Political News

వారికి వాయిస్ లేకుండా పోయింది!

నాయ‌కుడు అన్నాక‌.. మీడియాతో అనుబంధం ఉంటుంది. నాయ‌కులకు-మీడియాకు మ‌ధ్య అవినాభావ సంబంధం కూడా పెరిగిపోయింది. ఎంత సేపూ.. మీడియా ముందు ఉండాల‌నే నాయ‌కులు కోరుకుంటారు. అవ‌స‌రం వ‌స్తే.. అదే ప‌నిగా మీడియా ముందు కూర్చునే నాయ‌కులు కూడా.. ఏపీలో బాగానే ఉన్నారు. మీడియా ముందు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డంతోపాటు.. సంచ‌ల‌నాలు సృష్టించాల‌ని బావించే వారు కూడా ఉన్నారు. అయితే.. ఇప్పుడు వీరికి ప‌నిలేకుండా పోయింది.

ముఖ్యంగా టీడీపీలో నాయ‌కులు ఫైర్ బ్రాండ్లుగా ముద్ర వేసుకున్న వారు కూడా ఉన్నారు. ఉదాహ‌ర‌ణ‌కు చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌, య‌ర‌ప‌తినేని శ్రీనివాస‌రావు, బండారు స‌త్య‌నారాయ‌ణ మూర్తి, గంటా శ్రీనివాస‌రావు వంటి వారు ఏం మాట్లాడినా .. సంచ‌ల‌నాలు సృష్టిస్తాయి. వారికి ఉన్న ఇమేజ్ అలాంటింది. దీంతో గ‌తంలో వారు త‌ర‌చుగా మీడియా ముందుకు వ‌చ్చేవారు. ఏదో ఒక విష‌యంపై వారు ప్ర‌స్తావ‌న చేసేవారు. కానీ, గ‌త ఏడాది కాలంలో వీరు పెద్ద‌గా మీడియా ముందుకు వ‌చ్చిన దాఖ‌లా లేకుండా పోయింది.

ఈ విష‌యంలో పార్టీ అధిష్టానం నుంచి బ‌లమైన సంకేతాలు వ‌చ్చాయ‌న్న వాద‌న వినిపిస్తోంది. ఏది ఉన్నా.. ముందుగా త‌మ‌కు చెప్పి.. ఆ త‌ర్వాతే.. మీడియా ముందుకు రావాల‌ని పార్టీ నిర్ణ‌యం తీసుకుంది. దీంతో చాలా మంది ఫైర్ బ్రాండ్లు రావ‌డ‌మే మానేశారు. మ‌రో కీల‌క విష‌యం ఏంటంటే.. పార్టీ నిర్దేశించిన అంశాల‌పై మాత్ర‌మే మాట్లాడాల‌ని తేల్చి చెప్పారు. దీంతో ఆ నిర్దేశిత అంశాల‌పైనే మాట్లాడుతున్నారు. దీంతో వారు స‌రైన రీతిలో ప్రొజెక్టు కాలేక పోతున్నార‌న్న వాద‌న వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

తాజాగా త‌ల్లికి వంద‌నం ప‌థ‌కంపై వైసీపీ కీల‌క విమ‌ర్శ‌లు చేసింది. ఈ ప‌థ‌కంలో మిన‌హాయించుకుం టున్న రూ.2000లు మంత్రినారా లోకేష్ ఖాతాలోకి చేరుతున్నాయ‌ని విమ‌ర్శించింది. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు దాడి చేయాల‌ని పార్టీ ఆదేశించింది. దీంతో కొంద‌రు నాయ‌కులు మీడియా ముందుకు వ‌చ్చారు. ఇది మిన‌హా .. ఇత‌ర విష‌యాల‌పై వారు మాట్లాడే అవ‌కాశం లేకుండా పోయింది.

అయితే.. ఇలా చేయ‌డం స‌రికాద‌ని.. బ‌ల‌మైన వాయిస్‌ను పార్టీ వినియోగించుకోవాల‌ని సూచ‌న‌లు వినిపిస్తున్నాయి. పైగా మంత్రుల డామినేష‌న్‌తో కూడా మ‌రికొంద‌రు ఎమ్మెల్యేలు మౌనంగా ఉంటున్నారు. ఎలా చూసినా.. దీనిపై మ‌రోసారి చంద్ర‌బాబు నిర్ణ‌యం తీసుకోవాల‌న్న సూచ‌న‌లు వినిపిస్తున్నాయి.

This post was last modified on June 19, 2025 11:38 am

Share

Recent Posts

మల్లెపూల పల్లకి… ఊగుతున్న థియేటర్లు

ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…

36 minutes ago

శాశ్వత సెలవు తీసుకున్న షావుకారు జానకి

దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…

2 hours ago

సింగిల్ సింహం అంటారు… ఇదేం రాజకీయం జగన్?

ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…

2 hours ago

వివేకా కేసులో ముగియని సునీత పోరాటం

వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…

2 hours ago

రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు… లండన్ నుంచే ఇండియాకు..

విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…

3 hours ago

కాంగ్రెస్ లో కొండా కార్చిచ్చు

సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…

5 hours ago