ఏపీలో ఇప్పుడు పెను కలకలమే రేపిన సాక్షి చర్చా కార్యక్రమంలో పాలుపంచుకోవడంతో పాటుగా అమరావతిని వేశ్యల రాజధాని అంటూ జుగుత్సాకర వ్యాఖ్యలు చేసిన సీనియర్ జర్నలిస్టు కృష్ణంరాజును పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ పరిధిలోని లోటస్ లో నివసించే కృష్ణంరాజు తనపై కేసు నమోదు కాగానే ఇల్లు వదిలి పారిపోయారు. నేరుగా విశాఖకు వెళ్లి అక్కడ ఆయన తలదాచుకున్నారు.
ఈ కేసులో సాక్షి ఇన్ పుట్ ఎడిటర్, డీటేబ్ హోస్ట్ గా వ్యవహరించిన సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును ఇప్పటికే అరెస్టు చేసిన పోలీసులు కోర్టు ఆదేశాలతో ఆయనను రిమాండ్ కు తరలించారు. ఆ తర్వాత అసలు నిందితుడు కృష్ణంరాజు కోసం పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ఆయన విశాఖలో ఉన్నట్లు గమనించారు. ఆ వెంటనే విశాఖ వెళ్లిన తుళ్లూరు పోలీసులు కృష్ణంరాజును అదుపులోకి తీసుకున్నారు.
ప్రస్తుతం కృష్ణంరాజును పోలీసులు విశాఖ నుంచి విజయవాడకు తరలిస్తున్నారు. గురువారం ఉదయానికంతా విజయవాడ చేరుకోనున్న పోలీసులు… తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో కృష్ణంరాజును విచారించనున్నారు. ఆ తర్వాత గురువారమే ఆయనను కోర్టులో హాజరుపరిచే అవకాశాలున్నాయి. ఇప్పటికే కొమ్మినేనికి కోర్టు రిమాండ్ విధించిన నేపథ్యంలో కృష్ణంరాజుకు కూడా జైలు తప్పదన్న వాదనలు అయితే బలంగా వినిపిస్తున్నాయి. ఈ కేసులో కొమ్మినేని సహా కృష్ణంరాజుకు కూడా ఇప్పుడప్పుడే బెయిల్ లభించే అవకాశాలూ లేవన్న విశ్లేషణలు సాగుతున్నాయి.
This post was last modified on June 11, 2025 10:05 pm
జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని…
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…