ఈ మధ్య జనసేనాని, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురంచి చాలా గట్టిగా మాట్లాడుతూ.. సెక్యూలరిజం పేరుతో హిందూ మతాన్ని తక్కువ చేసే వాళ్ల మీద ఘాటుగా స్పందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మరోసారి సూడో సెక్యూలరిస్టుల తీరును బలంగా ఎండగట్టాడు. తమిళనాడులోని మధురైలో నిర్వహిస్తున్న మురుగ భక్తర్గళ్ మానాడు కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న పవన్.. తన ప్రసంగంతో భారీగా హాజరైన జనాలను ఉర్రూతలూగించాడు. పూర్తిగా తమిళంలో ఆయన ప్రసంగం సాగడం విశేషం. తమిళ సంప్రదాయ దుస్తుల్లో ఈ సభకు హాజరైన పవన్.. స్టేజ్ మీదికి రాగానే సభా ప్రాంగణం హోరెత్తింది. తమిళనాడు బీజీపీ అగ్ర నేత అన్నామళైతో పాటు చాలామంది స్వామీజీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇక తన ప్రసంగంలో పవన్ మాట్లాడుతూ.. మన దేశంలో సెక్యూలరిజం ముసుగులో అందరూ హిందూ మతం మీద దాడి చేసేవాళ్లే అని వ్యాఖ్యానించారు. మిగతా ఏ మతంలోని దేవుళ్ల జోలికీ వీళ్లు వెళ్లరని.. కానీ హిందూ దేవుళ్ల గురించి మాత్రం ఎలా పడితే అలా మాట్లాడతారని పవన్ అన్నాడు. అన్ని మతాలనూ ఒకే రకంగా చూడడం సెక్యూలరిజం అవుతుందని.. అలా కాకుండా ఒక మతం విషయంలో మాత్రం భిన్నంగా మాట్లాడితే అది సూడో సెక్యూలరిజమే అని పవన్ అన్నాడు. ఇతర మతాల దేవుళ్ల గురించి కూడా ఇలాగే మాట్లాడే ధైర్యం వారికి ఉందా అని పవన్ ప్రశ్నించాడు.
హిందూ మతం గురించి, దేవుళ్ల గురించి వాళ్లు ఏం మాట్లాడినా జనం బాధ పడకూడదని, కోపం రాకూడదని.. బాధ, కోపం కలిగిందంటే అవతలి వాళ్లు భావ ప్రకటన స్వేచ్ఛ గురించి మాట్లాడతారని.. ఇది ఎలా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అవుతుందని పవన్ స్పందించాడు. దేశంలో ఈ పరిస్థితి మారాలని.. హిందూ మతం గురించి, సనాతన ధర్మం గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడ్డం కట్టి పెట్టాలని.. అందుకోసం హిందువులంతా కలిసి రావాలని.. సూడో సెక్యూలరిస్టులకు బుద్ధి చెప్పాలని పవన్ పిలుపునిచ్చాడు. ఆయన ప్రసంగానికి సభలో అద్భుత స్పందన వచ్చింది.
This post was last modified on June 23, 2025 10:18 am
ఏపీలో టీడీపీ నాయకులు దారి తప్పుతున్నారన్న విషయంపై సమీక్షలు చేయడం.. వారిపై సీరియస్ అయినట్టుగా ఒక ప్రకటన విడుదల చేయడం..…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్గా భావిస్తున్న ఇద్దరు కీలక…
ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…
పెంపుడు జంతువుల పట్ల యజమానులు, కుటుంబ సభ్యులు ఎంత ప్రేమను పెంచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయా జంతువులు…
ఒకప్పుడు పాత సినిమాల పాటలను యథేచ్ఛగా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవరికీ ఏ అభ్యంతరాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…