నాయకుడు అన్నాక.. మీడియాతో అనుబంధం ఉంటుంది. నాయకులకు-మీడియాకు మధ్య అవినాభావ సంబంధం కూడా పెరిగిపోయింది. ఎంత సేపూ.. మీడియా ముందు ఉండాలనే నాయకులు కోరుకుంటారు. అవసరం వస్తే.. అదే పనిగా మీడియా ముందు కూర్చునే నాయకులు కూడా.. ఏపీలో బాగానే ఉన్నారు. మీడియా ముందు సంచలన వ్యాఖ్యలు చేయడంతోపాటు.. సంచలనాలు సృష్టించాలని బావించే వారు కూడా ఉన్నారు. అయితే.. ఇప్పుడు వీరికి పనిలేకుండా పోయింది.
ముఖ్యంగా టీడీపీలో నాయకులు ఫైర్ బ్రాండ్లుగా ముద్ర వేసుకున్న వారు కూడా ఉన్నారు. ఉదాహరణకు చింతమనేని ప్రభాకర్, యరపతినేని శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణ మూర్తి, గంటా శ్రీనివాసరావు వంటి వారు ఏం మాట్లాడినా .. సంచలనాలు సృష్టిస్తాయి. వారికి ఉన్న ఇమేజ్ అలాంటింది. దీంతో గతంలో వారు తరచుగా మీడియా ముందుకు వచ్చేవారు. ఏదో ఒక విషయంపై వారు ప్రస్తావన చేసేవారు. కానీ, గత ఏడాది కాలంలో వీరు పెద్దగా మీడియా ముందుకు వచ్చిన దాఖలా లేకుండా పోయింది.
ఈ విషయంలో పార్టీ అధిష్టానం నుంచి బలమైన సంకేతాలు వచ్చాయన్న వాదన వినిపిస్తోంది. ఏది ఉన్నా.. ముందుగా తమకు చెప్పి.. ఆ తర్వాతే.. మీడియా ముందుకు రావాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. దీంతో చాలా మంది ఫైర్ బ్రాండ్లు రావడమే మానేశారు. మరో కీలక విషయం ఏంటంటే.. పార్టీ నిర్దేశించిన అంశాలపై మాత్రమే మాట్లాడాలని తేల్చి చెప్పారు. దీంతో ఆ నిర్దేశిత అంశాలపైనే మాట్లాడుతున్నారు. దీంతో వారు సరైన రీతిలో ప్రొజెక్టు కాలేక పోతున్నారన్న వాదన వినిపిస్తుండడం గమనార్హం.
తాజాగా తల్లికి వందనం పథకంపై వైసీపీ కీలక విమర్శలు చేసింది. ఈ పథకంలో మినహాయించుకుం టున్న రూ.2000లు మంత్రినారా లోకేష్ ఖాతాలోకి చేరుతున్నాయని విమర్శించింది. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు దాడి చేయాలని పార్టీ ఆదేశించింది. దీంతో కొందరు నాయకులు మీడియా ముందుకు వచ్చారు. ఇది మినహా .. ఇతర విషయాలపై వారు మాట్లాడే అవకాశం లేకుండా పోయింది.
అయితే.. ఇలా చేయడం సరికాదని.. బలమైన వాయిస్ను పార్టీ వినియోగించుకోవాలని సూచనలు వినిపిస్తున్నాయి. పైగా మంత్రుల డామినేషన్తో కూడా మరికొందరు ఎమ్మెల్యేలు మౌనంగా ఉంటున్నారు. ఎలా చూసినా.. దీనిపై మరోసారి చంద్రబాబు నిర్ణయం తీసుకోవాలన్న సూచనలు వినిపిస్తున్నాయి.
This post was last modified on June 19, 2025 11:38 am
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…
వైసీపీ నేత, ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీలో కోడలు చేసిన ఆరోపణలు పెను కుదుపునకు…
సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…
జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…