Political News

ఇలా చేస్తే.. రేవంత్‌కు ఫ్రీహ్యాండ్ ఇచ్చిన‌ట్టా?

తెలంగాణలో కొత్తగా ముగ్గురు మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి తన క్యాబినెట్ లోకి తీసుకున్నారు. అయితే ఈ ప్రక్రియ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కనుస‌న్న‌ల్లోనే జరిగింది. సుదీర్ఘకాలంగా వాయిదా పడుతూ వచ్చిన మంత్రివర్గ విస్తరణకు ఎట్టకేలకు ఇటీవల ఫుల్ స్టాప్‌ పెట్టారు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి వివేక్ వెంక‌ట‌స్వామి, అడ్లూరి ల‌క్ష్మ‌ణ్‌ల‌ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అలాగే మరొకరికి కూడా అవకాశం కల్పించారు.

ఇంతవరకు బాగానే ఉన్నా ఇప్పుడు విపక్షాలకు అవకాశం ఇచ్చేలా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వ్యవహరిస్తోం దన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే సహజంగా జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో మంత్రి వర్గం ఎంపిక వరకు పార్టీ అధిష్టానం చెప్పాల్సిందేనని ఒక ప్రచారం అయితే ఉంది. గతంలో కూడా ఇది అమలైంది. కానీ.. ఇప్పుడు తీసుకున్నది ముగ్గురిని అయినప్పటికీ వీరికి ఏఏ శాఖలు ఇవ్వాలి? అనే విషయం కూడా అధిష్టానమే నిర్ణయించాల్సిన పరిస్థితి రావడం విమర్శలకు దారి తీస్తోంది.

తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. అక్కడ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీతో ఆయ‌న‌ భేటీ అయ్యారు. ఈ భేటీలో తాజాగా తీసుకున్న ముగ్గురికి ఏఏ శాఖలు ఇవ్వాలి? వారికి ఏ ఏ బాధ్యతలు అప్పగించాలనే విషయంపై చర్చించటం గమనార్హం. దీనిపై ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నాయకులు నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాన్ని కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు శాసిస్తున్నారని విమర్శలు గుర్తిస్తున్నారు.

నిజానికి రేవంత్ రెడ్డికి బాధ్యతలు అప్పగించినప్పుడు పూర్తిగా స్వేచ్ఛనిస్తున్నట్టు అప్పట్లో రాహుల్ గాంధీ ప్రకటించారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు కూడా రేవంత్ రెడ్డికి స్వేచ్ఛ ఇస్తున్నట్టు చెప్పుకొచ్చారు. కానీ తర్వాత పరిణామాలు మాత్రం మారుతూ వచ్చాయి. ప్రతి విషయానికి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లడం అక్కడ చర్చించడం మళ్ళీ ఇక్కడికి రావడం, ఎక్కడి నుంచి జాబితాను తీసుకుని అక్కడికి వెళ్లడం అక్కడ నిర్ణయం తీసుకోవడం ఇక్కడ అమలు చేయడం ఇదే సరిపోతుంది.

ప్రతి విషయంలోనూ కేంద్రంలోని పెద్దల జోక్యం పెరుగుతుండటంతో స్థానికంగా రేవంత్ రెడ్డి గ్రాఫ్ ప్రమాదంలో పడే అవకాశం ఉందని విశ్లేషకులు కూడా చెబుతున్నారు. వాస్తవానికి విధానపరమైనటు వంటి నిర్ణయాల్లో కాంగ్రెస్ పార్టీ ఒకింత జోక్యం చేసుకున్నా పర్వాలేదని కానీ మంత్రివర్గంలో ఏ శాఖల కేటాయించాలో కూడా చర్చించడం అధిష్టానం చెప్పిన ప్రకారం రేవంత్ రెడ్డి వ్యవహరించడం అనేది సబబు కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాలు ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల నాటికి పార్టీ పరిస్థితి ఇబ్బందిగా మారుతుందని కూడా హెచ్చరిస్తున్నారు.

This post was last modified on June 10, 2025 3:32 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నెల రోజుల గ్యాపులో బాబాయ్ అబ్బాయ్

రెండు పెద్ద సినిమాల విడుదల తేదీ విషయంలో క్లారిటీ వచ్చేసింది. ముందు నుంచి ప్రచారం జరిగినట్టు పెద్ది వదిలేసుకున్న మార్చి…

47 minutes ago

లెజెండ్ పోయాడు… లీడర్ వస్తున్నాడు

నాలుగేళ్ల క్రితం తమిళ హీరోగా మనకూ పరిచయమైన శరవణన్ 'ది లెజెండ్'తో డెబ్యూ చేసి తెరంగేట్రంతోనే ట్రోలింగ్ చవి చూడాల్సి…

51 minutes ago

గేమ్ కోసం ఫోన్ ఇవ్వలేదని ముగ్గురు అక్కాచెల్లెళ్ళు…

​ఘజియాబాద్‌లోని భారత్ సిటీ సొసైటీలో గుండెలు పిండేసే విషాదం చోటుచేసుకుంది. ఆన్‌లైన్ గేమింగ్‌కు బానిసలైన ముగ్గురు మైనర్ అక్కాచెల్లెళ్లు.. తల్లిదండ్రులు…

3 hours ago

అల్లరోడి ఆల్కహాల్ అడ్రస్ ఎక్కడ

అల్లరి నరేష్ కొత్త సినిమా ఆల్కహాల్ టీజర్ వచ్చి అయిదు నెలలు దాటేసింది. దాంట్లో ప్రకటించిన విడుదల తేదీ జనవరి…

4 hours ago

మామతో దళపతి… మాజీ అల్లుడితో ఎమోషనల్ డ్రామా

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కేవలం హీరోయిజం ఉన్న పాత్రలే చేస్తానని ఎప్పుడూ కట్టుబడరు. అందుకే నాలుగు…

4 hours ago

దిల్ రాజుకు, నాగవంశీకి చెడిందా?

టాలీవుడ్లో మంచి అనుబంధం ఉన్న అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు, నాగవంశీలది ఒకటి. ఇద్దరికి బిజినెస్ పరంగా గట్టి బంధమే…

5 hours ago