Political News

సుప‌రిపాల‌న‌-స్వ‌ర్ణాంధ్ర‌.. 12న వేడుక‌!

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డి ఈ నెల 12కు ఏడాది పూర్త‌వుతుంది. వాస్త‌వానికి ఎన్నిక‌ల ఫ‌లితం వ‌చ్చింది జూన్ 4నే అయినా.. ప్ర‌భుత్వం బాధ్య‌త‌లు చేప‌ట్టింది మాత్రం గ‌త ఏడాది జూన్ 12న. దీంతో ఈ నెల 12నాటికి రాష్ట్రంలో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డి సంవ‌త్స‌రం పూర్త‌వుతుంది. ఈ నేప‌థ్యాన్ని పుర‌స్క‌రించుకుని పార్టీల ప‌రంగా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించేందుకు టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీలు రెడీ అయ్యాయి. ఈ పార్టీల్లోనూ టీడీపీ నేత‌లు.. ముఖ్యంగా ఎమ్మెల్యేలు, మంత్రులు ప్ర‌జ‌ల‌ను క‌లుసుకునేం దుకు ప్లాన్ చేసుకున్నారు. ఇంటింటికీ వెళ్లి ఏడాది పాల‌న‌పై వారు వివ‌రించ‌నున్నారు.

ఇక‌, జ‌న‌సేన కూడా ఈ నెల 12న పార్టీ రాష్ట్ర కార్యాల‌యం స‌హా.. క్షేత్ర‌స్థాయిలోనూ విజ‌యోత్స‌వాలు చేసుకోవాల‌ని పిలుపుని చ్చింది. రాష్ట్ర స్థాయి కార్య‌క్ర‌మంలో డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ పాల్గొంటారు. బీజేపీ మాత్రం రాష్ట్ర స్థాయిలో కూట‌మి విజ‌యం కంటే.. కూడా ప్ర‌ధాని మోడీ విజ‌యంపైనే దృష్టి పెట్టింది. ఆ మేర‌కు అన్ని పార్టీ కార్యాల‌యాల్లోనూ మోడీ విజ‌యంపై కార్య‌క్ర‌మా లు చేప‌ట్ట‌నున్నారు. ఇలా.. మూడు పార్టీలూ వివిధ రూపాల్లో ఈ నెల 12న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించాయి. అయితే. తాజాగా ప్ర‌భుత్వం తర‌ఫున కూడా విజ‌యోత్స‌వ వేడుక‌లు నిర్వ‌హించేందుకు స‌ర్కారు రెడీ అయింది.

దీనిలో భాగంగా ‘సుపరిపాలన- స్వర్ణాంధ్రప్రదేశ్‌’ పేరుతో రాష్ట్ర స్థాయి వేడుక నిర్వహించేందుకు ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ నెల 12న‌(గురువారం) సాయంత్రం రాష్ట్ర స్థాయిలోఈ వేడుకలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కె. విజ‌యానంద్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో అన్ని పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్‌, ఐపీఎస్‌లు పాల్గొనాల‌ని పేర్కొన్నారు. రాజ‌ధాని అమ‌రావ‌తిలోనే కాకుండా.. జిల్లాల స్థాయిలోనూ క‌లెక్ట‌ర్ల ఆఫీసుల వ‌ద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వ‌హించాల‌ని ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌తి ఒక్క‌రూ పాల్గొనాల‌ని సూచించారు.

ఈ ఏడాది కాలంలో ప్ర‌భుత్వం చేప‌ట్టిన కార్య‌క్ర‌మాలు, అమ‌లు చేసిన సంక్షేమం.. అదేవిధంగా విజ‌న్ 2047, స్వ‌ర్ణాంధ్ర‌-2047 వంటి వాటిని వివ‌రించాల‌ని క‌లెక్ట‌ర్ల‌కు, ఆర్డీవోల‌కు సూచించారు. అలాగే.. పింఛ‌న్ల‌ను అందిస్తున్న తీరు, వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అందుతున్న సేవ‌ల‌ను హైలెట్ చేయాల‌న్నారు. అదేవిధంగా ప‌లు సాంస్కృతిక కార్య‌క్ర‌మాల ద్వారా కూడా.. ప్ర‌భుత్వం సాధించిన ఏడాది ప్ర‌గ‌తిని ప్ర‌జ‌ల‌కు వివ‌రించే ప్ర‌య‌త్నం చేయాల‌ని ఉత్త‌ర్వుల్లో స్ప‌ష్టం చేయ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on June 10, 2025 7:33 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

12 minutes ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

21 minutes ago

రాజాసాబ్.. దేవర రూట్లో వెళ్లినా..

సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…

50 minutes ago

ప్రసాదు ప్రీమియర్ల మీదే అందరి కన్ను

సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…

2 hours ago

మాజీ సీబీఐ డైరెక్టర్ సతీమణి సైబర్ వలలో పడడమా…

వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…

2 hours ago

బ్లాక్ బస్టర్ పాటలకు పెన్ను పెట్టకుండా ఎలా?

వేటూరి, సిరివెన్నెల లాంటి దిగ్గజ గేయ రచయితలు వెళ్ళిపోయాక తెలుగు సినీ పాటల స్థాయి తగ్గిపోయిందని సాహితీ అభిమానులు బాధ…

4 hours ago