అదేదో సామెత చెప్పినట్టు… దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగాయట. అంతా అయిపోయింది. వైసీపీ చేతిలోని చాలా స్థానిక సంస్థలు కూటమి పార్టీల పరం అయిపోయాయి. ఇదంతా జరిగి నెలలు గడుస్తోంది. జనం కూడా ఈ విషయాలను మరిచిపోయారు. మరి ఈ విషయాలను జనానికి మళ్లీ గుర్తు చేయాలనుకున్నారో, ఏమో తెలియదు గానీ… ఆయా స్థానిక సంస్థల్లో తమకు జెల్ల కొట్టిన నేతలపై వైసీపీ తాజాగా సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు ఆదివారం వైసీపీ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా చర్చ నడుస్తోంది.
ఏపీలో విశాఖ, గుంటూరు, తిరుపతి వంటి కీలక కార్పొరేషన్లలో పాలక వర్గాలు వైసీపీ నుంచి టీడీపీకి మారిపోయాయి. ప్రత్యేకించి గుంటూరులో వైసీపీ అధికారాన్ని నిలబెట్టుకునే దిశగా నగర మాజీ మేయర్ కావటి మనోహర్ నాయుడు తీవ్రంగా కష్టపడ్డారు. అయితే ఆయనకు పార్టీ నుంచి పెద్దగా మద్దతు లభించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఏకంగా గుంటూరు మేయర్ పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత పెద్దగా కష్టం లేకుండానే టీడీపీ గుంటూరు మేయర్ పీఠాన్ని వైసీపీ నుంచి లాగేసుకుంది.
ఈ పరిణామాలపై ఒక్క అంబటి రాంబాబు తప్పించి పెద్దగా మాట్లాడిన నేతలే లేరు. నిన్నటిదాకా ఈ వ్యవహారంపై నోరు విప్పని వైసీపీ తాజాగా ఆదివారం కావటి మనోహర్ నాయుడుతో పాటు మరో ఇద్దరు కార్పొరేటర్లు మర్రి అంజలి, యాట్ల రవికుమార్ లపై సస్పెన్షన్ వేటు వేసింది. వీరు ముగ్గురితో పాటు చాలా మంది కార్పొరేటర్లు వైసీపీని వీడి టీడీపీలో చేరిపోయారు కూడా. అయితే వారిపై ఎలాంటి చర్యల మాటను వైసీపీ ప్రస్తావించకపోవడం గమనార్హం. ఎప్పుడో జరిగిపోయిన వ్యవహారాలపై ఇంత ఆలస్యంగా చర్యలు తీసుకోవడం, అది కూడా అరకొరగానే వైసీపీ చర్యలు తీసుకోవడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
ఇదిలా ఉంటే… టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గ పరిధిలో కూడా పలువురు పార్టీ నేతలపై వైసీపీ చర్యలు తీసుకుంది. కుప్పం మునిసిపాలిటీతో పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించారని ఆరోపిస్తూ 10 మంది కౌన్సిర్లపై వైసీపీ సస్పెన్షన్ వేటు వేసింది. ఇక కుప్పం పరిధిలోని శాంతిపురం మండల పరిధిలోని ఓ జడ్పీటీసీతో పాటు మరో ఐదుగురు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులపైనా వైసీపీ వేటు వేసింది. ఈ చర్యలతో కుప్పం పరిధిలో మొత్తంగా 16 మందిపై వైసీపీ చర్యలు తీసుకున్నట్టు అయ్యింది.
అగ్రరాజ్యం అమెరికాలో శాశ్వత నివాసం కోసం గ్రీన్ కార్డ్.. అత్యంత కీలకం. దీనిని సాధించడమే మహా యజ్ఞం చేసినంత పనిగా…
ఒకప్పుడు బంగారం నిల్వల విషయంలో కేజీఎఫ్ గురించి చర్చ జరిగేదని.. కానీ, ఇప్పుడు కర్నూలు జిల్లాలోని జొన్నగిరి గురించి దేశవ్యాప్తంగా…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా అరెస్టు తప్పదా? ఆమెపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన నివేదిక రెడీ అయిందా?…
సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమా ఎట్లకేలకు ఖరారైంది. తన మిత్రుడే అయిన లెెజెండరీ నటుడు కమల్ హాసన్ నిర్మాణంలో…
విజయవాడలోని కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తీవ్ర…
ప్రస్తుతం తెలుగులో ఉన్న ఉత్తమ గేయ రచయితల్లో అనంత శ్రీరామ్ ఒకరు. టీనేజీలో ఇంజినీరింగ్ చదువుతూ లిరిసిస్టుగా మారిన అనంత..…