ఇవేవీ సినిమా పేర్లు కాదు. ఏపీలో పాలనకు సంబంధించి ముగ్గురు కీలక నాయకులను ఉద్దేశించి ఓ మహిళా ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు. అయితే.. ఇవి సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతుండడం గమనార్హం. తాజాగా రాష్ట్రంలో తల్లికి వందనం పేరుతో కీలకమైన సూపర్ – 6 పథకాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా రూ.13000 చొప్పున ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికీ ఇస్తున్నారు. అయితే.. రూ.15 వేలు ఇస్తామని. 13 వేలు ఇవ్వడం ఏంటన్నది వైసీపీ నుంచి వచ్చిన ప్రశ్న. ఈ 2 వేల సొమ్మును మంత్రి నారా లోకేష్ నొక్కేస్తున్నారని కూడా ఆపార్టీ నాయకులువిమర్శలు గుప్పించారు.
దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు వైసీపీపై విరుచుకుపడ్డారు. మంత్రుల నుంచి ఎమ్మెల్యేల వరకు కూడా పెద్ద ఎత్తున విమర్శ లు గుప్పించారు. మరోవైపు.. నారా లోకేష్ చేసిన సవాల్ను స్వీకరించే దమ్ము కూడా వైసీపీనాయకులకు లేకుండా పోయిందని టీడీపీ మంత్రులు ఒకరిద్దరు దయ్యబట్టారు. అలాగే.. గత వైసీపీ ప్రభుత్వం ఒక్కొక్క కుటుంబానికి ఏటా రూ.30 వేల చొప్పున మాత్రమే అందించిందని.. కానీ బాబు ప్రభుత్వం లక్ష రూపాయల పైచిలుకు అందిస్తోందని మంత్రులు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ స్పందిస్తూ.. వైసీపీపై నిప్పులు చెరిగారు. తల్లిని చెల్లిని ఎగ్గొట్టిన జగన్కు మహిళల కష్టాలు ఏం తెలుస్తాయని ప్రశ్నించారు.
పార్టీ కోసం.. తల్లిని, చెల్లిని కూడా.. జగన్ వాడుకున్నారని.. అదికారంలోకి వచ్చిన తర్వాత వారిని తరిమేశారని వ్యాఖ్యానించా రు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ముగ్గురు నాయకులు ఉన్నారు.. వారు గాడ్ ఫాదర్-గేమ్ ఛేంజర్-రింగ్ మాస్టర్.. అంటూ.. అఖిల ప్రియ చెప్పుకొచ్చారు. సీఎం చంద్రబాబు రాష్ట్రానికి లభించిన గాడ్ ఫాదర్ అని చెప్పారు. ఆయన వల్లే రాష్ట్రం అభివృద్ది పథంలో ముందుకు సాగుతోందన్నారు. ఒకవైపు సంక్షేమం.. మరోవైపు అభివృద్ధిని కూడా ముందుకు తీసుకువెళ్తున్నారని కొనియాడా రు. ఇక, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను గేమ్ చేంజర్తో పోల్చారు. అదేవిధంగా మంత్రి నారా లోకేష్.. `రింగ్ మాస్టర్` మాదిరిగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం భూమా అఖిల ప్రియ చేసినవ్యాఖ్యలు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతుండడం గమనార్హం.
This post was last modified on June 15, 2025 3:00 pm
ఘజియాబాద్లోని భారత్ సిటీ సొసైటీలో గుండెలు పిండేసే విషాదం చోటుచేసుకుంది. ఆన్లైన్ గేమింగ్కు బానిసలైన ముగ్గురు మైనర్ అక్కాచెల్లెళ్లు.. తల్లిదండ్రులు…
అల్లరి నరేష్ కొత్త సినిమా ఆల్కహాల్ టీజర్ వచ్చి అయిదు నెలలు దాటేసింది. దాంట్లో ప్రకటించిన విడుదల తేదీ జనవరి…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కేవలం హీరోయిజం ఉన్న పాత్రలే చేస్తానని ఎప్పుడూ కట్టుబడరు. అందుకే నాలుగు…
టాలీవుడ్లో మంచి అనుబంధం ఉన్న అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు, నాగవంశీలది ఒకటి. ఇద్దరికి బిజినెస్ పరంగా గట్టి బంధమే…
ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి కుటుంబాన్ని సంతోషంలో ముంచెత్తే పరిణామం చోటుచేసుకుంది. చిరు తనయుడు రామ్ చరణ్ కవల పిల్లలకు తండ్రి…
రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు.. ఈ వార్త నిజం కావడానికి దశాబ్దంన్నర పాటు ఎదురు చూడాల్సి వచ్చింది అభిమానులు. వీరి…