Political News

సూడో సెక్యూల‌రిస్టుల‌ను ఏకి ప‌డేసిన ప‌వ‌న్

ఈ మ‌ధ్య జ‌న‌సేనాని, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌నాత‌న ధ‌ర్మం గురంచి చాలా గ‌ట్టిగా మాట్లాడుతూ.. సెక్యూల‌రిజం పేరుతో హిందూ మ‌తాన్ని త‌క్కువ చేసే వాళ్ల మీద ఘాటుగా స్పందిస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఆయ‌న మ‌రోసారి సూడో సెక్యూల‌రిస్టుల తీరును బ‌లంగా ఎండ‌గ‌ట్టాడు. త‌మిళ‌నాడులోని మధురైలో నిర్వహిస్తున్న మురుగ భక్తర్గళ్ మానాడు కార్య‌క్ర‌మంలో అతిథిగా పాల్గొన్న ప‌వ‌న్.. త‌న ప్ర‌సంగంతో భారీగా హాజ‌రైన జ‌నాలను ఉర్రూత‌లూగించాడు. పూర్తిగా త‌మిళంలో ఆయ‌న ప్ర‌సంగం సాగ‌డం విశేషం. త‌మిళ సంప్ర‌దాయ దుస్తుల్లో ఈ స‌భకు హాజ‌రైన‌ ప‌వ‌న్.. స్టేజ్ మీదికి రాగానే స‌భా ప్రాంగ‌ణం హోరెత్తింది. త‌మిళ‌నాడు బీజీపీ అగ్ర నేత అన్నామ‌ళైతో పాటు చాలామంది స్వామీజీలు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

ఇక త‌న ప్ర‌సంగంలో ప‌వ‌న్ మాట్లాడుతూ.. మ‌న దేశంలో సెక్యూల‌రిజం ముసుగులో అంద‌రూ హిందూ మ‌తం మీద దాడి చేసేవాళ్లే అని వ్యాఖ్యానించారు. మిగ‌తా ఏ మ‌తంలోని దేవుళ్ల జోలికీ వీళ్లు వెళ్ల‌ర‌ని.. కానీ హిందూ దేవుళ్ల గురించి మాత్రం ఎలా ప‌డితే అలా మాట్లాడ‌తార‌ని ప‌వ‌న్ అన్నాడు. అన్ని మ‌తాల‌నూ ఒకే ర‌కంగా చూడ‌డం సెక్యూల‌రిజం అవుతుంద‌ని.. అలా కాకుండా ఒక మ‌తం విష‌యంలో మాత్రం భిన్నంగా మాట్లాడితే అది సూడో సెక్యూల‌రిజ‌మే అని ప‌వ‌న్ అన్నాడు. ఇత‌ర మ‌తాల దేవుళ్ల గురించి కూడా ఇలాగే మాట్లాడే ధైర్యం వారికి ఉందా అని ప‌వ‌న్ ప్ర‌శ్నించాడు.

హిందూ మ‌తం గురించి, దేవుళ్ల గురించి వాళ్లు ఏం మాట్లాడినా జ‌నం బాధ ప‌డ‌కూడ‌ద‌ని, కోపం రాకూడ‌ద‌ని.. బాధ‌, కోపం క‌లిగిందంటే అవ‌త‌లి వాళ్లు భావ ప్ర‌క‌ట‌న స్వేచ్ఛ గురించి మాట్లాడ‌తార‌ని.. ఇది ఎలా ఫ్రీడ‌మ్ ఆఫ్ స్పీచ్ అవుతుంద‌ని ప‌వ‌న్ స్పందించాడు. దేశంలో ఈ ప‌రిస్థితి మారాల‌ని.. హిందూ మ‌తం గురించి, స‌నాత‌న ధ‌ర్మం గురించి ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడ్డం క‌ట్టి పెట్టాల‌ని.. అందుకోసం హిందువులంతా క‌లిసి రావాల‌ని.. సూడో సెక్యూల‌రిస్టుల‌కు బుద్ధి చెప్పాల‌ని ప‌వ‌న్ పిలుపునిచ్చాడు. ఆయ‌న ప్ర‌సంగానికి స‌భ‌లో అద్భుత స్పంద‌న వ‌చ్చింది.

This post was last modified on June 23, 2025 10:18 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

1 hour ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

4 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

4 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

5 hours ago

చరణ్ కోసం అఖిల్ త్యాగం చేస్తాడా?

రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…

5 hours ago

పోలీసులకు వార్నింగ్ ఇచ్చి సారీ చెప్పిన కౌశిక్ రెడ్డి!

వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…

7 hours ago