అదో ఏపీలోని మారుమూల జిల్లా, వెనుకబడిన జిల్లాగా ముద్రపడిన శ్రీకాకుళం జిల్లా. ఆ జిల్లాలోని టెక్కలిలో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలతో పాటుగా అదే పాఠశాలలో బాలికల జూనియర్ కళాశాల కూడా కొనసాగుతోంది. ఏటా అటు పాఠశాలతో పాటుగా ఇటు కళాశాలలోనూ సీట్లు నిండక అధ్యాపకులు ఈగలు తోలుకున్న పరిస్థితి. అయితే కూటమి సర్కారు వచ్చిన తర్వాత టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ చేపట్టిన విద్యా సంస్కరణల కారణంగా ఇప్పుడు ఆ జూనియర్ కళాశాలలో ‘నో మోర్ సీట్స్’ బోర్డు పెట్టేశారు.
సాధారణంగా ఇటీవలి కాలంలో ప్రభుత్వ కళాశాలల వైపు చూస్తున్న పిల్లల సంఖ్య చాలా తక్కువే. మరీ దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న కుటుంబాల పిల్లలు తప్పనిసరి పరిస్థితుల్లో సర్కారీ విద్యాలయాల వైపు చూస్తున్నారు. ఏ విభాగంలో ఖాళీలు ఉంటే ఆ విభాగాల్లో చేరిపోతున్నారు. ఆపై కొందరు దూకుడుగా ముందుకు సాగుతూ ఉంటే.. మరికొందరు అక్కడే ముక్కుతూ మూలుగుతూ ఏళ్ల తరబడి ఆయా కోర్సులను పూర్తి చేసేందుకు కుస్తీలు పడుతున్నారు. ఇక ఆయా నియోజకవర్గాల్లో ప్రజా ప్రతినిధులు కూడా సర్కారీ విద్యను పట్టించుకున్నపాపాన పోవడం లేదు. ఫలితంగానే సర్కారీ విద్యాలయాల్లో ‘నో మోర్ సీట్స్’ బోర్డు అన్న మాటే కనిపించదు. వినిపించదు.
అయితే ఏడాది పాలనలో లోకేశ్ విద్యా వ్యవస్థలో తీసుకువస్తున్న సంస్కరణల కారణంగా ప్రభుత్వ విద్యాలయాలపై జనానికి నమ్మం కుదిరింది. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ కళాశాలల్లో కాకుండా ప్రభుత్వ కళాశాలల్లో చేర్పించేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీలో పలు ప్రభుత్వ విద్యాలయాల్లో ‘నో మోర్ సీట్స్’ బోర్డులు కనిపించడం ఖాయమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. అందులో తొలిగా టెక్కలి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఈ బోర్డును పెట్టి తన ప్రత్యేకతను చాటుకుంది.
This post was last modified on June 21, 2025 7:29 am
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…