Political News

సూడో సెక్యూల‌రిస్టుల‌ను ఏకి ప‌డేసిన ప‌వ‌న్

ఈ మ‌ధ్య జ‌న‌సేనాని, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌నాత‌న ధ‌ర్మం గురంచి చాలా గ‌ట్టిగా మాట్లాడుతూ.. సెక్యూల‌రిజం పేరుతో హిందూ మ‌తాన్ని త‌క్కువ చేసే వాళ్ల మీద ఘాటుగా స్పందిస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఆయ‌న మ‌రోసారి సూడో సెక్యూల‌రిస్టుల తీరును బ‌లంగా ఎండ‌గ‌ట్టాడు. త‌మిళ‌నాడులోని మధురైలో నిర్వహిస్తున్న మురుగ భక్తర్గళ్ మానాడు కార్య‌క్ర‌మంలో అతిథిగా పాల్గొన్న ప‌వ‌న్.. త‌న ప్ర‌సంగంతో భారీగా హాజ‌రైన జ‌నాలను ఉర్రూత‌లూగించాడు. పూర్తిగా త‌మిళంలో ఆయ‌న ప్ర‌సంగం సాగ‌డం విశేషం. త‌మిళ సంప్ర‌దాయ దుస్తుల్లో ఈ స‌భకు హాజ‌రైన‌ ప‌వ‌న్.. స్టేజ్ మీదికి రాగానే స‌భా ప్రాంగ‌ణం హోరెత్తింది. త‌మిళ‌నాడు బీజీపీ అగ్ర నేత అన్నామ‌ళైతో పాటు చాలామంది స్వామీజీలు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

ఇక త‌న ప్ర‌సంగంలో ప‌వ‌న్ మాట్లాడుతూ.. మ‌న దేశంలో సెక్యూల‌రిజం ముసుగులో అంద‌రూ హిందూ మ‌తం మీద దాడి చేసేవాళ్లే అని వ్యాఖ్యానించారు. మిగ‌తా ఏ మ‌తంలోని దేవుళ్ల జోలికీ వీళ్లు వెళ్ల‌ర‌ని.. కానీ హిందూ దేవుళ్ల గురించి మాత్రం ఎలా ప‌డితే అలా మాట్లాడ‌తార‌ని ప‌వ‌న్ అన్నాడు. అన్ని మ‌తాల‌నూ ఒకే ర‌కంగా చూడ‌డం సెక్యూల‌రిజం అవుతుంద‌ని.. అలా కాకుండా ఒక మ‌తం విష‌యంలో మాత్రం భిన్నంగా మాట్లాడితే అది సూడో సెక్యూల‌రిజ‌మే అని ప‌వ‌న్ అన్నాడు. ఇత‌ర మ‌తాల దేవుళ్ల గురించి కూడా ఇలాగే మాట్లాడే ధైర్యం వారికి ఉందా అని ప‌వ‌న్ ప్ర‌శ్నించాడు.

హిందూ మ‌తం గురించి, దేవుళ్ల గురించి వాళ్లు ఏం మాట్లాడినా జ‌నం బాధ ప‌డ‌కూడ‌ద‌ని, కోపం రాకూడ‌ద‌ని.. బాధ‌, కోపం క‌లిగిందంటే అవ‌త‌లి వాళ్లు భావ ప్ర‌క‌ట‌న స్వేచ్ఛ గురించి మాట్లాడ‌తార‌ని.. ఇది ఎలా ఫ్రీడ‌మ్ ఆఫ్ స్పీచ్ అవుతుంద‌ని ప‌వ‌న్ స్పందించాడు. దేశంలో ఈ ప‌రిస్థితి మారాల‌ని.. హిందూ మ‌తం గురించి, స‌నాత‌న ధ‌ర్మం గురించి ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడ్డం క‌ట్టి పెట్టాల‌ని.. అందుకోసం హిందువులంతా క‌లిసి రావాల‌ని.. సూడో సెక్యూల‌రిస్టుల‌కు బుద్ధి చెప్పాల‌ని ప‌వ‌న్ పిలుపునిచ్చాడు. ఆయ‌న ప్ర‌సంగానికి స‌భ‌లో అద్భుత స్పంద‌న వ‌చ్చింది.

This post was last modified on June 23, 2025 10:18 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎన్నికలపై బెట్టింగుల హోరు!… అంతటా హైటెన్షన్!

దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…

3 hours ago

తారక్ అభిమానికి చరణ్ ఛాన్స్?

పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…

3 hours ago

మమ్ముట్టి & మోహన్ లాల్ మెప్పించారా

మల్లువుడ్ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ 18 సంవత్సరాల తర్వాత కలిసి నటించడం అంటే మాములు…

4 hours ago

30 రోజుల కౌంట్ డౌన్ మొదలయ్యింది

సరిగ్గా ఇంకో ముప్పై రోజుల్లో పెద్ది ప్రీమియర్ డే వచ్చేస్తుంది. నిర్మాత వెంకట సతీష్ కిలారు ప్రకటించిన దాని ప్రకారం…

4 hours ago

చావానే టార్గెట్… అంత సీన్ లేదు రాజా

ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ రాజా శివాజీ బాక్సాఫీస్ వద్ద బాగానే పెర్ఫార్మ్ చేస్తోంది. మొదటి రెండు రోజులకే సుమారు…

5 hours ago

తరుణ్ క్యాలికులేషన్ ఎక్కడ తప్పుతోంది

పది సంవత్సరాల కెరీర్ లో కేవలం మూడు సినిమాలు తీసిన దర్శకుడు తరుణ్ భాస్కర్. పెళ్లి చూపులు, ఈ నగరానికి…

7 hours ago