Political News

పోలీసులూ మీ ఇష్టం : చంద్ర‌బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు రాష్ట్ర పోలీసుల‌కు పూర్తి స్వేచ్ఛ‌ను ఇస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. “పోలీసులూ మీ ఇష్టం. ఎలాంటి చ‌ర్య‌లు తీసుకున్నా.. నేనేమీ అడ‌గ‌ను. కానీ, రాష్ట్రంలో మ‌హిళ‌ల‌కు, యువ‌తుల‌కు, చిన్నారుల‌కు భ‌ద్ర‌త క‌ల్పించాలి. అసాంఘిక శ‌క్తులు నేరం చేయాలంటేనే వ‌ణుకు పుట్టేలా చేయాలి” అని ఆయ‌న వ్యాఖ్యానించారు. తాజాగా స‌చివాల‌యంలో రాష్ట్ర డీజీపీ స‌హా హోం శాఖ సెక్ర‌ట‌రీతో చంద్ర‌బాబు భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా గ‌త వారం రోజుల్లో రాష్ట్రంలో వెలుగు చూసిన ప‌లు కీల‌క అంశాల‌పై వారితో చ‌ర్చించారు. త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు.

అనంత‌పురంలో ఇంట‌ర్ విద్యార్థిని దారుణ హ‌త్య‌, క‌ర్నూలులో బాలిక‌పై సామూహిక అత్యాచారం.. వంటివాటిని ప్ర‌స్తావించారు. పోలీసుల‌కు స్వేచ్ఛ‌నిస్తున్నామ‌ని.. అయినా.. నేరాలు జ‌రుగుతూనే ఉన్నాయ‌ని చెప్పారు. ముఖ్యంగా గంజాయి ముఠా ఆగ‌డాల‌కు అడ్డుక‌ట్ట ప‌డ‌డం లేద‌న్నారు. ఈ విష‌యంలో పోలీసులు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకున్నా.. తాను త‌ప్పుబ‌ట్ట‌న‌ని చెప్పారు. రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు అత్యంత ముఖ్య‌మని సీఎం తేల్చి చెప్పారు. గ‌త వారంలో జ‌రిగిన రెండు మూడు ఘ‌ట‌న‌లు త‌న‌ను కూడా క‌ల‌చి వేశాయ‌న్నారు. ఇలాంటి ప‌రిస్థితి ఎందుకు వ‌స్తోంద‌ని ప్ర‌శ్నించారు. కేసు పూర్వాపరాలు పూర్తిగా తెలుసుకున్న ఆయ‌న త‌గిన శిక్ష‌లు ప‌డేలా కోర్టులో వాద‌న‌లు వినిపించాల‌ని సూచించారు.

నిందితుల‌ను ఉపేక్షించ‌రాద‌ని సీఎం సూచించారు. ముఖ్యంగా మ‌హిళ‌లు, చిన్నారుల‌పై జ‌రుగుతున్న అఘాయిత్యాల‌ను క‌ట్ట‌డి చేయాల‌ని చెప్పారు. వ్య‌వ‌స్థీకృత నేరాల‌కు పాల్ప‌డే వారిని నిరంత‌రం ప‌ర్యవేక్షించాల‌ని.. అవ‌స‌ర‌మైతే.. ముందుగానే వారిని అదుపులోకి తీసుకుని వార్నింగ్ ఇవ్వాల‌ని సూచించారు. నేరాలకు పాల్పడే వారికి శిక్ష తప్పదనే అభిప్రాయాన్ని కలిగించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. వైసీపీ హ‌యాంలో శాంతి భ‌ద్ర‌త‌లు గాడి త‌ప్పాయ‌ని.. అందుకే ప్ర‌జ‌లు కూట‌మి ప్ర‌భుత్వంపై చాలా ఆశలు పెట్టుకున్నార‌ని వివ‌రించారు. ఈ విష‌యంలో అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించాల‌ని సూచించారు. గ‌తంలో గంజాయికి బానిస‌లుగా మారిన యువ‌త‌ను కూడా క‌నిపెట్టాల‌న్నారు.

ఇక‌, తాజాగా వెలుగు చూసిన సెక్స్ వ‌ర్క‌ర్స్ రిపోర్టుపైనా చంద్ర‌బాబు చ‌ర్చించారు. ఇది వాస్త‌వ‌మైతే.. వెంట‌నే చ‌ర్య‌లు తీసుకుని.. మ‌హిళ‌ల‌ను, యువ‌తుల‌ను ఆ వృత్తిలోకి దింపే వారిని క‌ట్ట‌డి చేసి పీడీ యాక్టులు బ‌నాయించాల‌ని పోలీసుల‌ను ఆదేశించారు. ఎట్టి ప‌రిస్థితిలోనూ ఇలాంటివారిని ఉపేక్షించరాద‌న్నారు. ఈ విష‌యంలో రాజ‌కీయాల‌కు అతీతంగా పోలీసులు ప‌నిచేయాల‌ని, ప్ర‌భుత్వానికి మ‌చ్చ‌తెచ్చేవారు ఎంత‌టివారైనా ఉపేక్షించ‌రాద‌ని తేల్చి చెప్పారు.

This post was last modified on June 10, 2025 7:29 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి.. జ‌గ‌న్‌ పై బాబు సీరియ‌స్

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై సీఎం చంద్ర‌బాబు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. వైసీపీ పాల‌న‌తో రాష్ట్రం పూర్తిగా విధ్వంస‌మైందని అన్నారు.…

36 minutes ago

అమరావతిపై జగన్‌కు 5 ప్రశ్నలు..!

అమరావతి రాజధానిపై వైసీపీ అధినేతగా జగన్ చేసిన తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని విషయంలో…

2 hours ago

జ‌గ‌న్ రోడ్డున ప‌డేస్తే.. కూట‌మి ఆదుకుంది!

వైసీపీ అధినేత జ‌గ‌న్ హ‌యాంలో ఓ కుటుంబం రోడ్డున ప‌డింది. కేవ‌లం మాస్క్ అడిగిన పాపానికి ప్రభుత్వం క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రించి…

3 hours ago

కోనసీమకు ప్రభుత్వం గుడ్ న్యూస్

కోనసీమ జిల్లా వాసులు ఎంతో పవిత్రంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునే పండుగ జగ్గన్నతోట ప్రభల తీర్థం. ఇది తరతరాలుగా సంప్రదాయబద్ధంగా కొనసాగుతూ…

3 hours ago

పిఠాపురంలో పిచ్చి పిచ్చి వేషాలేస్తే…

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. వైసీపీ నేత‌ల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో పిచ్చి పిచ్చి…

3 hours ago

రాజు గారెక్కడ రాజాసాబ్?

ప్రభాస్‌ను సూటులో స్టైలిష్ గా చూపిస్తూ ‘రాజాసాబ్’ సినిమా ఫస్ట్ గ్లింప్స్ వదిలినపుడు ఇది ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ అనుకున్నారంతా.…

5 hours ago