక్రమానికి హాజరైన పవన్ నిజంగానే జనంతో పాటు ఈ కార్యక్రమానికి హాజరైన రాజకీయ నేతలను కూడా అమితంగా ఆకట్టుకున్నారు. కార్యక్రమం అంతా హుషారుగా కనిపించిన పవన్… తన ప్రసంగంలో నవ్వులు పూయించారు.
This post was last modified on June 26, 2025 2:00 pm
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…