ఏపీలో ఇప్పుడు పెను కలకలమే రేపిన సాక్షి చర్చా కార్యక్రమంలో పాలుపంచుకోవడంతో పాటుగా అమరావతిని వేశ్యల రాజధాని అంటూ జుగుత్సాకర వ్యాఖ్యలు చేసిన సీనియర్ జర్నలిస్టు కృష్ణంరాజును పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ పరిధిలోని లోటస్ లో నివసించే కృష్ణంరాజు తనపై కేసు నమోదు కాగానే ఇల్లు వదిలి పారిపోయారు. నేరుగా విశాఖకు వెళ్లి అక్కడ ఆయన తలదాచుకున్నారు.
ఈ కేసులో సాక్షి ఇన్ పుట్ ఎడిటర్, డీటేబ్ హోస్ట్ గా వ్యవహరించిన సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును ఇప్పటికే అరెస్టు చేసిన పోలీసులు కోర్టు ఆదేశాలతో ఆయనను రిమాండ్ కు తరలించారు. ఆ తర్వాత అసలు నిందితుడు కృష్ణంరాజు కోసం పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ఆయన విశాఖలో ఉన్నట్లు గమనించారు. ఆ వెంటనే విశాఖ వెళ్లిన తుళ్లూరు పోలీసులు కృష్ణంరాజును అదుపులోకి తీసుకున్నారు.
ప్రస్తుతం కృష్ణంరాజును పోలీసులు విశాఖ నుంచి విజయవాడకు తరలిస్తున్నారు. గురువారం ఉదయానికంతా విజయవాడ చేరుకోనున్న పోలీసులు… తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో కృష్ణంరాజును విచారించనున్నారు. ఆ తర్వాత గురువారమే ఆయనను కోర్టులో హాజరుపరిచే అవకాశాలున్నాయి. ఇప్పటికే కొమ్మినేనికి కోర్టు రిమాండ్ విధించిన నేపథ్యంలో కృష్ణంరాజుకు కూడా జైలు తప్పదన్న వాదనలు అయితే బలంగా వినిపిస్తున్నాయి. ఈ కేసులో కొమ్మినేని సహా కృష్ణంరాజుకు కూడా ఇప్పుడప్పుడే బెయిల్ లభించే అవకాశాలూ లేవన్న విశ్లేషణలు సాగుతున్నాయి.
This post was last modified on June 11, 2025 10:05 pm
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…