Political News

ఇకపై పోలీసులు చూస్తూ ఊరుకునేలా లేరు

నిజమే… ఏపీలో ఇకపై విపక్షం వైసీపీ పప్పులు ఉడకవ్. ఆ పార్టీ ఇష్ఠారాజ్యంగా వ్యవహరించడానికి కూడా వీల్లేని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయం ఒకే ఒక్క ఘటనతో వైసీపీ నేతలు, శ్రేణులకూ అర్థమైపోయింది. ఇకపై ఏ పని చేయాలన్నా పోలీసులు ఇచ్చిన అనుమతులు, విధించే ఆంక్షలకు లోబడే వైసీపీ నేతలు, శ్రేణులు ముందుకు సాగక తప్పదు. ఇందుకు సోమవారం పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలోని జిల్లా కలెక్టరేట్ జరిగిన ఘటనే నిదర్శనంగా నిలుస్తోంది.

యువత పోరు పేరిట నిరుద్యోగులకు నిరుద్యుగ భృతి ఇవ్వాలని, సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వైసీపీ యువజన విభాగం నిరసనకు పిలుపునిచ్చింది. ఈ నిరసనల్లో భాగంగా నరసరావుపేటలో గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి నేతృత్వంలో పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు పల్నాడు కలెక్టరేట్ వద్దకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారిని పోలీసులు అడ్డుకోగా… పోలీసుల ఆంక్షలను, బారీకేడ్లను దాటుకుని వైసీపీ శ్రేణులు కలెక్టరేట్ లోపలికి చొచ్చుకువెళ్లేందుకు యత్నించాయి. ఈ సందర్భంగా అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది.

అయితే ఈ తరహా పరిణామాలను ముందే పసిగట్టిన పోలీసులు కూడా భారీ ఎత్తున పోలీసు బలగాలను అక్కడ మోహరించారు. ఎప్పుడైతే వైసీపీ శ్రేణులు కలెక్టరేట్ లోపలికి చొచ్చుకువెళ్లేందుకు యత్నించారో… అప్పుడే రంగంలోకి దిగిన పోలీసులు వైసీపీ నేతలు, కార్యకర్తలు అన్న తేడా లేకుండా లాఠీలకు పని చెప్పారు. ఈ పరిణామాన్ని ఊహించని వైసీపీ నేతలు, కార్యకర్తలు అక్కడి నుంచి పరుగులు పెట్టారు. అయినా కూడా విడిచిపెట్టని పోలీసులు వారిని తరుముతూ తమ ప్రతాపం చూపారు. తన ఆంక్షలను అతిక్రమిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో వైసీపీకి చూపించారు.

మొన్నటి జగన్ రెంటపాళ్ల పర్యటనలో వైసీపీ అతి పరాకాష్టకు చేరిన సంగతి తెలిసిందే. జగన్ కారు కిందే పడి వైసీపీ కార్యకర్త నలిగిపోతే…ఆ విషయమే తనకు తెలియదని జగన్ ప్రకటించిన తీరు గమనార్హం. ఇక సత్తెనపల్లిలో మరో కార్యకర్త మరణించారు. ఇంత జరిగినా కూడా తమ ఆంక్షలను వైసీపీ నేతలు అతిక్రమించినా విపక్షం కదా అన్న భావనతో పోలీసులు సంయమనం పాటించారు. అయితే తమ సంయమనం తమకు శాపంగా మారుతుందని భావించిన పోలీసు శాఖ ఇకపై ఆ తరహా వైఖరికి స్వస్తి చెప్పాలని నిర్ణయించుకుంది. అందుకే లాఠీచార్జీకి దిగింది. ఈ దెబ్బతో ఏపీలో వైసీపీ దూకుడుకు కళ్లెం పడినట్టేనని చెప్పక తప్పదు.

This post was last modified on June 23, 2025 4:46 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Ap PoliceYCP

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

2 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

2 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

3 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

4 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

5 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

7 hours ago