కలియుగ వైకుంఠ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వాడారన్న వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ తయారీకి వాడింది అసలు నెయ్యే కాదని ఇప్పటికే ఓ నివేదిక బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదే వ్యవహారంలో తాజాగా మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. తిరుమల కు సరఫరా అయిన కల్తీ నెయ్యి… ఏపీలోని ప్రముఖ ఆలయాలకూ సరఫరా అయ్యిందని, ఆ ఆలయాలకూ తిరుమలకు నెయ్యి సరఫరా చేసిన భోలేబాబా డెయిరీనే ఈ కల్తీ నెయ్యిని సరఫరా చేసిందని తాజాగా తేలింది.
కల్తీ నెయ్యి వ్యవహారంలో భోలేబాబా డెయిరీ తరఫున ఆ సంస్థ జనరల్ మేనేజర్ హరిమోహన్ రాణాను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే రాణా ఇప్పటికే రెండు పర్యాయాలు బెయిల్ కోసం యత్నించి విఫలమయ్యారు. తాజాగా మూడో సారి కూడా ఆయన నెల్లూరు ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా… దానిపై గురువారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ జయశేఖర్ బెయిల్ పిటిషన్ కు వ్యతిరేకంగా వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ఆయన తిరుమల మాదిరే రాష్ట్రంలోని ఇతర ప్రముఖ ఆలయాలకూ కల్తీ నెయ్యిని భోలేబాబా డెయిరీ సరఫరా చేసిందని సంచలన విషయాన్ని వెల్లడించారు.
ఇలా భోలేబాబా డెయిరీ కల్తీ నెయ్యి సరఫరా చేసిన ప్రముఖ ఆలయాల్లో బెజవాడ దుర్గమ్మ గుడి, శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం, ద్వారకా తిరుమల తదితర ఆలయాలు ఉన్నాయి. సుగంధ ఆయిల్స్, పామోలిన్ లతో కల్తీ నెయ్యిని తయారు చేసిన భోలేబాబా…దానినే తిరుమల సహా ఇతర ఆలయాలకూ సరఫరా చేసింది. ఈ సంస్థ అక్రమాలను గుర్తించి టీటీడీ 2022లో బ్లాక్ లిస్ట్ లో పెట్టినా… తిరుపతిలోని ఓ చిన్న డెయిరీని కేంద్రంగా చేసుకుని ఇతర డెయిరీల పేరుతో ఈ దందాను కొనసాగించిందని జయశేఖర్ న్యాయమూర్తికి వివరించారు. ఇంతటి నేరస్వభావం ఉన్న భోలేబాబా ప్రతినిధులకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేస్తారని, అసలు సాక్ష్యాలే లేకుండా చేస్తారని ఆయన వాదించారు. ఏపీపీ వాదనలతో ఏకీభవించిన కోర్టు… రాణా బెయిల్ ను వరుసగా మూడో సారి తిరస్కరించింది.
This post was last modified on June 20, 2025 1:54 pm
ఒకప్పుడు తెలుగు సినిమాల మీద తమిళ చిత్రాలు స్పష్టమైన ఆధిపత్యం చూపించేవి. అక్కడ ఎంతోమంది మేటి దర్శకులు ఉండేవాళ్లు. కొత్త…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరో టెస్ట్ ఎదురు కానుందా? మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం చూస్తున్న నేపథ్యంలో ఆయన ఎవరిని…
ఎంతో గొప్ప పేరు సంపాదించిన లెజెండరీ డైరెక్టర్లలో చాలామంది 70 ఏళ్ల వయసు రాగానే సినిమాలు ఆపేస్తుంటారు. ఆదూర్ గోపాలకృష్ణన్…
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 విడుదల ముందు అనుకున్న ప్రకారమైతే…
దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…
పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…