అదో ఏపీలోని మారుమూల జిల్లా, వెనుకబడిన జిల్లాగా ముద్రపడిన శ్రీకాకుళం జిల్లా. ఆ జిల్లాలోని టెక్కలిలో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలతో పాటుగా అదే పాఠశాలలో బాలికల జూనియర్ కళాశాల కూడా కొనసాగుతోంది. ఏటా అటు పాఠశాలతో పాటుగా ఇటు కళాశాలలోనూ సీట్లు నిండక అధ్యాపకులు ఈగలు తోలుకున్న పరిస్థితి. అయితే కూటమి సర్కారు వచ్చిన తర్వాత టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ చేపట్టిన విద్యా సంస్కరణల కారణంగా ఇప్పుడు ఆ జూనియర్ కళాశాలలో ‘నో మోర్ సీట్స్’ బోర్డు పెట్టేశారు.
సాధారణంగా ఇటీవలి కాలంలో ప్రభుత్వ కళాశాలల వైపు చూస్తున్న పిల్లల సంఖ్య చాలా తక్కువే. మరీ దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న కుటుంబాల పిల్లలు తప్పనిసరి పరిస్థితుల్లో సర్కారీ విద్యాలయాల వైపు చూస్తున్నారు. ఏ విభాగంలో ఖాళీలు ఉంటే ఆ విభాగాల్లో చేరిపోతున్నారు. ఆపై కొందరు దూకుడుగా ముందుకు సాగుతూ ఉంటే.. మరికొందరు అక్కడే ముక్కుతూ మూలుగుతూ ఏళ్ల తరబడి ఆయా కోర్సులను పూర్తి చేసేందుకు కుస్తీలు పడుతున్నారు. ఇక ఆయా నియోజకవర్గాల్లో ప్రజా ప్రతినిధులు కూడా సర్కారీ విద్యను పట్టించుకున్నపాపాన పోవడం లేదు. ఫలితంగానే సర్కారీ విద్యాలయాల్లో ‘నో మోర్ సీట్స్’ బోర్డు అన్న మాటే కనిపించదు. వినిపించదు.
అయితే ఏడాది పాలనలో లోకేశ్ విద్యా వ్యవస్థలో తీసుకువస్తున్న సంస్కరణల కారణంగా ప్రభుత్వ విద్యాలయాలపై జనానికి నమ్మం కుదిరింది. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ కళాశాలల్లో కాకుండా ప్రభుత్వ కళాశాలల్లో చేర్పించేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీలో పలు ప్రభుత్వ విద్యాలయాల్లో ‘నో మోర్ సీట్స్’ బోర్డులు కనిపించడం ఖాయమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. అందులో తొలిగా టెక్కలి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఈ బోర్డును పెట్టి తన ప్రత్యేకతను చాటుకుంది.
This post was last modified on June 21, 2025 7:29 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…