ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ నెల 12కు ఏడాది పూర్తవుతుంది. వాస్తవానికి ఎన్నికల ఫలితం వచ్చింది జూన్ 4నే అయినా.. ప్రభుత్వం బాధ్యతలు చేపట్టింది మాత్రం గత ఏడాది జూన్ 12న. దీంతో ఈ నెల 12నాటికి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తవుతుంది. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని పార్టీల పరంగా కార్యక్రమాలు నిర్వహించేందుకు టీడీపీ, జనసేన, బీజేపీలు రెడీ అయ్యాయి. ఈ పార్టీల్లోనూ టీడీపీ నేతలు.. ముఖ్యంగా ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రజలను కలుసుకునేం దుకు ప్లాన్ చేసుకున్నారు. ఇంటింటికీ వెళ్లి ఏడాది పాలనపై వారు వివరించనున్నారు.
ఇక, జనసేన కూడా ఈ నెల 12న పార్టీ రాష్ట్ర కార్యాలయం సహా.. క్షేత్రస్థాయిలోనూ విజయోత్సవాలు చేసుకోవాలని పిలుపుని చ్చింది. రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొంటారు. బీజేపీ మాత్రం రాష్ట్ర స్థాయిలో కూటమి విజయం కంటే.. కూడా ప్రధాని మోడీ విజయంపైనే దృష్టి పెట్టింది. ఆ మేరకు అన్ని పార్టీ కార్యాలయాల్లోనూ మోడీ విజయంపై కార్యక్రమా లు చేపట్టనున్నారు. ఇలా.. మూడు పార్టీలూ వివిధ రూపాల్లో ఈ నెల 12న కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించాయి. అయితే. తాజాగా ప్రభుత్వం తరఫున కూడా విజయోత్సవ వేడుకలు నిర్వహించేందుకు సర్కారు రెడీ అయింది.
దీనిలో భాగంగా ‘సుపరిపాలన- స్వర్ణాంధ్రప్రదేశ్’ పేరుతో రాష్ట్ర స్థాయి వేడుక నిర్వహించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 12న(గురువారం) సాయంత్రం రాష్ట్ర స్థాయిలోఈ వేడుకలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో అన్ని పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్లు పాల్గొనాలని పేర్కొన్నారు. రాజధాని అమరావతిలోనే కాకుండా.. జిల్లాల స్థాయిలోనూ కలెక్టర్ల ఆఫీసుల వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని సూచించారు.
ఈ ఏడాది కాలంలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, అమలు చేసిన సంక్షేమం.. అదేవిధంగా విజన్ 2047, స్వర్ణాంధ్ర-2047 వంటి వాటిని వివరించాలని కలెక్టర్లకు, ఆర్డీవోలకు సూచించారు. అలాగే.. పింఛన్లను అందిస్తున్న తీరు, వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అందుతున్న సేవలను హైలెట్ చేయాలన్నారు. అదేవిధంగా పలు సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా కూడా.. ప్రభుత్వం సాధించిన ఏడాది ప్రగతిని ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేయడం గమనార్హం.
This post was last modified on June 10, 2025 7:33 pm
ఒకప్పుడు తెలుగు సినిమాల మీద తమిళ చిత్రాలు స్పష్టమైన ఆధిపత్యం చూపించేవి. అక్కడ ఎంతోమంది మేటి దర్శకులు ఉండేవాళ్లు. కొత్త…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరో టెస్ట్ ఎదురు కానుందా? మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం చూస్తున్న నేపథ్యంలో ఆయన ఎవరిని…
ఎంతో గొప్ప పేరు సంపాదించిన లెజెండరీ డైరెక్టర్లలో చాలామంది 70 ఏళ్ల వయసు రాగానే సినిమాలు ఆపేస్తుంటారు. ఆదూర్ గోపాలకృష్ణన్…
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 విడుదల ముందు అనుకున్న ప్రకారమైతే…
దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…
పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…