Political News

సూడో సెక్యూల‌రిస్టుల‌ను ఏకి ప‌డేసిన ప‌వ‌న్

ఈ మ‌ధ్య జ‌న‌సేనాని, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌నాత‌న ధ‌ర్మం గురంచి చాలా గ‌ట్టిగా మాట్లాడుతూ.. సెక్యూల‌రిజం పేరుతో హిందూ మ‌తాన్ని త‌క్కువ చేసే వాళ్ల మీద ఘాటుగా స్పందిస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఆయ‌న మ‌రోసారి సూడో సెక్యూల‌రిస్టుల తీరును బ‌లంగా ఎండ‌గ‌ట్టాడు. త‌మిళ‌నాడులోని మధురైలో నిర్వహిస్తున్న మురుగ భక్తర్గళ్ మానాడు కార్య‌క్ర‌మంలో అతిథిగా పాల్గొన్న ప‌వ‌న్.. త‌న ప్ర‌సంగంతో భారీగా హాజ‌రైన జ‌నాలను ఉర్రూత‌లూగించాడు. పూర్తిగా త‌మిళంలో ఆయ‌న ప్ర‌సంగం సాగ‌డం విశేషం. త‌మిళ సంప్ర‌దాయ దుస్తుల్లో ఈ స‌భకు హాజ‌రైన‌ ప‌వ‌న్.. స్టేజ్ మీదికి రాగానే స‌భా ప్రాంగ‌ణం హోరెత్తింది. త‌మిళ‌నాడు బీజీపీ అగ్ర నేత అన్నామ‌ళైతో పాటు చాలామంది స్వామీజీలు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

ఇక త‌న ప్ర‌సంగంలో ప‌వ‌న్ మాట్లాడుతూ.. మ‌న దేశంలో సెక్యూల‌రిజం ముసుగులో అంద‌రూ హిందూ మ‌తం మీద దాడి చేసేవాళ్లే అని వ్యాఖ్యానించారు. మిగ‌తా ఏ మ‌తంలోని దేవుళ్ల జోలికీ వీళ్లు వెళ్ల‌ర‌ని.. కానీ హిందూ దేవుళ్ల గురించి మాత్రం ఎలా ప‌డితే అలా మాట్లాడ‌తార‌ని ప‌వ‌న్ అన్నాడు. అన్ని మ‌తాల‌నూ ఒకే ర‌కంగా చూడ‌డం సెక్యూల‌రిజం అవుతుంద‌ని.. అలా కాకుండా ఒక మ‌తం విష‌యంలో మాత్రం భిన్నంగా మాట్లాడితే అది సూడో సెక్యూల‌రిజ‌మే అని ప‌వ‌న్ అన్నాడు. ఇత‌ర మ‌తాల దేవుళ్ల గురించి కూడా ఇలాగే మాట్లాడే ధైర్యం వారికి ఉందా అని ప‌వ‌న్ ప్ర‌శ్నించాడు.

హిందూ మ‌తం గురించి, దేవుళ్ల గురించి వాళ్లు ఏం మాట్లాడినా జ‌నం బాధ ప‌డ‌కూడ‌ద‌ని, కోపం రాకూడ‌ద‌ని.. బాధ‌, కోపం క‌లిగిందంటే అవ‌త‌లి వాళ్లు భావ ప్ర‌క‌ట‌న స్వేచ్ఛ గురించి మాట్లాడ‌తార‌ని.. ఇది ఎలా ఫ్రీడ‌మ్ ఆఫ్ స్పీచ్ అవుతుంద‌ని ప‌వ‌న్ స్పందించాడు. దేశంలో ఈ ప‌రిస్థితి మారాల‌ని.. హిందూ మ‌తం గురించి, స‌నాత‌న ధ‌ర్మం గురించి ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడ్డం క‌ట్టి పెట్టాల‌ని.. అందుకోసం హిందువులంతా క‌లిసి రావాల‌ని.. సూడో సెక్యూల‌రిస్టుల‌కు బుద్ధి చెప్పాల‌ని ప‌వ‌న్ పిలుపునిచ్చాడు. ఆయ‌న ప్ర‌సంగానికి స‌భ‌లో అద్భుత స్పంద‌న వ‌చ్చింది.

This post was last modified on June 23, 2025 10:18 am

Share

Recent Posts

ఈ బంధాలే టీడీపీ బలం!

భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…

1 hour ago

ఏ పోస్ట్ అయినా పెడతా… ఎలాంటి ఫోటో అయినా దిగుతా

టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…

2 hours ago

హీరో కంటే దర్శకుడికే డ్యామేజ్

ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…

3 hours ago

జ‌గ‌న్‌కు సెగ‌: వైసీపీలో నిర‌స‌న స్వ‌రాలు.. !

వైసీపీలో జ‌గ‌న్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నార‌ని, ఆయ‌న గీసిన గీత దాట‌బోర‌ని చెప్పే వారు క‌నిపిస్తారు. అయితే.. తాజాగా…

4 hours ago

బ్రేకప్ బాధ నుంచి బ‌య‌ట‌ప‌డ్డ‌ట్లేనా?

క‌థానాయిక‌గా మ‌ల‌యాళంలో ప‌రిచ‌యం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవ‌కాశాలు అందుకున్న అమ్మాయి అనుప‌మ ప‌ర‌మేశ్వ‌రన్. ఆమె కెరీర్లో ఎక్కువ…

9 hours ago

ఎయిర్ పోర్టు లేకపోతే పిల్లనివ్వరా..?

వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…

9 hours ago