Political News

సుప‌రిపాల‌న‌-స్వ‌ర్ణాంధ్ర‌.. 12న వేడుక‌!

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డి ఈ నెల 12కు ఏడాది పూర్త‌వుతుంది. వాస్త‌వానికి ఎన్నిక‌ల ఫ‌లితం వ‌చ్చింది జూన్ 4నే అయినా.. ప్ర‌భుత్వం బాధ్య‌త‌లు చేప‌ట్టింది మాత్రం గ‌త ఏడాది జూన్ 12న. దీంతో ఈ నెల 12నాటికి రాష్ట్రంలో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డి సంవ‌త్స‌రం పూర్త‌వుతుంది. ఈ నేప‌థ్యాన్ని పుర‌స్క‌రించుకుని పార్టీల ప‌రంగా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించేందుకు టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీలు రెడీ అయ్యాయి. ఈ పార్టీల్లోనూ టీడీపీ నేత‌లు.. ముఖ్యంగా ఎమ్మెల్యేలు, మంత్రులు ప్ర‌జ‌ల‌ను క‌లుసుకునేం దుకు ప్లాన్ చేసుకున్నారు. ఇంటింటికీ వెళ్లి ఏడాది పాల‌న‌పై వారు వివ‌రించ‌నున్నారు.

ఇక‌, జ‌న‌సేన కూడా ఈ నెల 12న పార్టీ రాష్ట్ర కార్యాల‌యం స‌హా.. క్షేత్ర‌స్థాయిలోనూ విజ‌యోత్స‌వాలు చేసుకోవాల‌ని పిలుపుని చ్చింది. రాష్ట్ర స్థాయి కార్య‌క్ర‌మంలో డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ పాల్గొంటారు. బీజేపీ మాత్రం రాష్ట్ర స్థాయిలో కూట‌మి విజ‌యం కంటే.. కూడా ప్ర‌ధాని మోడీ విజ‌యంపైనే దృష్టి పెట్టింది. ఆ మేర‌కు అన్ని పార్టీ కార్యాల‌యాల్లోనూ మోడీ విజ‌యంపై కార్య‌క్ర‌మా లు చేప‌ట్ట‌నున్నారు. ఇలా.. మూడు పార్టీలూ వివిధ రూపాల్లో ఈ నెల 12న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించాయి. అయితే. తాజాగా ప్ర‌భుత్వం తర‌ఫున కూడా విజ‌యోత్స‌వ వేడుక‌లు నిర్వ‌హించేందుకు స‌ర్కారు రెడీ అయింది.

దీనిలో భాగంగా ‘సుపరిపాలన- స్వర్ణాంధ్రప్రదేశ్‌’ పేరుతో రాష్ట్ర స్థాయి వేడుక నిర్వహించేందుకు ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ నెల 12న‌(గురువారం) సాయంత్రం రాష్ట్ర స్థాయిలోఈ వేడుకలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కె. విజ‌యానంద్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో అన్ని పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్‌, ఐపీఎస్‌లు పాల్గొనాల‌ని పేర్కొన్నారు. రాజ‌ధాని అమ‌రావ‌తిలోనే కాకుండా.. జిల్లాల స్థాయిలోనూ క‌లెక్ట‌ర్ల ఆఫీసుల వ‌ద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వ‌హించాల‌ని ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌తి ఒక్క‌రూ పాల్గొనాల‌ని సూచించారు.

ఈ ఏడాది కాలంలో ప్ర‌భుత్వం చేప‌ట్టిన కార్య‌క్ర‌మాలు, అమ‌లు చేసిన సంక్షేమం.. అదేవిధంగా విజ‌న్ 2047, స్వ‌ర్ణాంధ్ర‌-2047 వంటి వాటిని వివ‌రించాల‌ని క‌లెక్ట‌ర్ల‌కు, ఆర్డీవోల‌కు సూచించారు. అలాగే.. పింఛ‌న్ల‌ను అందిస్తున్న తీరు, వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అందుతున్న సేవ‌ల‌ను హైలెట్ చేయాల‌న్నారు. అదేవిధంగా ప‌లు సాంస్కృతిక కార్య‌క్ర‌మాల ద్వారా కూడా.. ప్ర‌భుత్వం సాధించిన ఏడాది ప్ర‌గ‌తిని ప్ర‌జ‌ల‌కు వివ‌రించే ప్ర‌య‌త్నం చేయాల‌ని ఉత్త‌ర్వుల్లో స్ప‌ష్టం చేయ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on June 10, 2025 7:33 pm

Share

Recent Posts

కాక్రోచులను వెనక్కి తరిమిన వారెవరు?

విద్యార్థి ఉద్య‌మాల‌కు తెర‌దీసిన కాక్రోచ్ జ‌న‌తా పార్టీ(సీజేపీ) నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు తొలిసారి ప‌రాభవం ఎదురైంది. ఇటీవ‌ల నీట్ ప్ర‌శ్న ప‌త్రం…

8 minutes ago

పూర్ణ డాన్సులో రజినీకాంత్ కనిపించట్లేదు

ఎలా కనుక్కున్నారో కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి పాట కోసం క్యారెక్టర్ ఆర్టిస్టు పూర్ణతో కొన్ని…

54 minutes ago

క‌ళ్లు చెదిరే ధ‌ర‌… రాయ‌దుర్గంలో ఎక‌రా 264 కోట్లు!

హైద‌రాబాద్ న‌గ‌రంలోని రాయ‌దుర్గం భూముల్లో కొంత భాగాన్ని ప్ర‌భుత్వం వేలం వేసింది. అయితే.. మునుపెన్న‌డూ లేని విధంగా క‌ళ్లు చెదిరే…

1 hour ago

ఆ వివాదాస్పద ఐపీఎస్ ఇంట పెళ్లికి జగన్

హైదరాబాద్‌లో జరిగిన ఓ వివాహ వేడుకకు వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ హాజరయ్యారు. సీనియర్ ఐపీఎస్ అధికారి…

1 hour ago

ఆ ఒక్కటి అడగొద్దంటే ఎలా విశ్వంభరా

ప్రతి సంవత్సరం లాగే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఆయన అభిమానులు హైదరాబాద్ లో ఘనంగా జరుపుకున్నారు. దీనికి మెగా…

1 hour ago

వైసీపీ ఎంపీ అవినాష్ ఇంట్లో భారీగా డ‌బ్బు స్వాధీనం

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు సోద‌రుడి వ‌రుస‌య్యే క‌డ‌ప ఎంపీ.. వైఎస్ అవినాష్ రెడ్డి నివాసం నుంచి ఎన్ ఫోర్స్ మెంటు…

3 hours ago