Political News

అంతా అయ్యాక…వైసీపీలో సస్పెన్షన్ల జాతర!

అదేదో సామెత చెప్పినట్టు… దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగాయట. అంతా అయిపోయింది. వైసీపీ చేతిలోని చాలా స్థానిక సంస్థలు కూటమి పార్టీల పరం అయిపోయాయి. ఇదంతా జరిగి నెలలు గడుస్తోంది. జనం కూడా ఈ విషయాలను మరిచిపోయారు. మరి ఈ విషయాలను జనానికి మళ్లీ గుర్తు చేయాలనుకున్నారో, ఏమో తెలియదు గానీ… ఆయా స్థానిక సంస్థల్లో తమకు జెల్ల కొట్టిన నేతలపై వైసీపీ తాజాగా సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు ఆదివారం వైసీపీ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా చర్చ నడుస్తోంది.

ఏపీలో విశాఖ, గుంటూరు, తిరుపతి వంటి కీలక కార్పొరేషన్లలో పాలక వర్గాలు వైసీపీ నుంచి టీడీపీకి మారిపోయాయి. ప్రత్యేకించి గుంటూరులో వైసీపీ అధికారాన్ని నిలబెట్టుకునే దిశగా నగర మాజీ మేయర్ కావటి మనోహర్ నాయుడు తీవ్రంగా కష్టపడ్డారు. అయితే ఆయనకు పార్టీ నుంచి పెద్దగా మద్దతు లభించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఏకంగా గుంటూరు మేయర్ పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత పెద్దగా కష్టం లేకుండానే టీడీపీ గుంటూరు మేయర్ పీఠాన్ని వైసీపీ నుంచి లాగేసుకుంది.

ఈ పరిణామాలపై ఒక్క అంబటి రాంబాబు తప్పించి పెద్దగా మాట్లాడిన నేతలే లేరు. నిన్నటిదాకా ఈ వ్యవహారంపై నోరు విప్పని వైసీపీ తాజాగా ఆదివారం కావటి మనోహర్ నాయుడుతో పాటు మరో ఇద్దరు కార్పొరేటర్లు మర్రి అంజలి, యాట్ల రవికుమార్ లపై సస్పెన్షన్ వేటు వేసింది. వీరు ముగ్గురితో పాటు చాలా మంది కార్పొరేటర్లు వైసీపీని వీడి టీడీపీలో చేరిపోయారు కూడా. అయితే వారిపై ఎలాంటి చర్యల మాటను వైసీపీ ప్రస్తావించకపోవడం గమనార్హం. ఎప్పుడో జరిగిపోయిన వ్యవహారాలపై ఇంత ఆలస్యంగా చర్యలు తీసుకోవడం, అది కూడా అరకొరగానే వైసీపీ చర్యలు తీసుకోవడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ఇదిలా ఉంటే… టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గ పరిధిలో కూడా పలువురు పార్టీ నేతలపై వైసీపీ చర్యలు తీసుకుంది. కుప్పం మునిసిపాలిటీతో పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించారని ఆరోపిస్తూ 10 మంది కౌన్సిర్లపై వైసీపీ సస్పెన్షన్ వేటు వేసింది. ఇక కుప్పం పరిధిలోని శాంతిపురం మండల పరిధిలోని ఓ జడ్పీటీసీతో పాటు మరో ఐదుగురు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులపైనా వైసీపీ వేటు వేసింది. ఈ చర్యలతో కుప్పం పరిధిలో మొత్తంగా 16 మందిపై వైసీపీ చర్యలు తీసుకున్నట్టు అయ్యింది.

Satya

Recent Posts

పోక్సో కేసు నిందితుడికి బెయిలు రానివ్వకూడదు: రేవంత్ తో పవన్

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘ‌ట‌న దారుణం`` అని…

23 minutes ago

ప్రజాధనం అంటే పవన్ ఒప్పుకోరు

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…

24 minutes ago

ముద్ర‌గ‌డ పాడె మోసిన జ‌గ‌న్‌

కాపు ఉద్య‌మ నాయ‌కుడు, మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం అంత్య‌క్రియ‌లు ముగిశాయి. తూర్పుగోదావ‌రి జిల్లా కిర్లంపూడిలోని ఆయ‌న ఇంటి ప్రాంగ‌ణంలోనే…

54 minutes ago

బాబు సర్కారును పొగిడిన కేటీఆర్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్‌నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య…

58 minutes ago

అభిమానం తోడుతో… ఇంటికి చేరిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌!

ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ముంబైలోని కోకిలా బెన్ ఆసుప‌త్రి నుంచి  డిశ్చార్జ్ అయి..…

2 hours ago

ఇంత అహంకారమెందుకు అంబటి

కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం ఉదయం ముద్రగడను…

2 hours ago